Andhra Pradesh: సినిమాను మించిన క్రైమ్ స్టోరీ..చాలెంజ్ చేసి పగ తీర్చుకుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమాల్లో కథలు గమ్మత్తుగా ఉంటాయి.. సినిమాలో చివరికి హీరోను గెలిపించడానికి డైరెక్టర్ కొత్తగా జిమ్మిక్కులు చేసి కథను సుఖాంతం చేస్తాడు.. కొన్ని సినిమా కథలు ప్రేమతో ఉంటే, మరికొన్ని పగతో రగిలే వాళ్ళు ఎలా ఉంటారు చివరికి వాళ్ల పంతాన్ని ఎలా పూర్తి చేస్తారు అనేది ఒక ప్లాన్ ప్రకారం చూపిస్తారు.. ఆ అంశం సినిమాకు హైలెట్ అవుతుంది.. అదే స్టోరీ ఇప్పుడు రియల్ లైఫ్ లో జరిగింది.. ఓ మహిళా తన కొడుకును చంపిన అందరిని వరుసగా చంపేసింది.. చివరికి పోలీసుల విచారణలో అడ్డంగా దొరికిపోయింది.. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో వెలుగు చూసింది..
పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేట. పల్నాడు పగ, ప్రతీకారాలకు పెట్టింది పేరు. ఒక్కసారి శపథం చేశారంటే.. ఆ మాటకు కట్టుబడి ఉంటారన్న విషయం తెలిసిందే..నర్సరావుపేట పట్టణంలోని ఎస్ ఆర్ కే టీ కాలనీలో జాన్బీ అనే మహిళ నివసిస్తుండేది. అదే కాలనీలో ఉండే బాజీతో వివాహేతర సంబంధం ఉంది. బాజీ పై రౌడీ షీట్ ఉంది. ఈ వివాహేతర సంబంధం ఉందని తెలుసుకున్న జాన్బీ కొడుకు సుభానికి తెలిసింది. దీంతో బాజీ ఆస్తిలో వాటా కావాలంటూ సుభానీ వేధించడం మొదలు పెట్టాడు..వేధింపులు తట్టుకోలేని బాజీ ఒకరోజు సుభానీకి మద్యం పోయించి హత్య చేశాడు. పాల వ్యానులో మృతదేహాన్ని పడేశాడు. ఈ విషయం తెలుసుకున్న జాన్ బీ.. బాజీతో గొడవ పడింది. తన కొడుకు అడ్రస్ చెప్పాలంటూ గట్టిగా ప్రశ్నించింది. దీంతో బాజీ సుభానీని చంపినట్లు ఒప్పుకొని మృతదేహాన్ని చూపించాడు. కొడుకు మృతదేహాన్ని చూసిన జాన్ బి కన్నీరు మున్నీరుగా విలపించింది..
Also Read
- Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం..
- Ambati Rambabu New Case: అంబటి రాంబాబుకి షాక్.. మరో కేసు నమోదు..
- Palnadu Police Crime: పల్నాడులో క్రిమినల్స్గా మారిపోయిన పోలీసులు.. వరుస ఘటనలు.. తాజాగా లాయర్ హత్య..
- Macharla: ఏకాంతంగా ఉన్న జంటలే టార్గెట్.. వీడియోలతో ఏఎస్ఐ అరాచకాలు..!
తన కొడుకు చావుకు ఎవరైతే కారణం అయ్యారో వారందరిని చంపి పగ తీర్చుకుంటున్నాని చెప్పింది.. అదే విధంగా సినిమా పక్కీ లో ఒక్కొక్కరిని చంపింది..ఈ కేసులో ఆరు నెలల పాటు జైల్లో గడిపివచ్చింది. అనంతరం తన కొడుకును పొట్టన పెట్టుకున్న బాజీని హత్య చేసేందుకు సిద్దమైంది. నిన్న ఒంటరిగా దొరికిన బాజీ కళ్ళలో కారం కొట్టి మరీ చంపేశారు. అంతేకాకుండా మృతదేహాన్ని దహనం చేసేందుకు ప్రయత్నించారు.. కానీ స్థానికులు చూడటంతో శవం పై మట్టి పోసి అక్కడి నుంచి ఉడాయించారు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి ఆమెను అరెస్ట్ చేశారు.. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
- Tags
- andrapradesh
- lady
- murders
- palnadu
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!