Andhra Pradesh: సినిమాను మించిన క్రైమ్ స్టోరీ..చాలెంజ్ చేసి పగ తీర్చుకుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమాల్లో కథలు గమ్మత్తుగా ఉంటాయి.. సినిమాలో చివరికి హీరోను గెలిపించడానికి డైరెక్టర్ కొత్తగా జిమ్మిక్కులు చేసి కథను సుఖాంతం చేస్తాడు.. కొన్ని సినిమా కథలు ప్రేమతో ఉంటే, మరికొన్ని పగతో రగిలే వాళ్ళు ఎలా ఉంటారు చివరికి వాళ్ల పంతాన్ని ఎలా పూర్తి చేస్తారు అనేది ఒక ప్లాన్ ప్రకారం చూపిస్తారు.. ఆ అంశం సినిమాకు హైలెట్ అవుతుంది.. అదే స్టోరీ ఇప్పుడు రియల్ లైఫ్ లో జరిగింది.. ఓ మహిళా తన కొడుకును చంపిన అందరిని వరుసగా చంపేసింది.. చివరికి పోలీసుల విచారణలో అడ్డంగా దొరికిపోయింది.. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో వెలుగు చూసింది..
పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేట. పల్నాడు పగ, ప్రతీకారాలకు పెట్టింది పేరు. ఒక్కసారి శపథం చేశారంటే.. ఆ మాటకు కట్టుబడి ఉంటారన్న విషయం తెలిసిందే..నర్సరావుపేట పట్టణంలోని ఎస్ ఆర్ కే టీ కాలనీలో జాన్బీ అనే మహిళ నివసిస్తుండేది. అదే కాలనీలో ఉండే బాజీతో వివాహేతర సంబంధం ఉంది. బాజీ పై రౌడీ షీట్ ఉంది. ఈ వివాహేతర సంబంధం ఉందని తెలుసుకున్న జాన్బీ కొడుకు సుభానికి తెలిసింది. దీంతో బాజీ ఆస్తిలో వాటా కావాలంటూ సుభానీ వేధించడం మొదలు పెట్టాడు..వేధింపులు తట్టుకోలేని బాజీ ఒకరోజు సుభానీకి మద్యం పోయించి హత్య చేశాడు. పాల వ్యానులో మృతదేహాన్ని పడేశాడు. ఈ విషయం తెలుసుకున్న జాన్ బీ.. బాజీతో గొడవ పడింది. తన కొడుకు అడ్రస్ చెప్పాలంటూ గట్టిగా ప్రశ్నించింది. దీంతో బాజీ సుభానీని చంపినట్లు ఒప్పుకొని మృతదేహాన్ని చూపించాడు. కొడుకు మృతదేహాన్ని చూసిన జాన్ బి కన్నీరు మున్నీరుగా విలపించింది..
Also Read
- CM Chandrababu: రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశాం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం
- Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం..
- Ambati Rambabu New Case: అంబటి రాంబాబుకి షాక్.. మరో కేసు నమోదు..
- Palnadu Police Crime: పల్నాడులో క్రిమినల్స్గా మారిపోయిన పోలీసులు.. వరుస ఘటనలు.. తాజాగా లాయర్ హత్య..
తన కొడుకు చావుకు ఎవరైతే కారణం అయ్యారో వారందరిని చంపి పగ తీర్చుకుంటున్నాని చెప్పింది.. అదే విధంగా సినిమా పక్కీ లో ఒక్కొక్కరిని చంపింది..ఈ కేసులో ఆరు నెలల పాటు జైల్లో గడిపివచ్చింది. అనంతరం తన కొడుకును పొట్టన పెట్టుకున్న బాజీని హత్య చేసేందుకు సిద్దమైంది. నిన్న ఒంటరిగా దొరికిన బాజీ కళ్ళలో కారం కొట్టి మరీ చంపేశారు. అంతేకాకుండా మృతదేహాన్ని దహనం చేసేందుకు ప్రయత్నించారు.. కానీ స్థానికులు చూడటంతో శవం పై మట్టి పోసి అక్కడి నుంచి ఉడాయించారు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి ఆమెను అరెస్ట్ చేశారు.. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
- Tags
- andrapradesh
- lady
- murders
- palnadu
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!