Ambati Rambabu: భయపడితే రాజకీయాలు చేయలేం.. అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు..
- జగన్ పల్నాడు పర్యటనపై పోలీసులు చిత్రవిచిత్రమైన ఆంక్షలు పెడుతున్నారు..
- పొదిలి జగన్ పర్యటనలో ప్రభుత్వమే కుట్ర చేసి.. మా కార్యకర్తలపై కేసులు పెట్టారు..
- ప్రభుత్వ వేధింపులకు భయపడితే రాజకీయాలు చేయలేం: మాజీమంత్రి అంబటి రాంబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu: జగన్ పల్నాడు జిల్లా పర్యటనకు పోలీసులు చిత్రవిచిత్రమైన ఆంక్షలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని వైసీపీ మాజీమంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. పోలీసుల వేదింపులకు ఆత్మహత్యకు పాల్పడ్డ వైసీపీ కార్యకర్త నాగ మల్లేశ్వరరావు కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించనున్నారు. ఆయన పర్యటనకు అనుమతి తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు.. జగన్ ఇంట్లో నుంచి బయటకు వస్తే ఊరుకోం అనేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పొదిలి పర్యటనలో పొగాకు రైతులను పరామర్శించేందుకు వెళ్ళారు.. అక్కడ నలుగురు మహిళల్ని పెట్టీ నల్ల బెలూన్లతో జగన్ కి వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు.. వాళ్ళే రాళ్ళు వేసి మావాళ్ళ మీద కేసులు పెట్టారు అని అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు.
Read Also: Minister Seethakka: కేటీఆర్ జైలుకు వెళ్లాలని కుతూహలంగా ఉన్నారు.. మంత్రి ఆసక్తికర వాఖ్యలు..!
Also Read
- Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం..
- Ambati Rambabu New Case: అంబటి రాంబాబుకి షాక్.. మరో కేసు నమోదు..
- Palnadu Police Crime: పల్నాడులో క్రిమినల్స్గా మారిపోయిన పోలీసులు.. వరుస ఘటనలు.. తాజాగా లాయర్ హత్య..
- Macharla: ఏకాంతంగా ఉన్న జంటలే టార్గెట్.. వీడియోలతో ఏఎస్ఐ అరాచకాలు..!
అయితే, పోలీసుల వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పేందుకు జగన్ వస్తున్నారని మాజీమంత్రి అంబటి రాంబాబు తెలిపారు. జగన్ వెళ్తున్నారంటే అనేక మంది అనుసరిస్తారు.. వైఎస్సార్ బిడ్డగా జగన్ కోసం జనం వస్తారు.. పార్టీ కార్యకర్త మృతి చెందారు.. కాబట్టే వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శకు వెళ్తున్నారు.. ఇక, జగన్ బయటకు వస్తున్నాడంటే చంద్రబాబు, లోకేష్ భయపడుతున్నారు అని ఎద్దేవా చేశారు. మేం ఇన్ని పర్యటనలకు వెళ్ళాం.. ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చిందా అని ప్రశ్నించారు. జగన్ పర్యటనలు భగ్నం చేయాలనే కుట్రలు చేస్తున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు.
Read Also: Ponnam Prabhakar: హైదరాబాద్ అభివృద్ధికి అడ్డుగా కేంద్ర ప్రభుత్వం.. మంత్రి హాట్ కామెంట్స్..!
మిస్టర్ లోకేష్, మిస్టర్ చంద్రబాబు అధికారం ఉంది కదా అని మీ ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు అని అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఓ పక్క కేసులు పెడతారు.. మాపైనే దాడులు చేస్తారు.. ప్రజాస్వామ్యంలో ఎన్నాళ్లు సాగుతుందో మేము చూస్తామని అన్నారు. మీరు చేసిన వాగ్దాన భంగాలు ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాం.. మీరు ఎన్నాళ్లు అనిచి వేస్తారో మేము చూస్తామని తెలిపారు. జగన్ కు ప్రజల్లో జనాదరణ పెరుగుతుంది.. ఇప్పటి వరకు చంద్రబాబు వెన్నుపోటు మంచితనాలు చాలా చూశాం.. భయపడితే రాజకీయాలు చేయలేం అని మాజీ మంత్రి అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!