Padma Awarads 2026 : తెలుగు రాష్ట్రాల్లో పద్మ అవార్డులు వచ్చింది వీరికే..!
- పద్మశ్రీ అవార్డులను ప్రకటించిన కేంద్రం
- 113 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించిన కేంద్రం
- ఐదుగురికి పద్మ విభూషణ్ అవార్డులు ప్రకటించిన కేంద్రం
- 13 మందికి పద్మ భూషణ్ అవార్డులు ప్రకటించిన కేంద్రం
- తెలుగు రాష్ట్రాలకు నుంచి 11 మందికి పద్మ అవార్డులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం 2026 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించింది. దేశం కోసం, సమాజం కోసం నిస్వార్థంగా సేవ చేస్తూ, తమ రంగాలలో అసాధారణ ప్రతిభ కనబరిచిన వారిని గుర్తించి గౌరవించడం ఈ పురస్కారాల ముఖ్య ఉద్దేశ్యం. ఈ ఏడాది ప్రకటించిన మొత్తం 131 అవార్డులలో తెలుగు రాష్ట్రాల నుండి 11 మంది ప్రముఖులు ఎంపికవ్వడం తెలుగు వారందరికీ గర్వకారణం.
గత కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాల ఎంపికలో సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. ప్రచారం కోరుకోకుండా, మారుమూల ప్రాంతాల్లో ఉంటూ సమాజ హితం కోసం పాటుపడే ‘అన్సంగ్ హీరోస్’ (గుర్తింపు లేని వీరులు) కి పెద్దపీట వేస్తోంది. 2026 జాబితాలో కూడా ఇదే స్పష్టంగా కనిపిస్తోంది. పారిశ్రామిక దిగ్గజాలు, కళాకారులతో పాటు, పాడి పరిశ్రమలో మహిళా సహకార సంఘాలను ప్రోత్సహించిన వారు, వైద్య రంగంలో కొత్త పుంతలు తొక్కిన శాస్త్రవేత్తలకు ఈ గౌరవం దక్కడం ఈ అవార్డుల గౌరవాన్ని మరింత పెంచింది.
Also Read
- AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..
- TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!
- MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై తీర్పు రేపటికి వాయిదా!
- Poleramma Jatara 2026: వెదురుపాకలో పోలేరమ్మతల్లి జాతర.. సందడి చేసిన దేవిశ్రీ ప్రసాద్!
తెలంగాణ నుండి విశిష్ట సేవకులు (7 మంది).. తెలంగాణ నుండి సైన్స్, వైద్యం , సేవా రంగాల్లో నిష్ణాతులు ఎంపికయ్యారు
- రామ రెడ్డి మామిడి (మరణానంతరం): పాడి పరిశ్రమ , సహకార రంగంలో ఈయన చేసిన కృషి అనన్యసామాన్యం. మహిళల నేతృత్వంలో సహకార సంఘాలను ఏర్పాటు చేసి వేల మందికి జీవనోపాధిని కల్పించినందుకు గాను ఆయనకు ఈ పురస్కారం దక్కింది.
- కుమారసామి తంగరాజ్: సీసీఎంబీ (CCMB) లో ప్రఖ్యాత శాస్త్రవేత్తగా పనిచేస్తున్న ఈయన, జెనెటిక్స్ (జన్యుశాస్త్రం) లో చేసిన పరిశోధనలకు గాను అంతర్జాతీయ గుర్తింపు పొందారు.
- దీపికా రెడ్డి: కూచిపూడి నృత్యకారిణిగా భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పినందుకు గాను కళా విభాగంలో ఎంపికయ్యారు.
- వైద్య , ఇతర రంగాలు: డాక్టర్ గుడూరు వెంకట రావు , డాక్టర్ పాల్కొండ విజయ్ ఆనంద్ రెడ్డి వైద్య సేవలకు గాను, అలాగే చంద్రమౌళి గడ్డమనుగు , కృష్ణమూర్తి బాలసుబ్రమణియన్ సైన్స్ రంగంలో చేసిన విశేష కృషికి గాను పద్మశ్రీ అందుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ నుండి కళా కోవిదులు (4 మంది):
- మాగంటి మురళీ మోహన్: తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా, నిర్మాతగా దశాబ్దాల పాటు సేవలు అందించిన మురళీ మోహన్ ని కళా విభాగంలో పద్మశ్రీ వరించింది.
- గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (మరణానంతరం): అన్నమాచార్య కీర్తనలను జన బాహుళ్యంలోకి తీసుకెళ్లిన గొప్ప వాగ్గేయకారుడు , గాయకుడు. ఆయన సంగీత సేవలకు గుర్తింపుగా మరణానంతరం ఈ అవార్డు దక్కింది.
- ఇతర విజేతలు: సీనియర్ నటుడు గద్దె బాబు రాజేంద్ర ప్రసాద్ కి కళల విభాగంలో, వెంపటి కుటుంబ శాస్త్రికి సాహిత్యం , విద్యా రంగంలో పద్మశ్రీ లభించింది.
SIM Card Mystery: సిమ్ కార్డ్ మిస్టరీ.. ప్రతి సిమ్ కార్డ్ మూల ఎందుకు తెగిపోయి ఉంటుంది.?
తాజావార్తలు
-
TVK Vijay: విజయ్కు వామపక్షాలు బిగ్ షాక్.. మద్దతు ఇవ్వబోమని ప్రకటన
-
Bhagyashri Borse: భాగ్యశ్రీ భోర్సే బర్త్ డే.. ‘లెనిన్’ డిఫరెంట్ పోస్టర్ విడుదల
-
Ragi Burfi Recipe: ఎముకలకు బలం.. రక్తహీనతకు చెక్.. వంటరాని వాళ్లు కూడా ఈజీగా చేసుకునే హెల్తీ స్వీట్!
-
Pratyusha Paul : చార్మినార్ సాక్షిగా బెంగాల్ నటికి వేధింపులు: నిందితుడికి ‘చిప్పకూడు’!
-
DMK-Congress: ‘‘కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది’’.. డీఎంకే తీవ్ర ఆగ్రహం..
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!