భారత్లో అత్యున్నత పౌర పురస్కరాలైన పద్మ అవార్డులు ఖరారయ్యాయి… 128 పద్మ అవార్డులకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు.. ఆ జాబితాను రాష్ట్రపతి భవనం ఇవాళ విడుదల చేసింది.. ఆ జాబితాలో నలుగురికి పద్మవిభూషన్ అవార్డులు, 17 మందికి పద్మభూషన్ అవార్డులు, 107 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించారు. ఇక, ఏ ఏడాది పద్మ అవార్డులు వరించినవారిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఏడుగురు ఉన్నారు.. మొత్తంగా ఏడుగురు తెలుగువారు పద్మ అవార్డులు దక్కించుకున్నారు.. అందులో నలుగురు తెలంగాణకు చెందినవారు కాగా.. ముగ్గురు ఏపీవారున్నారు..
తెలంగాణ నుంచి.. క్రిష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్ల – భారత్ బయోటెక్ (ఉమ్మడిగా)దర్శనం మొగిలయ్య – కళలురామచంద్రయ్య – కళలుపద్మజా రెడ్డి – కళలు ఉండగా.. ఆంధ్రప్రదేశ్ నుంచి గరికపాటి నర్సింహారావు – సాహిత్యం/విద్యగోసవీడు షైక్ హుస్సేన్ – సాహిత్యం/విద్యడాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణ రావు – మెడిసిన్ ఉన్నారు.. ఇక, ఇవాళ ప్రకటించిన పద్మ అవార్డు జాబితాను ఇక్కడ చూడొచ్చు..