Off The Record : ఆ YCP సీనియర్ నేత తూర్పు తిరిగి దండం పెట్టేశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ వైసీపీ నాయకుడు తూర్పుకు తిరిగి దండం పెట్టేశారా? రాజకీయం చేయడం ఇక నావల్ల కాదు బాబోయ్… అంటూ దండం పెట్టేశారా? ఒకప్పుడు తోపు అనుకున్న ఆ లీడర్ ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడంతో… పార్టీ కూడా లైట్ తీసుకుందా? పొరుగింటి పుల్లకూర మనకు వర్కౌట్ కాదని డిసైడై… లోకల్ రాగం పాడుతోందా? ఏదా నియోజకవర్గం? సైలెంట్గా సైడైపోయిన ఆ నాయకుడెవరు? ఆవిర్భావం నుంచి వైసీపీ అధిష్టానానికి తీరని కల… విశాఖ నగరంలో జెండా ఎగరేయడం. సిటీలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీని బీట్ చేసేందుకు చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయ్యాయి. 2019 ఎన్నికల్లో సర్వశక్తులు ఒడ్డిన ఫ్యాన్ పార్టీ…. మెజార్టీలను మాత్రం ప్రభావితం చేయగలిగింది. మిగిలిన సీట్ల సంగతి పక్కన బెడితే విశాఖ తూర్పులో అయితే…. వైసీపీకి మరీ టఫ్ సిచ్యూయేషన్. ఇక్కడ 2024లో వరుసగా నాలుగోసారి టీడీపీ తరపున గెలిచారు వెలగపూడి రామకృష్ణబాబు. దాదాపు ఫెవికాల్ వేసి అతుక్కుపోయినట్టుగా ఉన్న వెలగపూడిని కుర్చీ దించేందుకు చాలా ప్రయోగాలు చేసింది వైసీపీ. అయినా నో యూజ్. ఇక గత ఎన్నికల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ‘వై నాట్ ఈస్ట్’ నినాదంతో రంగంలోకి దిగారు అప్పటి విశాఖ ఎంపీ, ప్రముఖ బిల్డర్ ఎంవీవీ సత్యనారాయణ. ఎంవీవీ, వెలగపూడి ఒకే సామాజిక వర్గం కావడం, అధికార బలం, ఆర్ధిక స్తోమత ఆధారంగా ‘తూర్పు’ సెంటిమెంట్ మారుతుందా..? అనే విస్త్రతమైన చర్చ జరిగింది అప్పట్లో. కానీ…. రిజల్ట్ చూసేసరికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యిందట ఎంవీవీకి. వెలగపూడి మెజార్టీతో సమానమైన ఓట్లు కూడా సాధించలేకపోయారు వైసీపీ అభ్యర్థి ఎంవీవీ. ఆ దెబ్బకు ఇక నో పాలిటిక్స్. ఓన్లీ….బిజినెస్ అంటూ సైలెంట్ అయిపోయారు మాజీ ఎంపీ. సింగిల్ షాట్ లోనే ఆయన సైడైపోవడంతో… విశాఖ తూర్పులో వైసీపీకి దిక్కులేనట్టయింది. ఇక్కడ కూటమికి దక్కిన విజయంకంటే…ఎంవీవీని కోలుకోలేని దెబ్బ కొట్టడం మంచి మజా తెచ్చిందట. కాపు, యాదవ, మత్స్యకార సామాజిక వర్గాల ఓట్ బ్యాంక్ అధికంగా వుండే విశాఖ తూర్పులో హయ్యర్, మిడిల్ క్లాస్ మొదటి నుంచి టీడీపీ పక్షానే నిలబడింది. లోకల్గా వైసీపీని బలోపేతం చేయడం కోసం రాజకీయంగా చాలా ఎదురుదెబ్బలు తిన్న వంశీకృష్ణ యాదవ్…. ఎంవీవీ ఎంట్రీని జీర్ణించుకోలేక జనసేనకు వెళ్లిపోయారు.
ఆ పార్టీ తరపున దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే అయ్యారాయన. ఇక వెలగపూడితో ‘ఢీ అంటే ఢీ’ అన్న అక్కరమాని విజయనిర్మల కూడా టీడీపీ గూటికి చేరిపోయారు. జనసేన ఓటింగ్ పక్కాగా టీడీపీకి ట్రాన్సఫర్ అవ్వడంతో వైనాట్ అన్న ఎంవీవీ సత్యనారాయణ తుపాకీ గుండుకు దొరక్కుండా పోయారు. అలా… నియోజకవర్గంలో పార్టీకి నాయకత్వం లేకుండా పోయాకగానీ… వైసీపీ పెద్దలకు తత్వం బోధపడలేదట. ప్రయోగాలన్నీ విఫలం అవడమేగాక…. వాటి వల్ల ఎదురైన దుష్పరిణామాలు విశ్లేషించుకుని ఇక నుంచి స్ధానిక నాయకత్వానికే బాధ్యతలు ఇవ్వాలని డిసైడై…. సీనియర్ నేత మొల్లి అప్పారావుకు సమన్వయకర్త బాధ్యతలు అప్పగించింది. దీని ద్వారా యాదవ సామాజిక వర్గానికి తిరిగి దగ్గరయ్యేందుకు వైసీపీ ప్రయ త్నాలు మొదలెట్టినట్టైంది. ఇక్కడ బీసీలు ఎక్కువ కావడంతో ఇక ఆ యాంగిల్లోనే రాజకీయం చేయాలనుకుంటున్నట్టు సమాచారం. ఎంవీవీ కారణంగానే వంశీ, అక్కరమాని ఫ్యామిలీకి వైసీపీలో అవకాశం లేకుండాపోయిందనే ప్రచారం విస్తృతంగా జరిగింది. ఈ క్రమంలో బీసీల ఆదరణ పొందగలిగితే తప్ప మరోసారి ఇక్కడ రాజకీయంగా నిలదొక్కుకోవడం సాధ్యం కాదని ఫ్యాన్ పార్టీకి అనుభవం మీద అర్ధం అయిందట. అందుకే… ఇక ఎంవీవీ సత్యనారాయణ గురించి ఆలోచించకుండా… లోకల్ లీడర్ షిప్ ను ఎంకరేజ్ చేయడంతో పాటు యాదవ, తూర్పుకాపు, పద్మశాలి, శెట్టి బలిజ సామాజిక వర్గాలను తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు మొదలు పెట్టింది. పొరుగింటి పుల్లకూరను పక్కకు పెట్టి.. నాలుగేళ్ళు ముందుగానే లోకల్ రాగం అందుకున్న వైసీపీ… విశాఖ తూర్పులో ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడాలంటున్నారు పరిశీలకులు.
Also Read
- Road Accident: రాజమండ్రిలో రోడ్డు ప్రమాదం.. స్కూల్ బస్సు-ఆటో ఢీ..
- ACB Raid: భూమి మ్యుటేషన్ కోసం లంచం అవతారం.. ఏసీబీ వలలో వీఆర్వో..
- Vijay Sai Reddy: నేను వైసీపీని వీడటానికి అసలు కారణం ఇదే.. విజయసాయిరెడ్డి లేఖలో కీలక విషయాలు..
- CM Chandrababu: ‘సంజీవని’కి శ్రీకారం.. గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్న్యూస్
తాజావార్తలు
-
September 1, 2026 New Rules: సెప్టెంబర్ 2026 నుంచి కీలక మార్పులు.. ITR, LPG e-KYC, FD రూల్స్ వరకు పూర్తి లిస్ట్ ఇదే
-
Asia Cup 2026: పాకిస్థాన్తో హ్యాండ్షేక్ ఉంటుందా?.. టీమిండియా కోచ్ ఏం చెప్పాడంటే?
-
King100: నాగార్జున ‘కింగ్ 100’లో మరో స్టార్ హీరోయిన్.. ఐశ్వర్య రాజేష్ ఎంట్రీ కన్ఫర్మ్!
-
India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
-
Billionaire Web Series: విజయ్ మాల్యా కథతో అర్జున్ రాంపాల్.. నవంబర్లో షూటింగ్
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!