ఎన్టీవీ షార్ట్ న్యూస్
ఉత్తరాది గాన కోకిల, నైటింగేల్ ఆఫ్ ఇండియా లతా మంగేష్కర్ ఇక లేరు. ఆమె వయసు 92 ఏళ్ళు. తీవ్ర అస్వస్థతతో గత కొన్నాళ్ళుగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు లతా మంగేష్కర్. ఆసేతుహిమాచల పర్యంతం ఆబాలగోపాలాన్నీ అలరించిన గానకోకిల లతా మంగేష్కర్. ఆమె ఆకస్మిక మరణానికి యావత్ దేశం నివాళులర్పిస్తోంది.
ప్రైవేటు వైద్య కళాశాలలు, డీమ్డ్ వర్సిటీల్లో రుసుములపై కీలక మార్గదర్శకాలు జారీ చేసింది జాతీయ వైద్య కమిషన్. ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని ఫీజుల స్థాయిలో ఉండాలని స్పష్టం చేసింది. మొత్తంమీద సంబంధిత విద్యా సంస్థకు అనుమతించిన సీట్ల సంఖ్యలో గరిష్ఠంగా 50 శాతానికి దీన్ని పరిమితం చేయాలని సూచించింది.
Also Read
- Petrol, Diesel Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు
- Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
- AP Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సర్కార్ అలర్ట్.. కీలక ఆదేశాలు జారీ
- Seshachalam Forest : శేషాచలం అడవుల్లో కార్చిచ్చు.. జీవకోన ప్రాంతంలో ఎగిసిపడుతున్న మంటలు.!
తెలంగాణలో చలి పులి పంజా విసురుతోంది. రాష్ట్రంలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నందున చలి తీవ్రత బాగా పెరిగింది. తెల్లవారుజామున రాష్ట్రంలోకెల్లా అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లా అర్లి టి లో 6, ఆదిలాబాద్లో 8.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.బేలాలో 7.7డిగ్రీలు, కొమురం భీం జిల్లా కెరమెరిలో 7.8డిగ్రీలు, వాంకిడిలో 8 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది.
మేడారం మహాజాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా ఈసారి సాంకేతికతను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. భక్తులు అమ్మవార్లకు డబ్బును కానుకగా సమర్పించడానికి ఈ-హుండీని కూడా ఏర్పాటు చేశారు. ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులు నిర్వహిస్తోంది. ఆదివారం కావడంతో మేడారంలో భక్తుల రద్దీ పెరిగింది.
ఆంటిగ్వాలోని సర్ విలియమ్ రిచర్డ్స్ స్టేడియం వేదికగా జరిగిన అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో యువ భారత్ ఇంగ్లండ్ పై అద్భుతమయిన విజయం సాధించింది. టీం ఇండియా ఐదో సారి వరల్డ్ కప్ సాధించింది . 8 సార్లు వరల్డ్ కప్ ఫైనల్ చేరింది ఇండియా. 5 సార్లు విజయం సాధించగా మూడు సార్లు రన్నరప్ గా నిలిచింది.
అండర్-19 ప్రపంచకప్ 2022 ఛాంపియన్గా నిలిచిన టీమిండియా యువ ఆటగాళ్ళకు ప్రశంసలు కురుస్తున్నాయి. భారత యువ జట్టును బీసీసీఐ కార్యదర్శి జైషా అభినందించారు. అధ్బుతమైన ప్రదర్శనతో భారత విజయంలో భాగమైన ప్రతీ ఒక్క ఆటగాడికి రూ. 40 లక్షలు, సహాయక సిబ్బందిలోని ప్రతి సభ్యుడికి 25 లక్షల బహుమతిని బీసీసీఐ ప్రకటించింది.
తాజావార్తలు
-
Petrol, Diesel Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు
-
Mamata Banerjee: మోడీ ‘ఝల్మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
-
Raja Shivaji: రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
-
Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!