Ntv Short news
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీతో పాటు టీఆర్ఎస్ కూడా భగ్గుమంటోంది. టీఆర్ఎస్ ఎంపీలు రాజ్యసభ చైర్మన్కు మోడీపై ఫిర్యాదు చేశారు. సభా హక్కుల ఉల్లంఘన కింద రాజ్యసభ సెక్రెటరీ జనరల్కు నోటీసులు అందజేశారు. 187వ నిబంధన కింద టీఆర్ఎస్ ఎంపీలు కే కేశవరావు, సంతోష్, లింగయ్య యాదవ్, సురేశ్ రెడ్డి నోటీసు ఇచ్చారు. తెలంగాణ బిల్లుపై ప్రధాని అభ్యంతరకరంగా మాట్లాడారని అందులో పేర్కొన్నారు.
ఉత్తర్ప్రదేశ్ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్ పూర్తైంది. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించడం మినహా.. పోలింగ్ అంతా ప్రశాంతంగానే సాగింది. సాయంత్రం 5 గంటల వరకు 57.79 శాతం ఓటింగ్ నమోదైందని ఈసీ అధికారులు ప్రకటించారు. సాంకేతిక కారణాల వల్ల కొన్ని చోట్ల ఈవీఎంలను మార్చినట్లు తెలిపారు.మొత్తం 623 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
Also Read
- Ramprasad Reddy: ఇకపై ఆటోమేటిక్ ఆమోదం.. 24 గంటల్లోనే రిజిస్ట్రేషన్.. ఆ వాహనాలకు మినహాయింపు!
- CM Chandrababu: అసోం సీఎం ప్రమాణస్వీకారానికి సీఎం చంద్రబాబు.. గౌహతిలో బిజీ షెడ్యూల్!
- Polavaram-Tiger: పోలవరం జిల్లాలో మళ్లీ పెద్దపులి సంచారం.. భయం గుప్పెట్లో హడలెత్తిపోతున్న జనాలు!
- Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ
హిజాబ్ వివాదం ముదిరి చెలరేగిన ఘర్షణల కారణంగా మూతబడిన పాఠశాలలు, కళాశాలలను ప్రారంభించాలని కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారమే విద్యా సంస్థలను తెరవాలని స్పష్టం చేసింది. అందరూ యథాతథ స్థితిని పాటించాలని మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది.సమస్య పరిష్కారమయ్యేంత వరకు విద్యార్థులు ఎవరూ మతపరమైన దుస్తులను ధరించకూడదని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.
కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు మినహా దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని కేంద్రం వెల్లడించింది. ఆ రాష్ట్రాల్లో 50వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపింది.జనవరి 24న దేశంలో పాజిటివిటీ రేటు 20.75 శాతంగా ఉందని.. ఇప్పుడు 4.44 శాతానికి చేరింది. కరోనా తగ్గుముఖం పట్టినా జాగ్రత్తలు పాటించాలని కేంద్రం సూచించింది.
సీఈఓ శశాంక్ గోయల్ ను వెంటనే రిలీవ్ చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీచేసింది. తదుపరి సీఈఓ కోసం ముగ్గురు ఐఏఎస్ ల పేర్లను ఈసీకి పంపింది ప్రభుత్వం. ఏ క్షణంలోనైనా సీఈఓ శశాంక్ గోయల్ ను రిలీవ్ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. సీఈవో శశాంక్ గోయల్ ను కేంద్ర సర్వీసులకు బదిలీ చేస్తూ ఈ ఏడాది జనవరి 18న ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇంఛార్జి సీఈఓగా ప్రస్తుత అడిషినల్ సీఈఓ బుద్ధ ప్రకాష్ ని నియమించారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణీకులకు మరింత దగ్గరయ్యేందుకు శత విధాలా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా గరుడ ప్లస్ ఛార్జీలను తగ్గించింది టీఎస్ఆర్టీసీ. ఇక నుంచి రాజధాని ఛార్జీతో గరుడ ప్లస్ లో ప్రయాణించవచ్చని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. గరుడ ప్లస్ ఛార్జీలు హైదరాబాద్ – విజయవాడ మధ్య రూ 100, హైదరాబాద్ – ఆదిలాబాద్ మధ్య రూ 111, హైదరాబాద్ – భద్రాచలం మధ్య రూ 121, హైదరాబాద్- వరంగల్ మధ్య రూ .54 తగ్గించామన్నారు సజ్జనార్.
తాజావార్తలు
-
Tokyo: టోక్యోలో తప్పిన విమాన ప్రమాదం.. ల్యాండింగ్ అవుతుండగా ఏం జరిగిందంటే..!
-
LPG Subsidy Cut: సామాన్యుడికి గ్యాస్ షాక్.. ఇకపై సబ్సిడీ కట్!
-
CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్ట్.. సీఎం విజయ్ కీలక నిర్ణయం..
-
NEET UG 2026: మే 3న నీట్ పరీక్ష, మే 12న రద్దు.. అసలు ఈ 10 రోజుల్లో ఏం జరిగింది? పూర్తి టైమ్లైన్ ఇదే..
-
Hiro Vishal: 717 వైన్ షాపుల మూసివేత.. హీరో విశాల్ భావోద్వేగ పోస్ట్!
ట్రెండింగ్
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!