Social Boycott: ఏపీలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను వెలివేసిన గ్రామ పెద్దలు.. ధిక్కరిస్తే రూ.2 లక్షల జరిమానా..!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Social Boycott: ఎన్టీఆర్ జిల్లాలో ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంటతో పాటు వారి కుటుంబాన్ని సామాజికంగా వెలివేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. రెడ్డిగూడెం మండలం శ్రీరాంపురం గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. గ్రామానికి చెందిన తేజ, నాగలక్ష్మి ప్రేమించి వివాహం చేసుకోవడంతో గ్రామ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ వివాహాన్ని అంగీకరించని కుల పెద్దలు, ఆ జంట కుటుంబాన్ని గ్రామం నుంచి దూరం పెట్టేలా నిర్ణయం తీసుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారితో ఎవరూ మాట్లాడకూడదని, వారి ఇళ్లకు వెళ్లకూడదని, వారు వచ్చినా రానివ్వకూడదని గ్రామంలో చాటింపులు చేసినట్లు సమాచారం.
అంతేకాకుండా గ్రామ పెద్దల తీర్పును ధిక్కరిస్తే రూ.2 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించినట్లు బాధితులు చెబుతున్నారు. దీంతో గ్రామ ప్రజలు కూడా ఆ కుటుంబానికి సహాయ నిరాకరణ చేస్తూ దూరంగా ఉంటున్నారని వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రేమ జంట తేజ, నాగలక్ష్మి గ్రామాన్ని విడిచి వెళ్లిపోయినట్లు తెలిసింది. అయితే అమ్మాయి కుటుంబానికి మాత్రం గ్రామంలో తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదని తెలుస్తోంది. ఇటీవల ఆ జంటకు బాబు పుట్టడంతో బారసాల వేడుక నిర్వహించగా, ఆ కార్యక్రమానికి ఎవరూ వెళ్లకూడదని గ్రామ పెద్దలు మరోసారి ఆదేశాలు జారీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Also Read
- Yolo Travels Bus : కంచికచర్ల వద్ద బస్సు ప్రమాదం.. 36 మందికి తప్పిన పెను ముప్పు
- CM Chandrababu: ఎన్టీఆర్ జిల్లా ప్రజా ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేక భేటీ.. సమన్వయంతో పని చేయండి.. ఆత్మ విమర్శ అవసరం..
- Vijayawada: కలెక్టరేట్లో కలకలం.. భూ వివాదం పరిష్కారం కాకపోవడంతో అధికారిపై కారం చల్లిన వృద్ధురాలు..!
- Instagram Harassment Case: మైనర్ బాలికకు ఇన్స్టాలో వేధింపులు.. పోక్సో, కిడ్నాప్ కేసు నమోదు..
బారసాల వేడుకకు రావాలని గ్రామస్తులను స్వయంగా ఆహ్వానించేందుకు గ్రామంలోకి వచ్చిన కుటుంబ సభ్యులపై కూడా గ్రామ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారని, గ్రామ తీర్పును ఉల్లంఘించారని చెబుతూ రూ.2 లక్షలు జరిమానా కట్టాలని తీర్పు ఇచ్చినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై బాధిత కుటుంబం మైలవరం పోలీసులను ఆశ్రయించినప్పటికీ స్పందన లేదని ఆరోపిస్తోంది. జిల్లా కలెక్టర్, ఎస్పీలు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం విజ్ఞప్తి చేస్తోంది. ఈ ఘటనపై మానవ హక్కుల సంఘాలు, సామాజిక వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రేమ వివాహం చేసుకున్నందుకు ఒక కుటుంబాన్ని సామాజికంగా బహిష్కరించడం అనాగరిక చర్య అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
-
Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!