CM Chandrababu: కొత్త పాస్ పుస్తకాలతో రైతుల్లో భరోసా.. ”మీ భూమి-మీ హక్కు” అన్నదాతలకు సీఎం చంద్రబాబు హామీ
- కొత్త పాస్ పుస్తకాలతో రైతుల్లో భరోసా..
- ట్యాంపరింగ్ కు తావులేదు... రికార్డులు సురక్షితం..
- తప్పులు లేకుండా కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వండి.. గ్రామసభల్లో నిర్థారించుకున్న తర్వాతే ముద్రణ..
- రైతులకు నేరుగా పాస్ పుస్తకాలు అందజేత..
- ”మీ భూమి-మీ హక్కు” రైతులకు ప్రభుత్వ హామీ..
- రెవెన్యూ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: రైతుల్లో నమ్మకం, భరోసా కలిగించేలా కొత్త పాస్ పుస్తకాలను అందచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. తప్పులు లేకుండా రికార్డులను సరి చేసి కొత్త పాస్ పుస్తకాల పంపిణీ జరగాలని ఆదేశించారు. ఈ నెల 2వ తేదీ నుంచి మొదలైన కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీపై మంగళవారం నాడు సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా రెవెన్యూ మంత్రి, ఆ శాఖ ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు.”ప్రభుత్వం పంపిణీ చేస్తున్న కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలతో రైతుల్లో నమ్మకం, భరోసా కలగాలని చంద్రబాబు అన్నారు.
Read Also: Child Trafficking Case: పసిపిల్లల విక్రయ ముఠా కేసులో కీలక పురోగతి..
Also Read
- PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
- CM Chandrababu Delhi Tour: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అమిత్ షా సహా కేంద్ర మంత్రులతో కీలక భేటీలు
- Ambati Rambabu : రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పాలన సాగుతోంది.. చంద్రబాబువి గారడీ విద్యలు
- Minister Narayana : విశాఖ అభివృద్ధికి సరికొత్త మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్ తరహాలో సెమీ రింగ్ రోడ్డు
ఇక, భూ రికార్డుల్లో గతంలో జరిగిన తప్పులను సరిదిద్దాలని సీఎం చంద్రబాబు సూచించారు. కొత్త పాస్ పుస్తకాలను ముద్రించడానికి ముందుగానే గ్రామ సభల్లో ఆయా రైతుల నుంచి భూ వివరాలు నిర్ధారించుకోవాలని తెలిపారు. ఆ తర్వాతే కొత్త పాస్ పుస్తకాలను ముద్రించాలన్నారు . రికార్డులను తారుమారు చేయడానికి ఆస్కారం లేని విధంగా కొత్త పాస్ పుస్తకాలను తీర్చిదిద్దామని ఎవ్వరూ ట్యాంపరింగ్ చేయకుండా, నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేయకుండా పాస్ పుస్తకాలను ముద్రించాలని వెల్లడించారు. పాస్ పుస్తకాల ముద్రణలో ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తలను రైతులకు అర్థమయ్యేలా చెప్పాలని సూచించారు. ఇక, పట్టాదార్ పాస్ పుస్తకాల మీద రాజముద్ర, క్యూఆర్ కోడ్ వేయడంతో పాటు మీ భూమి- మీ హక్కు, జై భారత్… జై తెలుగుతల్లి అనే నినాదాలు కూడా ముద్రించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
తాజావార్తలు
-
Drishyam 3 : అడ్వాన్స్ సేల్స్ లో దూసుకెళ్తున్న దృశ్యం 3.. మోహన్ లాల్ మరో ఇండస్ట్రీ హిట్ ఇస్తాడా?
-
Kanchana4: ‘కాంచన 4’ నుండి.. ఫ్యాన్స్కు షాకింగ్ అప్డేట్!
-
Road Accident: కారు – బైక్ ఢీ.. ఐదుగురు మృతి.!
-
Bharath Kanth: సినీ పరిశ్రమలో విషాదం.. ORR ప్రమాదంలో యువ నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి!
-
Daily Horoscope: సోమవారం దిన ఫలాలు.. వ్యాపారం, షేర్ల విషయంలో తొందరపాటు వద్దు!