Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Nara Lokesh Wrotes Letter To Cm Jagan On Energy Asisstants Problems

Nara Lokesh: అన్యాయంపై ప్రశ్నించే హక్కు కూడా లేదా?

Published Date :August 18, 2022 , 5:34 pm
By Ramesh Nalam
Nara Lokesh: అన్యాయంపై ప్రశ్నించే హక్కు కూడా లేదా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Nara Lokesh: ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. ఈ సందర్భంగా ఎనర్జీ అసిస్టెంట్లు, జేఎల్‌ఎం గ్రేడ్-2 ఉద్యోగుల సమస్యలపై తక్షణమే స్పందించి పరిష్కరించాలని లేఖలో పేర్కొన్నారు. ఎనర్జీ అసిస్టెంట్ల న్యాయ‌మైన డిమాండ్లు త‌క్షణ‌మే ప‌రిష్కరించాలని డిమాండ్ చేశారు. జాబ్‌ ఛార్ట్‌ని విస్మరించి క‌ట్టుబానిస‌ల్లా వాడుకోవ‌డంతో ఎనర్జీ అసిస్టెంట్లు తీవ్ర మాన‌సిక ఆందోళ‌న‌లో ఉన్నారని లోకేష్ ఆరోపించారు. సెల‌వులు, పండ‌గ‌లు, ప‌బ్బాల ఊసే లేకుండా చేశారని.. దీంతో రాత్రి, ప‌గ‌లు తేడా లేకుండా ప‌ని చేయిస్తుండ‌డంతో తీవ్ర ఒత్తిడికి గుర‌వుతున్నారని మండిపడ్డారు. శిక్షణ కూడా లేని వీరిని ప్రమాద‌క‌ర‌మైన‌ 11కేవీ 33 కేవీ విద్యుత్ లైన్ల మ‌ర‌మ్మతుల‌కు, స్థంభాలు ఎక్కిస్తుండ‌డంతో ప్రాణాలు సైతం కోల్పోతున్నారని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివ‌ర‌కూ విద్యుత్ ప్రమాదాల‌లో 89 మంది మ‌ర‌ణించారని..200 మందికి పైగా తీవ్ర గాయాల పాల‌య్యారని లేఖలో వివరించారు.

Read Also: Sivaji: అది గోరంట్ల మాధవ్ వీడియో కాదు.. నాదే

Also Read

  • Off The Record : పిఠాపురంలో టీడీపీ, జనసేన మధ్య మంటలు
  • Off The Record : ఎమ్మెల్యే పేరు చెప్పి పత్తిపాడు నియోజకవర్గంలో కమీషన్ల దందా
  • CM Chandrababu: వర్మ తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసహనం..
  • Tragedy: వయ్యారాలు ఒలకబోస్తూ 5 గురు స్త్రీలు.. ఏకాంతంగా కలిసేందుకు ఆహ్వానాలు.. చివరకు ఇలా..

ఇండ‌స్ట్రియ‌ల్ యాక్ట్ కింద ఉండాల్సిన నియామ‌కాల‌ను స‌చివాల‌యం కింద చూపిస్తూ…లేబ‌ర్ యాక్ట్ అమ‌లు చేయ‌డంతో ప్రాణాలు కోల్పోయిన, ప్రమాదాల‌కి గురైన ఎన‌ర్జీ అసిస్టెంట్లు ప‌రిహారంలోనూ అన్యాయానికి గుర‌య్యారని లోకేష్ తన లేఖలో వివరించారు. ఈ అన్యాయంపై ప్రశ్నించే హ‌క్కు కూడా లేద‌ని అధికారులు బెదిరిస్తున్నార‌ని ఎన‌ర్జీ అసిస్టెంట్లు వాపోతున్నారని తెలిపారు. స‌చివాల‌యాల్లో ఉంటూ 8 గంట‌లు ప‌నిచేయాల్సిన వీరిని 24 గంట‌లూ విధి నిర్వహ‌ణ‌కు వాడుకోవ‌డం శ్రమ‌ దోపీడినే అని లోకేష్ ఆరోపించారు.

రిక్రూట్మెంట్ ఒక శాఖ కింద‌, విధి నిర్వహ‌ణ మ‌రో శాఖ‌లో ఉండ‌డంతో ఎవ‌రికీ చెంద‌ని వారిలా ఎన‌ర్జీ అసిస్టెంట్లు తీవ్ర అన్యాయానికి గుర‌వుతున్నారని లోకేష్ తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి 7329 మంది ఎనర్జీ అసిస్టెంట్లు/జేఎల్ఎం గ్రేడ్-II ఉద్యోగుల సమస్యలు త‌క్షణ‌మే ప‌రిష్కరించాలన్నారు. అందరినీ విద్యుత్‌ శాఖ‌లో తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్‌శాఖ‌లో జీత‌ భ‌త్యాలు అమ‌లు చేయాలన్నారు. విధి నిర్వహ‌ణ‌లో చ‌నిపోయిన, గాయ‌ప‌డిన వారికి విద్యుత్‌ శాఖ ఉద్యోగుల మాదిరిగానే ప‌రిహారం, కుటుంబంలో ఒక‌రికి ఉద్యోగం, మెడిక‌ల్ అల‌వెన్సులు ఇవ్వాలన్నారు. లేదంటే పూర్తిగా స‌చివాల‌యాల్లో నిర్దేశించిన ప‌ని గంట‌లకే విధులు నిర్వర్తించుకునే అవ‌కాశం క‌ల్పించాలని సూచించారు. త‌క్షణ‌మే ప్రొబేష‌న‌రీ డిక్లేర్ చేయాలన్నారు. విద్యుత్ ఉద్యోగుల‌కి అమ‌లుచేసే పీఆర్సీకి అనుగుణంగా జీతాలు పెంచాల‌ని ఎన‌ర్జీ అసిస్టెంట్లు చేస్తున్న న్యాయ‌మైన డిమాండ్‌ని ఆమోదించాలని లోకేష్ అన్నారు. సచివాలయం వ్యవస్థ అనే బూట‌క‌పు ముసుగులో ఎన‌ర్జీ అసిస్టెంట్లతో విద్యుత్ శాఖ గొడ్డు చాకిరీ చేయించుకోవ‌డం ఇక‌నైనా ఆపాలని.. విద్యుత్‌శాఖ ఉద్యోగుల‌కు ఇస్తున్న మెడిక‌ల్, సైకిల్‌ అల‌వెన్సు, క‌న్వేయ‌న్స్‌, ఆర్జిత సెల‌వులు కూడా వ‌ర్తింప‌జేయాలని లోకేష్ సీఎం జగన్‌కు రాసిన లేఖలో ప్రస్తావించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cm jagan
  • energy asisstants
  • lokes wrotes letter
  • Nara Lokesh
  • Telugu Desam Party

తాజావార్తలు

  • Tamil Nadu Election: 9 గంటలకే తమిళనాడులో భారీ పోలింగ్.. కారణమిదేనా?

  • 8-Week OTT: ఓటీటీ రిలీజ్ గ్యాప్‌పై సౌత్ నిర్మాతల సంచలన నిర్ణయం..

  • Tamilanadu Elections Special : తమిళనాడు ఎన్నికలో ఎవరి బలం ఎంత.. అధికారం ఎవరిది.. గ్రౌండ్ రిపోర్ట్

  • Mohsin Khan: “మెయిడెన్ ఓవర్.. ఆపై వికెట్”.. వైభవ్ జోరుకు బ్రేక్ వేసిన లక్నో పేసర్.. మునుపెన్నడూ జరగలే!

  • Raaka: అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి దీపికా అవుట్.. క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్..!

ట్రెండింగ్‌

  • మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions