Nara Lokesh: జగన్ దావోస్ టూర్పై సెటైర్లు.. ఎవరైనా మా నాన్న మార్గంలో నడవాల్సిందే..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ సీఎం జగన్ దావోస్ పర్యటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. గతంలో ఏపీ సీఎం హోదాలో ఈ సదస్సులకు చంద్రబాబు హాజరైన విషయాన్ని గుర్తు చేస్తూ జగన్ పర్యటనపై సెటైర్లు సంధించారు. గతంలో సీఎం హోదాలో చంద్రబాబు దావోస్లో పర్యటిస్తే.. దావోస్ ఎందుకు డబ్బులు దండగ అన్న జగన్ ఇప్పుడు ఏకంగా స్పెషల్ విమానంలో ఎందుకు అక్కడికి వెళ్లాల్సి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. బహుశా దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదేనేమో అంటూ నారా లోకేష్ ఎద్దేవా చేశారు. తన తండ్రి చంద్రబాబును ద్వేషించే వారు, విమర్శించే వారు సైతం చివరకు ఆయన మార్గంలో నడవాల్సిందేనని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. సంక్షేమం నుండి ఐటీ వరకూ.. అమరావతి నుండి విదేశాలకు వెళ్లి పెట్టుబడులు ఆకర్షించడం వరకూ చంద్రన్న మార్గమే రాజమార్గం అంటూ లోకేష్ వివరించారు.
మరోవైపు ఏపీలో దళితులపై జరుగుతోన్న దాడులు, అరాచకాలపై జాతీయ ఎస్సీ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్కు నారా లోకేష్ లేఖలు రాశారు. రాష్ట్రంలో ఎస్సీలపై వరుస అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వ పరంగా నివారణ చర్యలు లేవని ఆయన ఆరోపించారు. దళితుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘనతో ఏపీలో భయానక పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ అధికారం చేపట్టిన నాటి నుంచి శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని.. ప్రజల్లో అభద్రతా భావం పెంచేలా వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారని లోకేష్ విమర్శించారు. డాక్టర్ సుధాకర్ నుంచి సుబ్రమణ్యం వరకూ దళితులపై వైసీపీ నేతల దమనకాండ కొనసాగుతూనే ఉందన్నారు. దళితుల హత్యలు మిస్టరీ హత్యలుగా మిగిలిపోతున్నాయని లోకేష్ లేఖలో పేర్కొన్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసును సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ అనంత బాబుని వెంటనే అరెస్ట్ చేసి దళిత యువకుడు సుబ్రమణ్యం కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
Also Read
- CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
- Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
- Dokka Seethamma Mid-Day Meal : స్మార్ట్ కిచెన్స్పై క్లారిటీ.. వంట కార్మికులకు గుడ్ న్యూస్.!
- CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
మా నాన్నని ద్వేషించేవారు, విమర్శించేవారు సైతం ఆఖరికి ఆయన మార్గంలో నడవాల్సిందే. సంక్షేమం నుండి ఐటి వరకూ.. అమరావతి నుండి విదేశాలు వెళ్లి పెట్టుబడులు ఆకర్షించడం వరకూ చంద్రన్న మార్గమే రాజమార్గం.(1/2) pic.twitter.com/k3MCFyX8kz
— Lokesh Nara (@naralokesh) May 20, 2022
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!