Nara Lokesh: గ్రూప్-1లో సర్కారు వారి పాట ఎంత?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో గ్రూప్-1 నిర్వహణలో గూడుపుఠాణీ జరిగిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. డిజిటల్, మాన్యువల్ వాల్యుయేషన్లో భారీ తేడాలు ఉన్నాయని.. దీంతో తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. డిజిటల్, మాన్యువల్ వేల్యూయేషన్లో 202 మంది అవుటయ్యారన్నారు. స్పోర్ట్స్ కోటాలో కోతలు విధించడంతో ఆశావహులు ఆందోళనతో ఉన్నారని ఆరోపించారు. ఈ అవకతవకలపై గవర్నర్ దృష్టి సారించి న్యాయవిచారణ జరపాలని లోకేష్ కోరారు.
గ్రూప్ 1 ఇంటర్య్వూల ఎంపికలో అక్రమాలకు పాల్పడిన వందలాది మంది ప్రతిభావంతులకు తీరని అన్యాయం జరిగిదని.. ఈ విషయంలో సర్కారువారి పాట ఎంతో చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు. జగన్ సర్కారు వారి పాటపై ఆట కట్టిస్తామని హెచ్చరించారు. 30కి పైగా సీబీఐ, ఈడీ కేసుల్లో ఏ1 నిందితుడిగా ఉన్న సీఎం జగన్ ఆధ్వర్యంలో ఏపీపీఎస్సీ గ్రూప్-1 కూడా అవకతవకలతోనే సాగిందని ఎద్దేవా చేశారు. డిజిటల్ విధానంలో ఎంపికైన 326 మందిలో 124 మంది మాత్రమే మాన్యువల్ వేల్యూయేషన్లో ఎంపిక కావడం వెనుక మతలబేంటని ప్రశ్నించారు. డిజిటల్లో మాయాజాలం జరిగిందా లేదా మాన్యువల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయా అనేది ప్రభుత్వం వివరణ ఇవ్వాలన్నారు.
Also Read
- Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
- YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
- Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
- Nara Lokesh: మంత్రి లోకేష్తో చాగంటి కోటేశ్వరరావు భేటీ.. నైతిక విలువలతోనే విద్యా వికాసం
గతంలో ఎంపికై తాజా జాబితాలో 202 మంది పేర్లు గల్లంతు కావడంపై ఏం సమాధానం చెబుతారని ప్రభుత్వాన్ని లోకేష్ నిలదీశారు. డిజిటల్ వేల్యూయేషన్లో 142 మంది తెలుగు మీడియం వాళ్లు ఎంపిక కాగా మాన్యువల్లో 47 మంది మాత్రమే సెలెక్ట్ కావడం వెనుక ఏ జగన్నాటకం నడిచిందో చెప్పాలన్నారు. ప్రశ్నలు-జవాబులు మారనప్పుడు ఈ స్థాయిలో డిజిటల్ మాన్యువల్ వేల్యూయేషన్లో తేడాలు ఎవరి కోసం తారుమారై వచ్చాయో వెల్లడించాలన్నారు. స్పోర్ట్స్ కోటాలో ఇంటర్వ్యూకి 75 మంది ఎంపికైతే మూడునెలల్లో పూర్తి చేయాల్సిన మాన్యువల్ వాల్యుయేషన్ని 8 నెలలు సాగదీసి 48 మందికి కుదించారన్నారు. అర్హులై ఉండి కూడా ఎంపికకాని అభ్యర్థులకు న్యాయం చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
Tejaswini Nandamuri : బాలయ్య కూతురిని డైరెక్ట్ చేయబోయే దర్శకురాలు ఎవరంటే?
ట్రెండింగ్
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!