Srisailam Project: శ్రీశైలం జలాశయంలో వేగంగా పడిపోయిన నీటిమట్టం.. డెడ్ స్టోరేజీకి చేరువగా..!
- శ్రీశైలం జలాశయంలో వేగంగా పడిపోతోన్న నీటిమట్టం..
- ఎడమగట్టు విద్యుత్ కేంద్రం కొనసాగుతోన్న విద్యుత్ ఉత్పత్తి..
- కుడి విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srisailam Project: శ్రీశైలం జలాశయంలో ఒకవైపు నీటిమట్టం వేగంగా పడిపోతుంది. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి తెలంగాణ జెన్కో విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తుండగా.. కుడి విద్యుత్ కేంద్రంలో ఏపీ జెన్కో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేసింది. రోజుకు ఒక టీఎంసీకి పైగానే విద్యుత్ ఉత్పత్తికి వినియోగిస్తుండడంతో సమీప కాలంలోనే శ్రీశైలం డ్యామ్ లో నీటిమట్టం డెడ్ స్టోరేజీకి చేరుకోనుంది.. అంటే ఇప్పుడు శ్రీశైలం జలాశయం లో నీటిమట్టం డెడ్ స్టోరేజీకి చేరువగా అయిపోయింది.. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 837.5 అడుగులు ఉంది. పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 58.1456 టీఎంసీలు ఉంది.
Read Also: Rakul Preet : స్టైలిష్ డ్రెస్ లో రకుల్ ప్రీత్ సొగసులు..
Also Read
- Nandyal Bus Accident: గేదెలను తప్పించే క్రమంలో ట్రావెల్స్ బస్సు బోల్తా.. బస్సులో 34 మంది ప్రయాణికులు
- Ambati Rambabu: అమరావతి నా జన్మలోనే కాదు.. చంద్రబాబు, లోకేష్ జన్మలో కూడా పూర్తి కాదు..!
- Srisailam: నేడు శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికా దేవి కుంభోత్సవం
- Bhuma Akhila Priya: హత్య కేసుల్లో జీవిత ఖైదు పడిన 12 మంది దోషులకు భూమా అఖిల ప్రియ పరామర్శ.. సంచలన వ్యాఖ్యలు
అయితే, తెలంగాణ జెన్కో ఎడమ గట్టు విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తోంది. విద్యుత్ ఉత్పత్తి ద్వారా రోజుకు ఒక టీఎంసీ నుంచి 2 టీఎంసీల వరకు నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో నీటిమట్టం వేగంగా పడిపోతోంది. ఇవాళ కూడా ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 19,493 క్యూసెక్కుల నీటిని వినియోగించారు. బుధవారం సాయంత్రానికి 61.9240 టీఎంసీల నీరు డ్యామ్ లో ఉండగా ఇవాళ మధ్యాహ్నానికి 58.1456 టీఎంసీలకు తగ్గిపోయాయి. తెలంగాణ జెన్కో డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. శ్రీశైలం జలాశయానికి ఈ వాటర్ ఇయర్ లో మొత్తం 1600.50 టీఎంసీల నీరు కృష్ణ , తుంగభధ్ర నదుల నుంచి చేరింది. క్రస్టు గేట్ల ద్వారా 687.05 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేసారు. ఏపీ జెన్కో కుడిగట్టు విద్యుత్ కేంద్రం లో 199.39 టీఎంసీల నీటిని వినియోగించి 1155.99 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు. తెలంగాణ జెన్కో ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 398.41 టీఎంసీలు వినియోగించి 2058.86 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 41.78 టీఎంసీలు, మాల్యాల ఎత్తిపోతల పథకం ద్వారా 29.55 టీఎంసీలు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 211.48, టీఎంసీలు విడుదల చేసారు. ముచ్చుమర్రి లిఫ్ట్ ద్వారా 2.54 టీఎంసీలు విడుదల చేసారు. ప్రస్తుతం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుండగా కుడిగట్టు విద్యుత్ కేంద్రం లో ఉత్పత్తి నిలిపివేశారు.
తాజావార్తలు
-
Rohit Sharma: “నన్ను క్షమించు..” మహిళా అభిమానికి ‘హిట్ మ్యాన్’ స్పెషల్ రిక్వెస్ట్..!
-
Supreme Court: చిన్నారుల మిస్సింగ్లపై కిడ్నాప్ కేసు నమోదు చేయాల్సిందే.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
-
Film Chamber: ఆ కలరింగ్ అంతా అబద్ధం.. ‘పెద్ది’ పర్సెంటేజ్ డీల్ను తిరస్కరించిన ఎగ్జిబిటర్లు
-
Virat Kohli: స్టాండ్స్లో ‘49’ హంగామా.. కోహ్లీ రియాక్షన్ మాములుగా లేదుగా..!
-
Methi Na Gota Recipe: వర్షం పడేటప్పుడు వేడివేడిగా.. గుజరాత్ స్పెషల్ క్రిస్పీ స్నాక్ రెసిపీ..!
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!