Srisailam Project: శ్రీశైలం జలాశయంలో వేగంగా పడిపోయిన నీటిమట్టం.. డెడ్ స్టోరేజీకి చేరువగా..!
- శ్రీశైలం జలాశయంలో వేగంగా పడిపోతోన్న నీటిమట్టం..
- ఎడమగట్టు విద్యుత్ కేంద్రం కొనసాగుతోన్న విద్యుత్ ఉత్పత్తి..
- కుడి విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srisailam Project: శ్రీశైలం జలాశయంలో ఒకవైపు నీటిమట్టం వేగంగా పడిపోతుంది. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి తెలంగాణ జెన్కో విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తుండగా.. కుడి విద్యుత్ కేంద్రంలో ఏపీ జెన్కో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేసింది. రోజుకు ఒక టీఎంసీకి పైగానే విద్యుత్ ఉత్పత్తికి వినియోగిస్తుండడంతో సమీప కాలంలోనే శ్రీశైలం డ్యామ్ లో నీటిమట్టం డెడ్ స్టోరేజీకి చేరుకోనుంది.. అంటే ఇప్పుడు శ్రీశైలం జలాశయం లో నీటిమట్టం డెడ్ స్టోరేజీకి చేరువగా అయిపోయింది.. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 837.5 అడుగులు ఉంది. పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 58.1456 టీఎంసీలు ఉంది.
Read Also: Rakul Preet : స్టైలిష్ డ్రెస్ లో రకుల్ ప్రీత్ సొగసులు..
Also Read
- Traffic Jam : శ్రీశైలం వద్ద ట్రాఫిక్ నరకం.. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు!
- Nandyal Bus Accident: గేదెలను తప్పించే క్రమంలో ట్రావెల్స్ బస్సు బోల్తా.. బస్సులో 34 మంది ప్రయాణికులు
- Ambati Rambabu: అమరావతి నా జన్మలోనే కాదు.. చంద్రబాబు, లోకేష్ జన్మలో కూడా పూర్తి కాదు..!
- Srisailam: నేడు శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికా దేవి కుంభోత్సవం
అయితే, తెలంగాణ జెన్కో ఎడమ గట్టు విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తోంది. విద్యుత్ ఉత్పత్తి ద్వారా రోజుకు ఒక టీఎంసీ నుంచి 2 టీఎంసీల వరకు నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో నీటిమట్టం వేగంగా పడిపోతోంది. ఇవాళ కూడా ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 19,493 క్యూసెక్కుల నీటిని వినియోగించారు. బుధవారం సాయంత్రానికి 61.9240 టీఎంసీల నీరు డ్యామ్ లో ఉండగా ఇవాళ మధ్యాహ్నానికి 58.1456 టీఎంసీలకు తగ్గిపోయాయి. తెలంగాణ జెన్కో డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. శ్రీశైలం జలాశయానికి ఈ వాటర్ ఇయర్ లో మొత్తం 1600.50 టీఎంసీల నీరు కృష్ణ , తుంగభధ్ర నదుల నుంచి చేరింది. క్రస్టు గేట్ల ద్వారా 687.05 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేసారు. ఏపీ జెన్కో కుడిగట్టు విద్యుత్ కేంద్రం లో 199.39 టీఎంసీల నీటిని వినియోగించి 1155.99 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు. తెలంగాణ జెన్కో ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 398.41 టీఎంసీలు వినియోగించి 2058.86 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 41.78 టీఎంసీలు, మాల్యాల ఎత్తిపోతల పథకం ద్వారా 29.55 టీఎంసీలు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 211.48, టీఎంసీలు విడుదల చేసారు. ముచ్చుమర్రి లిఫ్ట్ ద్వారా 2.54 టీఎంసీలు విడుదల చేసారు. ప్రస్తుతం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుండగా కుడిగట్టు విద్యుత్ కేంద్రం లో ఉత్పత్తి నిలిపివేశారు.
తాజావార్తలు
-
Indian Crew Tanker Incident: భారత్ నౌకపై దాడి.. మృతుల్లో విశాఖ వాసి
-
Varalaxmi Sarathkumar: హీరోయిన్ వరలక్ష్మికి ‘పోలీస్ కంప్లైంట్’ డైరెక్టర్ బహిరంగ క్షమాపణ
-
ODI World Cup 2027: ఆఫ్రికా వేదికగా 2027 వన్డే ప్రపంచకప్.. 54 మ్యాచ్లు.. షెడ్యూల్ ఖరారు..
-
AP DSC Recruitment: మరో డీఎస్సీ.. నిరాశ చెందిన అభ్యర్థులకు గుడ్న్యూస్
-
Dravid: ద్రవిడ్ వారసుడు వచ్చేస్తున్నాడు.. అండర్-19 జట్టుకు ఎంపికైన రాహుల్ ద్రవిడ్ కుమారుడు..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!