Tragedy In Nandyal District: నంద్యాలలో విషాదం.. కూలిన మట్టి మిద్దె.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి
- నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం చిన్నవంగలిలో విషాదం..
- ఇల్లు కూలి ఒకే కుటుంబంలో నలుగురు మృతి..
- అర్ధరాత్రి నిద్రలో ఉన్న సమయంలో కూలిన మట్టి మిద్దె..
- భార్య.. భర్త.. ఇద్దరు పిల్లలు మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tragedy In Nandyal District: నంద్యాల జిల్లాలో విషాదం నెలకొంది. చాగలమర్రి మండలం చిన్నవంగలిలో ఇల్లు కూలి ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందారు. ఆ కుటుంబం గాఢ నిద్రలో ఉన్న సమయంలో.. అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.. ఈ ప్రమాదంలో భార్య, భర్త, ఇద్దరు పిల్లలు మృతి చెందారు. గురు శేఖర్ రెడ్డి, దస్తగిరమ్మ, కుమార్తెలు పవిత్ర(15), గురులక్ష్మి(7) నిద్రలోనే ప్రాణాలు వదిలారు. రెండవ కుమార్తె చాగలమర్రిలో హాస్టల్లో వుంటూ చదువుతోంది. దీంతో ప్రసన్న ప్రాణాలతో బయటపడింది. తల్లిదండ్రులు, ఇద్దరు చెల్లెల్లు చనిపోయారని తెలియగానే హాస్టల్ నుంచి వచ్చింది. తల్లిదండ్రులు, చెల్లెళ్ళ మృతదేహాలు చూసి స్పృహ కోల్పోయి పడిపోయింది ప్రసన్న. మట్టి మిద్దె కావడంతో మృతదేహాలు మట్టిలో కూరుకుపోయాయి. మృతదేహాలను స్థానికులు వెలికి తీశారు.
Read Also: Paris Olympic 2024 : నేడు మరోసారి బరిలో మను భాకర్.. మూడో పతకం సాధించేనా?
Also Read
- Traffic Jam : శ్రీశైలం వద్ద ట్రాఫిక్ నరకం.. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు!
- Nandyal Bus Accident: గేదెలను తప్పించే క్రమంలో ట్రావెల్స్ బస్సు బోల్తా.. బస్సులో 34 మంది ప్రయాణికులు
- Ambati Rambabu: అమరావతి నా జన్మలోనే కాదు.. చంద్రబాబు, లోకేష్ జన్మలో కూడా పూర్తి కాదు..!
- Srisailam: నేడు శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికా దేవి కుంభోత్సవం
ఇల్లు పాతది కావడం, వర్షాలకు బాగా తడిసి కూలిపోయిందని స్థానికులు చెబుతున్నారు. మృతదేహాలు శిథిలాల నుండి తొలగిస్తుండగా ఇద్దరు చిన్నారులు నిద్రిస్తున్న స్థితిలోనే మృతి చెందారని కంటతడి పెట్టుకున్నారు స్థానికులు. గురు శేఖర్ రెడ్డి నిరుపేద కుటుంబం. పొలాలు కౌలుకు తీసుకోవడం, లేదంటే కూలి పనులకు వెళ్లి జీవనం గడపడం. ఈ విషాదం గ్రామంలో విషాదం నింపింది. ఇక, ఆ కుటుంబంలోని నలుగురు మృతిచెందగా.. హాస్టల్లో ఉండడం వల్లే.. మరో కూతురు ప్రాణాలు బయటపడినట్టు అయ్యింది.. అయితే, కుటుంబంలోని నలుగురు ఒకేసారి ప్రాణాలు వదలడం.. ఆ గ్రామంలో విషాదంగా మారింది.. వర్షాలు కురుస్తోన్న నేపథ్యంలో.. పాత ఇళ్లలో నివాసం ఉంటున్నవారు జాగ్రత్తగా ఉండాలని.. శిథిలావస్థలో ఉంటే.. వాటిని ఖాళీ చేయడమే మంచిదని అధికారులు సూచిస్తున్నారు..
తాజావార్తలు
-
Shehbaz Sharif: ఇరాన్ అధ్యక్షుడి టూర్లో పాక్ ప్రధాని వింత ప్రవర్తన.. నెట్టింట తీవ్ర విమర్శలు
-
PoK: పీఓకే ప్రజల్ని ఆకలితో చంపేస్తున్న పాకిస్తాన్..
-
Bunny Vas : తెలుగుమ్మాయని అవకాశం ఇస్తే.. మాకు 15 రూల్స్ పెట్టింది.
-
CM Revanth Reddy: చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచే రోజు ఇది.. జల వివాదాలకు శాశ్వత పరిష్కారం..!
-
Vaibhav Sooryavanshi: పక్కా ప్లాన్తో బరిలోకి వైభవ్ సూర్యవంశీ.. కాటేరమ్మ కొడుకు రికార్డుపైనే గురి..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!