Srisailam: కార్తీక పౌర్ణమి ఎఫెక్ట్.. శ్రీశైలం మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు
- కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశైలం మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు..
- పాతాళగంగలో పుణ్యస్నానాలను ఆచరిస్తున్న భక్తజనం ..
- గంగాధర మండపం,ఉత్తర మాడవీధిలో కార్తీక దీపాలను వెలిగిస్తున్న భక్తులు..
- భక్తుల రద్దీ దృష్ట్యా భక్తులందరికి శ్రీస్వామివారి అలంకార దర్శనానికి అనుమతి..
- శ్రీస్వామి, అమ్మవారి దర్శనానికి సుమారు 2 నుండి 3 గంటల సమయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srisailam: కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు శ్రీశైలం చేరుకుని, పాతాళగంగలో పవిత్ర స్నానాలు ఆచరించారు. కార్తీక పౌర్ణమి పుణ్యస్నానం ఎంతో పవిత్రమని నమ్మే భక్తులు గంగా దేవిని స్మరిస్తూ పుణ్యస్నానంలో పాల్గొన్నారు. గంగాధర మండపం, ఉత్తర మాడవీధి, ఈశాన్య వీధుల్లో భక్తులు వేలాది దీపాలను వెలిగించి భక్తి శ్రద్ధలతో మల్లన్నను ప్రార్థించారు. సాయంత్రం సమయానికి దీపాలతో కాంతులీనిన శ్రీశైలం ఆధ్యాత్మిక క్షేత్రం అద్భుత దృశ్యాన్ని సంతరించుకుంది.
Read Also: Kohli Breakup Story: విరాట్ కోహ్లీ, అనుష్క “బ్రేకప్”.. ఈ జంటను కలిపిన నటుడు ఎవరో తెలుసా..?
Also Read
- Srisailam Temple: శ్రీశైలం మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
- Srisailam Ghat Road Traffic Jam: వరుస సెలవుల ఎఫెక్ట్.. శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
- Srisailam Water Release: గుడ్న్యూస్.. శ్రీశైలం నుంచి నీటి విడుదల ప్రారంభం
ఇక, భక్తుల రద్దీ దృష్ట్యా దేవాదాయశాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రీస్వామి, అమ్మవారి అలంకార దర్శనానికి అందరికీ అనుమతి ఇవ్వగా, భక్తులు రెండు నుండి మూడు గంటల సమయం వేచి దర్శనం పొందుతున్నారు. భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు, తాగునీటి సదుపాయం, వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. శివనామస్మరణతో మారుమోగుతున్న శ్రీశైలం క్షేత్రం ఈ రోజు మరింత పవిత్రంగా మారింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా జరిగే ఈ ఉత్సవం ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. ఇక, శ్రీశైలం మల్లన్న ఆలయంలో వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు జరుగుతున్నాయి.. సాయంత్రం గంగాధర మండపం వద్ద జ్వాలా తోరణ మహోత్సవం నిర్వహించనున్నారు.. ఆలయ పుష్కరిణిలో లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి నిర్వహించనున్నారు..
తాజావార్తలు
-
Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
-
Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
-
Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
-
Irumudi Effect : అయ్యప్ప దీక్షలో గణపయ్య.. తలపై స్వయంగా ‘ఇరుముడి’ పెడుతున్న శివుడు!
-
Allu Arjun Fans : బాక్సాఫీస్ వద్దే కాదు సామాజిక సేవలోనూ ‘తగ్గేదే లే’
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!