Srisailam: కార్తీక పౌర్ణమి ఎఫెక్ట్.. శ్రీశైలం మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు
- కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశైలం మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు..
- పాతాళగంగలో పుణ్యస్నానాలను ఆచరిస్తున్న భక్తజనం ..
- గంగాధర మండపం,ఉత్తర మాడవీధిలో కార్తీక దీపాలను వెలిగిస్తున్న భక్తులు..
- భక్తుల రద్దీ దృష్ట్యా భక్తులందరికి శ్రీస్వామివారి అలంకార దర్శనానికి అనుమతి..
- శ్రీస్వామి, అమ్మవారి దర్శనానికి సుమారు 2 నుండి 3 గంటల సమయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srisailam: కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు శ్రీశైలం చేరుకుని, పాతాళగంగలో పవిత్ర స్నానాలు ఆచరించారు. కార్తీక పౌర్ణమి పుణ్యస్నానం ఎంతో పవిత్రమని నమ్మే భక్తులు గంగా దేవిని స్మరిస్తూ పుణ్యస్నానంలో పాల్గొన్నారు. గంగాధర మండపం, ఉత్తర మాడవీధి, ఈశాన్య వీధుల్లో భక్తులు వేలాది దీపాలను వెలిగించి భక్తి శ్రద్ధలతో మల్లన్నను ప్రార్థించారు. సాయంత్రం సమయానికి దీపాలతో కాంతులీనిన శ్రీశైలం ఆధ్యాత్మిక క్షేత్రం అద్భుత దృశ్యాన్ని సంతరించుకుంది.
Read Also: Kohli Breakup Story: విరాట్ కోహ్లీ, అనుష్క “బ్రేకప్”.. ఈ జంటను కలిపిన నటుడు ఎవరో తెలుసా..?
Also Read
- CM Chandrababu: రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ.. భువివాదాలు లేకుండా చేస్తాం..
- NSTR Forest Entry Ban: నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఆంక్షలు.. 3 నెలలు నో ఎంట్రీ..!
- Traffic Jam : శ్రీశైలం వద్ద ట్రాఫిక్ నరకం.. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు!
- Nandyal Bus Accident: గేదెలను తప్పించే క్రమంలో ట్రావెల్స్ బస్సు బోల్తా.. బస్సులో 34 మంది ప్రయాణికులు
ఇక, భక్తుల రద్దీ దృష్ట్యా దేవాదాయశాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రీస్వామి, అమ్మవారి అలంకార దర్శనానికి అందరికీ అనుమతి ఇవ్వగా, భక్తులు రెండు నుండి మూడు గంటల సమయం వేచి దర్శనం పొందుతున్నారు. భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు, తాగునీటి సదుపాయం, వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. శివనామస్మరణతో మారుమోగుతున్న శ్రీశైలం క్షేత్రం ఈ రోజు మరింత పవిత్రంగా మారింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా జరిగే ఈ ఉత్సవం ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. ఇక, శ్రీశైలం మల్లన్న ఆలయంలో వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు జరుగుతున్నాయి.. సాయంత్రం గంగాధర మండపం వద్ద జ్వాలా తోరణ మహోత్సవం నిర్వహించనున్నారు.. ఆలయ పుష్కరిణిలో లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి నిర్వహించనున్నారు..
తాజావార్తలు
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!
-
Dating Rumours: మృణాల్, రిషబ్ పంత్పై డేటింగ్ రూమర్స్!.. ఒక్క ఇన్స్టాగ్రామ్ ఫాలోతో వైరల్
-
Boyfriend for Rent: ఇండియాలో అద్దెకు బాయ్ఫ్రెండ్.. గంటకు ఎంత ఛార్జ్ చేస్తున్నారు?
-
Mudragada Daughter: కూతురు క్రాంతిని అడ్డుకున్న ముద్రగడ అనుచరులు.. గోబ్యాక్ క్రాంతి అంటూ నినాదాలు!
ట్రెండింగ్
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!