జిల్లాల పేర్లలో స్వల్ప మార్పులు… జిల్లాల విభజనపై పలుచోట్ల నిరసనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను విభజిస్తూ 26 జిల్లాలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే జిల్లాల పేర్లలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. మంగళవారం కేబినెట్ సమావేశంలో ప్రవేశపెట్టిన మెమోరాండానికి, తర్వాత ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లలో తేడాలు కనిపించాయి. కేబినెట్ సమావేశంలో ప్రవేశపెట్టిన మెమోరాండంలో కాకినాడ కేంద్రంగా ఉన్న జిల్లాకు తూర్పుగోదావరి అని… రాజమండ్రి కేంద్రంగా ఏర్పాటు కానున్న జిల్లాకు రాజమండ్రి జిల్లా అని పేరు పెట్టినట్లు ఉంది. అయితే ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లో మాత్రం కాకినాడ కేంద్రంగా ఉన్న జిల్లాకు కాకినాడ జిల్లా అని… రాజమండ్రి కేంద్రంగా ఏర్పాటు కానున్న జిల్లాకు తూర్పుగోదావరి అని పేరు పెట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.
అలాగే కేబినెట్ భేటీలోని మెమోరాండంలో ఏలూరు కేంద్రంగా ఉన్న జిల్లాకు పశ్చిమగోదావరి అని… భీమవరం కేంద్రంగా ఏర్పాటు కానున్న జిల్లాకు నరసాపురం జిల్లా అని పేరు పెట్టినట్లు ఉంది. ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లో మాత్రం ఏలూరు కేంద్రంగా ఉన్న జిల్లాకు ఏలూరు జిల్లా అని, భీమవరం కేంద్రంగా ఏర్పాటు కానున్న జిల్లాకు పశ్చిమగోదావరి అని పేరు పెట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. రాజమండ్రి, భీమవరం కేంద్రాలుగా ఏర్పాటు కానున్న జిల్లాలు ఎక్కువ భాగం గోదావరిని ఆనుకుని ఉండటంతో వాటికి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు అని పేర్లు పెట్టాలని కొందరు మంత్రులు చేసిన సూచనల మేరకు మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
Also Read
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 1 నుంచి ప్రారంభం..
- Indrakeeladri: ఆషాఢ సారె ఉత్సవాలు.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు..
- AP Covid Cases: ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. నేటికి ఆ సంఖ్య ఎంతకు చేరిందంటే..
- Donkey Wedding: వర్షాలు కురవాలని గాడిదలకు ఘనంగా పెళ్లి.. కళ్యాణదుర్గంలో వినూత్న సంప్రదాయం!
మరోవైపు జిల్లాల విభజనపై రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. విజయవాడకు సమీపంలో ఉండే పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాలను విజయవాడ కేంద్రంగా ఉండే జిల్లాలో కాకుండా… మచిలీపట్నం కేంద్రంగా ఉన్న కృష్ణా జిల్లాలో కలపడంపై స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. అటు రాయచోటి కేంద్రంగా ఏర్పాటైన అన్నమయ్య జిల్లాకు మదనపల్లిని జిల్లా కేంద్రంగా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా నంద్యాల లోక్సభ స్థానం పరిధిలోని పాణ్యం శాసనసభ స్థానాన్ని కర్నూలు జిల్లాలో కలపడాన్ని పాణ్యం, గడివేముల మండలాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
తాజావార్తలు
-
FIFA ఫైనల్లో ట్రంప్కు ఊహించని అవమానం.. అసలేం జరిగిందంటే?
-
Lenin : అఖిల్ బాక్సాఫీస్ ఊచకోత.. 10 రోజుల్లో ‘లెనిన్’ కలెక్షన్స్ ఎంతో తెలుసా?
-
Yash: రాకింగ్ స్టార్ యష్తో ప్రశాంత్ వర్మ సినిమా? మామూలుగా ఉండదట!
-
Abhijeet Dipke: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే అరెస్ట్..
-
Silk Smitha: నాకు ఒకడు జీవితం ఇస్తానన్నాడు.. రోజూ టార్చర్ నేను భరించలేను.. సిల్క్ స్మిత సూసైడ్ నోట్ చూశారా?
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!