Nadendla Manohar : డీజిల్ కొరతకు కారణం ఇదే.. రేపు ఉదయం కల్లా బంకులకు స్టాక్.. మంత్రి కీలక ప్రకటన..!
- డీజిల్ కొరతపై ప్రభుత్వం అత్యవసర సమీక్ష
- రేపు ఉదయం కల్లా బంకులకు పూర్తి సరఫరా
- బ్లాక్ మార్కెట్పై కఠిన చర్యలు.. ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు
- పానిక్ బాయింగ్ వద్దు.. ప్రజలకు మంత్రి విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nadendla Manohar Assures Diesel Supply Restoration : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా తలెత్తిన పెట్రోల్, డీజిల్ కొరతపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వేగంగా స్పందించింది. ఇంధన సరఫరాలో ఏర్పడిన ఇబ్బందులు , కృత్రిమ కొరతపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఉన్నతాధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పెట్రోల్ బంకులకు రేపు ఉదయం 6 గంటల కల్లా ఇంధన సరఫరాను పునరుద్ధరించాలని మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు పూర్తిస్థాయిలో పెట్రోల్, డీజిల్ చేరుతుందని, ఎక్కడా ‘నో స్టాక్’ బోర్డులు లేకుండా సాధారణ స్థితికి తీసుకొస్తామని హామీ ఇచ్చారు.
ఇంధన కొరతను ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు బ్లాక్ మార్కెట్కు పాల్పడుతున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై మంత్రి ఘాటుగా స్పందించారు. కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయించే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో నిఘా పెంచేందుకు వీలుగా ప్రత్యేక ‘ఫ్లయింగ్ మొబైల్ స్క్వాడ్’లను ఏర్పాటు చేయాలని, బంకుల వద్ద ఎటువంటి గొడవలు జరగకుండా పోలీసులతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు. సరఫరాలో కేవలం చిన్నపాటి సాంకేతిక లోపాలు మాత్రమే ఉన్నాయని, కానీ సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Also Read
- Kandula Jessie: 108 దేశాలు, 12 వేల మంది పోటీదారులు.. ప్రపంచ అంతరిక్ష మిషన్కు ఎంపికైన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని!
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, నేతన్నలకు భరోసా..
- Vallabhaneni Vamsi: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ.. పట్టిసీమ నీటిపై జోక్యం చేసుకోండి..
- Gadikota Srikanth Reddy: 'ఫాల్స్ ప్రచారం చేస్తున్నారు'.. సీఎంపై గడికోట శ్రీకాంత్ రెడ్డి ఫైర్
ప్రజలు భయాందోళనతో (Panic buying) అవసరానికి మించి ఇంధనాన్ని కొనుగోలు చేయవద్దని, ముఖ్యంగా డబ్బాలు , డ్రమ్ముల్లో పెట్రోల్ నిల్వ చేసుకోవద్దని మంత్రి కోరారు. అటువంటి వారికి ఇంధనం విక్రయించవద్దని బంకు యజమానులకు నిబంధనలు విధించారు. ప్రస్తుతం రాష్ట్ర అవసరాలకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని ఆయిల్ కంపెనీలు ధృవీకరించినట్లు మంత్రి తెలిపారు. ఈ కీలక సమయంలో అధికారుల మధ్య ఎటువంటి మిస్ కమ్యూనికేషన్ ఉండకూడదని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రతి జిల్లాలో జాయింట్ కలెక్టర్లు పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశిస్తూ, రాష్ట్రంలో ఇంధన సరఫరా వ్యవస్థను త్వరలోనే గాడిలో పెడతామని భరోసా ఇచ్చారు.
తాజావార్తలు
-
Healthy Diet : షుగర్ ఉందా.? ఈ 6 ఫుడ్ మిస్టేక్స్ మీ కిడ్నీలను దెబ్బతీస్తున్నాయ్.!
-
CJP Protest: సీజేపీ ఉద్యమానికి ఖలిస్తాన్ ఉగ్రవాది మద్దతు..? వైరల్ అవుతున్న వీడియో..
-
Delhi: 2024 నీట్ పేపర్ లీక్ కేసులో సంజీవ్ ముఖియాకు సీబీఐ క్లీన్చిట్.. కేంద్రంపై కేజ్రీవాల్ ధ్వజం
-
Viral Wedding: ముచ్చటగా ఒకేసారి ముగ్గురు అక్కాచెల్లెళ్లను పెళ్లాడిన యువకుడు.. ఎక్కడంటే?
-
CJP Protest: ఏ సమయంలోనైనా చర్చలకు సిద్ధం.. సీజేపీకి కేంద్రం మరోసారి పిలుపు..
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!