Nadendla Manohar: రైతుల్ని మోసం చేయడంలో జగన్ని మించినవారు లేరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గణపవరంలో ప్రసంగంలో భాగంగా పవన్ కళ్యాణ్ రైతు భరోసా యాత్రపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా జనసేన రాజకీయ వ్యవహారాల ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఓ ప్రకటన విడుదల చేశారు. రైతుల్ని మోసం చేయడంలో సీబీఐ దత్తపుత్రుడు జగన్ని మించిన వాళ్ళు మరెవ్వరు ఉండరని విమర్శించారు. వైకాపా చెప్పిన లెక్కల ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వ నిధులు, కేంద్ర ప్రభుత్వ నిధులు కలుపుకుంటే ప్రతి రైతుకు రూ. 19,500 రావాలని.. కానీ జగన్ ప్రభుత్వం ఇస్తోంది కేవలం రూ. 13,500 మాత్రమేనని అన్నారు. ఈ లెక్కన ఒక్క రైతుపై జగన్ సర్కారు రూ. 6 వేలు మిగుల్చుకుంటోందని, దీనికి ఏం సమాధానం చెప్తారంటూ ప్రశ్నించారు.
రాష్ట్రంలో కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. జగన్ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని నాదెండ్ల అన్నారు. తాను రైతు బిడ్డనని చెప్పుకుంటున్న జగన్.. అలా చెప్పుకుంటున్నందుకు సిగ్గుపడాలన్నారు. ఆయన చంచల్గూడ బిడ్డ అని అందరికీ తెలుసని, గణపవరంలో చేసిన ప్రసంగం పవన్ చేపట్టిన రైతు భరోసా యాత్రపై అక్కసు వెళ్ళగక్కడానికే సరిపోయిందని ఎద్దేవా చేశారు. అనంతపురం, పశ్చిమ గోదావరి, కర్నూలు జిల్లాల్లో పవన్ పర్యటించి.. మొత్తం 200 మంది కౌలు రైతు కుటుంబాల్ని పరామర్శించారని, వారికి రూ. 1 లక్ష చొప్పున ఆర్థిక సాయం కూడా చేశారన్నారు. ఈ 200 మంది కౌలు రైతులు కాదని జగన్ రెడ్డి చెప్పగలరా? అని నిలదీశారు.
Also Read
- Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
- Off The Record : సర్వేపల్లి సవాల్: అక్కడ డ్యూటీ చేయాలంటేనే అధికారుల గుండెల్లో వణుకు!
- Off The Record : కూటమిలో చిచ్చు.. విజయవాడ సీట్ల పంచాయతీ తేలేదెప్పుడు?
- AP Weather: ఏపీలో విభిన్న వాతావరణం.. ఒకవైపు వడగాల్పులు.. మరోవైపు వర్ష సూచన.!
గత మూడేళ్ళుగా వైకాపా ప్రభుత్వం ఎలాంటి ప్రణాళిక లేకుండా, రైతు శ్రేయస్సును పట్టించుకోకుండా సాగిస్తోన్న పరిపాలనతో రైతులు అన్ని విధాలుగా నష్టపోతున్నారని నాదెండ్ల చెప్పారు. కౌలు రైతులకు ఇచ్చే అర్హత కార్డులు కూడా రాకుండా చేస్తున్నారని.. దీంతో వారికి బ్యాంకు రుణాలు, పంట నష్ట పరిహారం, బీమా వంటివేమీ వర్తించడం లేదని వెల్లడించారు. రైతుల్ని కులాలవారీగా విభిజించి లబ్ది పొందాలని ఆలోచిస్తోన్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే.. అది వైకాపా సర్కారేనని ఆగ్రహించారు. రైతుల పట్ల జగన్కి చిత్తశుద్ధి ఉంటే.. కులాల వారీగా విభజిస్తూ తీసుకొచ్చిన నిబంధనల్ని తొలగించాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.
జీవో 102, 43లను అనుసరించి ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకి రూ. 7 లక్షలు ఇవ్వాలని.. కానీ రూ. 1 లక్ష పరిహారం ఇచ్చి జగన్ సర్కార్ సరిపెట్టుకుందని నాదెండ్ల మండిపడ్డారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలనే నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్న ధైర్యం జగన్కి ఉందా? అని సవాల్ విసిరారు. చిత్తశుద్ధి లేకుండా ఇష్టానుసారం మాట్లాడి, గొప్పలు చెప్పుకున్నా.. రైతులు విశ్వసించరని, వాస్తవాలేంటో రైతాంగానికి తెలుసని నాదెండ్ల మనోహర్ అన్నారు.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!