Nadendla Manohar: వైసీపీకి సవాల్.. దమ్ముంటే ఇప్పుడే ఎన్నికలు నిర్వహించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ ప్లీనరీ ద్వారా ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. వైసీపీ నేతలు వ్యక్తిగత విమర్శలు చేయడం ఎంతమాత్రం శ్రేయస్కారం కాదన్నారు. వైసీపీ నేతలు మాట్లాడే భాష కనీసం మర్యాదపూర్వకంగా ఉండటం లేదని.. ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని గుర్తుపెట్టుకోవాలన్నారు. వైసీపీ చేపట్టిన గడప గడపకు కార్యక్రమం ఫెయిల్యూర్ కావడంతో సీఎం జగన్ ఫస్ట్రేషన్తో మాట్లాడుతున్నారని నాదెండ్ల మనోహర్ కౌంటర్ ఇచ్చారు. 1.27 లక్షల కోట్లు ఏపీలోని రైతాంగాన్ని ఆదుకున్నామని సీఎం జగన్ చెప్పిన మాటలు నిజమేనా అని ప్రశ్నించారు. ఇది నిజమే అయితే జగన్ ప్రభుత్వం వచ్చాక 3వేల మంది రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారని నిలదీశారు. ఉద్యోగులు దాచుకున్న జీపీఎఫ్ నిధులను జగన్ సర్కారు ఎందుకు లాక్కుందని సూటిగా అడిగారు.
Read Also: CM Jagan: చిప్ వేలికి, కాళ్లకు ఉంటే సరిపోదు.. చినమెదడులో ఉండాలి
Also Read
- Polavaram District: ఏపీలో విషాదం.. ఒకే ప్రియుడి కోసం ఇద్దరు యువతులు ఆత్మహత్య..
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
- Gadikota Srikanth Reddy: కొత్త పెన్షన్ల పేరుతో మళ్లీ మోసం.. గడికోట ఫైర్
- Minister TG Bharath: కర్నూలులో జాబ్ మేళా ప్రారంభం.. యువతకు ఉద్యోగాలు.. కర్నూలుకు భారీ పెట్టుబడులు..!
కోనసీమ అల్లర్లలో మంత్రి విశ్వరూప్ ఇంటిపై జరిగిన దాడిని సీఎం జగన్ ఎందుకు ఖండించలేదో చెప్పాలని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం నిజంగానే 95 శాతం మేనిఫెస్టోలోని హామీలను అమలు చేశామని భావిస్తే దమ్ముంటే వచ్చే ఏడాది ఏప్రిల్లోనే ఎన్నికలు నిర్వహించాలని సవాల్ విసిరారు. అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి ప్రజలను భయపెట్టించి స్థానిక సంస్థల్లో గెలిచారని.. ఆ విషయాన్ని గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. సీఎం జగన్ పులివెందుల వెళ్లినప్పుడు బారికేడ్లు ఏర్పాట్లు చేసి షాపులు మూయించాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందో చెప్పాలన్నారు. ఇన్నిరోజులుగా వైసీపీ సర్కారు గోబెల్స్ ప్రచారం చేసుకుని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని గొప్పగా చెప్పుకుంటోందని.. పోలవరం ప్రాజెక్ట్ ఏమైందని నిలదీశారు. జగన్ పాలన బాగుంటే తాము నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి వేల సంఖ్యలో అర్జీలు ఎందుకు వస్తున్నాయో చెప్పాలన్నారు.
తాజావార్తలు
-
Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..
-
Sharanya: ‘లైఫ్ ఆగమాగం చేశారు.. బాబును జాగ్రత్తగా చూసుకోండి’ ఈశ్వర్ సాయి భార్య ఆత్మహత్యాయత్నం..
-
Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
-
Hyderabad: బ్యాచిలర్లకు గుడ్ న్యూస్.. వినాయక చవితి అన్నదానాల కోసం సరికొత్త వెబ్సైట్.. పూర్తి వివరాలు ఇవే..
-
UP: మొన్న గురుగ్రామ్.. ఇవాళ లక్నోలో యువతిని కారుతో ఢీకొట్టిన యువకుడు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!