Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Mystery Incident In Anantapur District

Mystery incident: ఆటో బేరం వచ్చిందని వెళ్లాడు..నాలుగురోజుల తర్వాత?

Published Date :July 30, 2022 , 6:33 pm
By NTV WebDesk
Mystery incident: ఆటో బేరం వచ్చిందని వెళ్లాడు..నాలుగురోజుల తర్వాత?
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆటో బేరం వచ్చిందని ఒక వ్యక్తి సంతోషంగా వెళ్లాడు.. అలా వెళ్లిన వ్యక్తి ఇక తిరిగి రాలేదు.. ఒక రోజంతా చూశారు.. అయినా రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.. సరిగ్గా నాలుగు రోజులకు అదే వ్యక్తి చెరువులో శవమై కనిపించాడు. అందునా దారుణంగా హత్య చేసినట్టు ఆనవాళ్లు ఉన్నాయి. ఎక్కడో ఉండాల్సిన వ్యక్తి అసలు ఆ చెరువు వద్దకు ఎందుకొచ్చాడు.. ఆ యువకుని చావుకు చేతబడికి ఏమైనా సంబంధం ఉందా.. ఇదే ఆ హత్య కేసులో అసలైన మిస్టరీ.. ఆ యువకుని చావుకు కారణాలేంటి? అనంతలో సంచలనం కలిగించిన సంఘటన ఇది.

టెక్నాలజీ ఎంతగా పెరిగినా.. ప్రజలను ఇంకా మూఢ విశ్వాసాలు వీడటం లేదు.. ఆకాశంలోకి రాకెట్ల పంపి ప్రయోగాలు చేస్తున్నా.. ఇంకా క్షుద్ర పూజలు, చేతబడులు అంటూ జనం అంధకారంలో ఉంటున్నారు. వారు అంధకారంలో ఉండటమే కాదు.. ఆ విశ్వాసాలతో దారుణాలకు పాల్పడుతున్నారు.. అనంతపురం జిల్లాలో జరిగిన ఒక సంఘటన మనుషులు ఇంకా ఎంత అంథ విశ్వాసంలో ఉన్నారో తెలియజేస్తోంది. .. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం చెరువులో ఒక మృత దేహం కనిపించింది. బాగా కుళ్లిపోయి దుర్వాసన వస్తోంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.. స్థానికుల సాయంతో మృతదేహాన్ని బయటకు తీసే ప్రయత్నం చేశారు. మృతదేహం గుర్తు పట్టలేని పరిస్థితులో ఉంది.కానీ అప్పటికే మిస్సింగ్ కేసులో ఉన్న ఒక వ్యక్తి పొలికలకు ఇది సరిపోయింది. దీంతో ఆ వ్యక్తి బంధువులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న వారు అది చూసి ఘొల్లుమన్నారు.

Also Read

  • YSRCP Protest: డీజిల్, పెట్రోల్ కొరత.. ఆందోళనలకు వైసీపీ పిలుపు..
  • Vizianagaram Road Accident: విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు, నలుగురు మృతి
  • Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
  • Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..

ఈ మృతదేహం ఎస్కే యూనివర్శిటీ సమీపంలో ఉండే నాగేశ్వరనాయక్ అనే వ్యక్తిదిగా గుర్తించారు. ఎక్కడో ఆకుతోటపల్లిలో ఉండాల్సిన వ్యక్తి ఇంతదూరం ఎలా వచ్చాడని ఆరా తీస్తే దాని వెనుక చాలా దారుణమైన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. చనిపోయిన నాగేశ్వర నాయక్ స్వగ్రామం కదిరి మండలం ఏటిగడ్డపల్లి తండా. అయితే ఏడాది క్రితం ఆకుతోటపల్లికి వచ్చి.. నివాసముంటున్నాడు. ఏడునెలల కిందట నాగేశ్వర్‌ నాయక్ కు ప్రియాంకతో వివాహమైంది. అతను ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అతని తల్లిదండ్రులు బాలమ్మ, నారాయణస్వామినాయక్ స్వగ్రామంలోనే ఉన్నారు. అయితే ఈనెల 25న ఆటో బాడుగ ఉందని.. ధర్మవరం వెళ్లాలని భార్యకు చెప్పి వెళ్లాడు.. అంతే అలా వెళ్లిన వ్యక్తి ఇక తిరిగి రాలేదు. ఇలా శవమై కనిపించాడు. తన కుమారుడిని ఏటిగడ్డ తండాకు చెందిన కృష్ణానాయక్ చంపించాడని తండ్రి నారాయణస్వామి నాయక్ ఆరోపించాడు. పోలీసులు దీనిపై ఫిర్యాదు అందుకుని దర్యాప్తు మొదలు పెట్టారు.

అసలు నాగేశ్వరనాయక్ ను ఎవరు చంపారు.. ఎందుకు చంపారంటే..? దీని వెనక ఇంకో దారుణమయిన కథ ఉంది. కదిరి మండలం ఏటిగడ్డ తండాకు చెందిన కిరణ్ అనే 15 ఏళ్ల బాలుడు ఏడాది క్రితం మృతిచెందాడు. ప్రస్తుతం హత్యకు గురైన నాగేశ్వర నాయక్ తల్లి బాలమ్మ అనే మహిళ చేతబడి చేయడం వల్లే తన కుమారుడు కిరణ్ మృతి చెందాడని గొడవలు జరిగాయి. గ్రామంలో పంచాయితీ నిర్వహించారు. చేతబడి ఆరోపణ రావడంతో బాలమ్మ, ఆమె భర్త నారాయణస్వామినాయక్, కుమారుడు నాగేశ్వర్ నాయక్ ఊరు నుంచి వెళ్లిపోయారు. ఆకుతోటపల్లిలో నివాసం ఉంటున్నారు.

ఎన్ని రోజులు ఇలా ఊరు కాని ఊర్లో ఉంటామని పెద్ద మనుషుల జోక్యంతో బాలమ్మ, ఆమె భర్త నారాయణస్వామినాయక్ స్వగ్రామానికి వెళ్లి అక్కడే నివాసం ఉంటున్నారు. తన కుమారుడు కిరణ్ మృతికి చేతబడే కారణమనే అనుమానం పెంచుకున్న కృష్ణానాయక్ బాలమ్మ కుమారుడు నాగేశ్వర్ నాయక్ ను చంపాలని పథకం వేశాడు. ఈ నెల 25న ధర్మవరంలో ఆటో బాడుగ ఉందని నాగేశ్వర్‌ నాయక్‌కు చెప్పి అనంతపురం నుంచి ధర్మవరం తీసుకొచ్చాడు. పట్టణ సమీపంలోని చెరువుకట్ట మూడో మరువ వద్దకు చేరుకున్నాడు. అప్పటికే అక్కడ ఉన్న కృష్ణానాయక్ ఆయన స్నేహితులు కలిసి హత్య చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరో వైపు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. చేతబడి చేసి తన కుమారున్ని చంపారన్న కారణంతో.. ఈ యువకున్ని హత్య చేశారు. పెళ్లై ఏడు నెలల కూడా గడవక ముందే ప్రియాంక పరిస్థితి ఇలా అయింది. అసలు ఈ కాలంలో కూడా చేతబడులు సాధ్యమా? ఇలాంటి దురాచారాలతో మరో వ్యక్తిని బలితీసుకోవడం ఏంటి?

Drugs Burnt: ఒకేసారి 30 వేల కిలోల డ్రగ్స్‌ను తగలెట్టేశారు.. అంతా అమిత్ షా సమక్షంలోనే..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Auto Driver
  • black magic
  • Brutal incident
  • Police Enquiry
  • supersitious practice

తాజావార్తలు

  • Mohini: దర్శకుడి బలవంతం.. భర్తే చేతబడి చేయించాడు ‘ఆదిత్య 369’ నటి మోహిని కన్నీటి గాథ!

  • Moringa Chutney Recipe: క్షణాల్లో కారం కారంగా మునగ చట్నీ తయారు చేయండి.. రుచితో పాటు పుష్కలమైన విటమిన్లు మీ సొంతం!

  • Raghav Chadha vs AAP: ఎంపీని చేయకపోతే పెళ్లి అయ్యేదా? రాఘవ్ చద్దాపై ఆప్ ధ్వజం

  • Rava Paratha Recipe: రెగ్యులర్ బ్రేక్‌ఫాస్ట్ బోర్ కొట్టిందా..? 10 నిమిషాల్లో మెత్తటి రవ్వ పరాఠాలు ఇలా తయారు చేయండి

  • KING 100 : దాదాపు 20 ఏళ్ల తర్వాత నాగ్ సరసన టబు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి

ట్రెండింగ్‌

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions