MVV Satyanarayana: బిల్డర్లు నన్ను రోల్ మోడల్గా భావిస్తోంటే.. మీడియా వక్రీకరిస్తోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MVV Satyanarayana Again Gives Full Clarity On Kidnap Case: తన ఫ్యామిలీ కిడ్నాప్ ఘటనపై.. అలాగే రాజకీయ విమర్శలపై పూర్తి స్పష్టత ఇచ్చేందుకు ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మరోసారి మీడియా ముందుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫ్యామిలీ కిడ్నాప్ పక్కా పథకం ప్రకారం జరిగిందని తెలిపారు. డబ్బుల కోసం నగరంలోని కొందరు ప్రముఖులకు సైతం కిడ్నాపర్లు ఫోన్ చేయించారని అన్నారు. రౌడీషీటర్ హేమంత్ పకడ్బందీగా వ్యవహరించడం వల్లే.. కిడ్నాప్పై ఎలాంటి అనుమానం రాలేదన్నారు. తన కుటుంబాన్ని, ఆడిటర్ జీవిని 24గంటలకు పైగా నిర్బంధించి.. వారికి చావును పరిచయం చేసిన రౌడీషీటర్ హేమంత్ గురించి మాట్లాడకుండా, ఇతర కారణాలపై చర్చలు చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కిడ్నాప్ వెనుక రాజకీయ కారణాలు, రియల్ ఎస్టేట్ లావాదేవీలు ఏమీ లేవని స్పష్టతనిచ్చారు.
Pragya Jaiswal Hot Pics: ప్రగ్యా జైస్వాల్ పరువాల విందు.. యోగా చేస్తూ హాట్ స్టిల్స్!
Also Read
- Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
- OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్... మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
- YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
- OTR : ఉమ్మడి శ్రీకాకుళం రాజాం రాజకీయాల్లో హాట్ టర్న్! వైసీపీ పరిస్థితి ఏంటి?
ఐదేళ్ల తన ఫోన్ రికార్డ్స్ పరిశీలిస్తే.. హేమంత్తో తానెప్పుడూ మాట్లాడలేదనేది నిర్ధారణ అవుతుందని ఎంవీవీ చెప్పారు. నేరాలు అనేవి ఏ ప్రభుత్వంలోనైనా జరుగుతాయని.. అందరూ చెబుతున్నట్టుగా విశాఖలో నేరాలు, ఘోరాలు ఏమీ జరగడం లేదని అన్నారు. తనకు వైజాగ్ వదిలి వెళ్లిపోవాలనే ఆలోచనలు రావడానికి కారణం.. మీడియానేనని ఆరోపించారు. వందల అపార్ట్మెంట్లు కట్టినప్పుడు తనపై ఎలాంటి ఆరోపణలు లేవని.. కానీ ఎంపీ అయినప్పటి నుంచి తనని ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. తప్పుడు ప్రచారాలతో మనస్తాపానికి గురయ్యే.. వైజాగ్ వీడి పోవాలని భావించానన్నారు. బిల్డర్లు తనని ఒక రోల్ మోడల్గా భావిస్తోంటే.. మీడియా మాత్రం వక్రీకరిస్తోందని ఆరోపించారు. అధికార పార్టీ ఎంపీగా తన పనులు తాను చక్కబెట్టుకోగలననని.. ఎవరికో భయపడి పారిపోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. రఘు రామకృష్ణ రాజు ఓ గజ్జికుక్క అని విమర్శించారు.
Manipur: విశ్వాసం కోల్పోయామంటూ .. ప్రధాని మోదీకి మణిపూర్ బీజేపీ ఎమ్మెల్యేల లేఖ
కిడ్నాప్ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని.. సీబీఐ విచారణకు ఆదేశిస్తే తాను సహకరిస్తా ఎంవీవీ డిమాండ్ చేశారు. 12వ తేదీ నుంచి కిడ్నాపర్లు పట్టుబడ్డ వరకు జరిగిన ఎపిసోడ్ మీద సమగ్ర విచారణ జరిపించాలని అడిగారు. ఎంపీకే రక్షణ లేదనే అంశాన్ని చంద్రబాబు, ఇతర నాయకులు రాజకీయం చేయడం తగదన్నారు. పవన్ కళ్యాణ్ బాగా మాట్లాడారు.. నాకు అధికారం ఉంటే ఎన్కౌంటర్ చేసేవాడిని అన్నారని గుర్తు చేశారు. ఇదిలావుండగా.. ఎంవీవీ సత్యనారాయణ కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన ముఠాలో మరో 5 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ప్రధాన నిందితుడు హేమంత్తో పాటు రాజేష్ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో ఐదుమందిని అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
-
JioHotstar Trending: 12,000 కోట్ల బ్లాక్ బస్టర్కే షాక్.. జియో హాట్స్టార్లో ఈ రొమాంటిక్ థ్రిల్లర్ దే హవా!
-
iPhone 16: ఫ్లిప్కార్ట్ GOAT Sale కంటే ముందే iPhone 16పై భారీ తగ్గింపు..!
-
NBK 112 : బాలయ్య -కొరటాల మాస్ సినిమా కాదు.. అంతకుమించి
-
Hyderabad: షా గౌస్, మెహ్ఫిల్లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
-
Lenin movie trailer : లెనిన్ ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్.. అయ్యగారు ఆన్ ట్రాక్
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!