MVV Satyanarayana: బిల్డర్లు నన్ను రోల్ మోడల్గా భావిస్తోంటే.. మీడియా వక్రీకరిస్తోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MVV Satyanarayana Again Gives Full Clarity On Kidnap Case: తన ఫ్యామిలీ కిడ్నాప్ ఘటనపై.. అలాగే రాజకీయ విమర్శలపై పూర్తి స్పష్టత ఇచ్చేందుకు ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మరోసారి మీడియా ముందుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫ్యామిలీ కిడ్నాప్ పక్కా పథకం ప్రకారం జరిగిందని తెలిపారు. డబ్బుల కోసం నగరంలోని కొందరు ప్రముఖులకు సైతం కిడ్నాపర్లు ఫోన్ చేయించారని అన్నారు. రౌడీషీటర్ హేమంత్ పకడ్బందీగా వ్యవహరించడం వల్లే.. కిడ్నాప్పై ఎలాంటి అనుమానం రాలేదన్నారు. తన కుటుంబాన్ని, ఆడిటర్ జీవిని 24గంటలకు పైగా నిర్బంధించి.. వారికి చావును పరిచయం చేసిన రౌడీషీటర్ హేమంత్ గురించి మాట్లాడకుండా, ఇతర కారణాలపై చర్చలు చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కిడ్నాప్ వెనుక రాజకీయ కారణాలు, రియల్ ఎస్టేట్ లావాదేవీలు ఏమీ లేవని స్పష్టతనిచ్చారు.
Pragya Jaiswal Hot Pics: ప్రగ్యా జైస్వాల్ పరువాల విందు.. యోగా చేస్తూ హాట్ స్టిల్స్!
Also Read
- Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
- Crime: కాపాడాల్సిన బాబాయే కీచకుడయ్యాడు.. ప్రైవేట్ ఫోటోలతో బెదిరించి బాలికపై దారుణం..
- Pawan Kalyan : రాష్ట్రం కోసమే రాజీ పడ్డాను.. పొత్తులో మీ ఆత్మగౌరవం దెబ్బతింటే ఊరుకోను
- Polavaram: పోలవరం నిర్వాసితులకు రూ. 307 కోట్ల పరిహారం.. 2027 నాటికి ప్రాజెక్ట్ పూర్తి: మంత్రి నిమ్మల రామానాయుడు
ఐదేళ్ల తన ఫోన్ రికార్డ్స్ పరిశీలిస్తే.. హేమంత్తో తానెప్పుడూ మాట్లాడలేదనేది నిర్ధారణ అవుతుందని ఎంవీవీ చెప్పారు. నేరాలు అనేవి ఏ ప్రభుత్వంలోనైనా జరుగుతాయని.. అందరూ చెబుతున్నట్టుగా విశాఖలో నేరాలు, ఘోరాలు ఏమీ జరగడం లేదని అన్నారు. తనకు వైజాగ్ వదిలి వెళ్లిపోవాలనే ఆలోచనలు రావడానికి కారణం.. మీడియానేనని ఆరోపించారు. వందల అపార్ట్మెంట్లు కట్టినప్పుడు తనపై ఎలాంటి ఆరోపణలు లేవని.. కానీ ఎంపీ అయినప్పటి నుంచి తనని ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. తప్పుడు ప్రచారాలతో మనస్తాపానికి గురయ్యే.. వైజాగ్ వీడి పోవాలని భావించానన్నారు. బిల్డర్లు తనని ఒక రోల్ మోడల్గా భావిస్తోంటే.. మీడియా మాత్రం వక్రీకరిస్తోందని ఆరోపించారు. అధికార పార్టీ ఎంపీగా తన పనులు తాను చక్కబెట్టుకోగలననని.. ఎవరికో భయపడి పారిపోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. రఘు రామకృష్ణ రాజు ఓ గజ్జికుక్క అని విమర్శించారు.
Manipur: విశ్వాసం కోల్పోయామంటూ .. ప్రధాని మోదీకి మణిపూర్ బీజేపీ ఎమ్మెల్యేల లేఖ
కిడ్నాప్ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని.. సీబీఐ విచారణకు ఆదేశిస్తే తాను సహకరిస్తా ఎంవీవీ డిమాండ్ చేశారు. 12వ తేదీ నుంచి కిడ్నాపర్లు పట్టుబడ్డ వరకు జరిగిన ఎపిసోడ్ మీద సమగ్ర విచారణ జరిపించాలని అడిగారు. ఎంపీకే రక్షణ లేదనే అంశాన్ని చంద్రబాబు, ఇతర నాయకులు రాజకీయం చేయడం తగదన్నారు. పవన్ కళ్యాణ్ బాగా మాట్లాడారు.. నాకు అధికారం ఉంటే ఎన్కౌంటర్ చేసేవాడిని అన్నారని గుర్తు చేశారు. ఇదిలావుండగా.. ఎంవీవీ సత్యనారాయణ కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన ముఠాలో మరో 5 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ప్రధాన నిందితుడు హేమంత్తో పాటు రాజేష్ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో ఐదుమందిని అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..