Mudragada Padmanabham:కోనసీమ పెద్దలకు ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోనసీమ పెద్దలకు మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. గత కొంతకాలంగా ఆయన మౌనంగా వున్నారు. తాజాగా ఆయన నోరువిప్పడం, బహిరంగ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. మీ ప్రాంతంలో జరుగుతున్న సంఘటనలు చూసి బాధపడుతున్నాను. భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ ను యావత్తు ప్రపంచమే కొనియాడుతుంది.
అటువంటి మహా వ్యక్తి పేరు కోనసీమకు పెట్టినందుకు అలజడులు సృష్టించడంలో న్యాయం లేదు. అంబేద్కర్ పేరు మన ప్రాంతానికి పెట్టినందుకు గర్వంగా ఫీల్ అవ్వాలి. అంబేద్కర్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంబేద్కర్ పేరు పెట్టిన దానికి అభ్యంతరం పెట్టడం న్యాయమా? అని ముద్రగడ తన లేఖలో పేర్కొన్నారు.
Also Read
- నేడే ఏపీ Cabinet Meeting.. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్సిగ్నల్.. పొదుపు చర్యలపై కీలక చర్చ!
- CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
- CM Chandrababu Naidu: వర్క్ ఫ్రం హోంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి

నేనేమీ పెద్ద మేధావిని కాను, పెద్దగా చదువుకోలేదండి. కానీ ఈ మధ్య మీ ప్రాంతంలో జరుగుతున్న సంఘటనలు స్నేహితులు, మీడియా ద్వారా తెలుసుకుని చాలా బాధపడుతున్నాను. మనమందరం సోదరభావంతో మెలగవలసిన సమయంలో కులాలు,మతాలు కుంపట్లలో మగ్గిపోతున్నామని ఈ లేఖ రాయాలనిపించి రాశాను.. మీ మనోభావాలకు ఇబ్బందిగా వుంటే పెద్ద మనసు పెట్టి క్షమించండి. గతంలో అయితే చాలా విషయాలలో పట్టింపులు, మూఢనమ్మకాలతో తగాదాలు పడేవారు. సమాజంలో అప్పటికీ ఇప్పటికే చాలా మార్పులు వచ్చాయి.
మరలా వెనుకటి రోజులకు వెళుతున్నామో అన్నది ఆలోచించండి. మహావ్యక్తి పేరును కోనసీమకు పెడితే అలజడులు తేవడం న్యాయంగా లేదండి, వీరు పేరు రాష్ట్రంలో ఎక్కడ పెట్టినా ఎవరూ కాదనలేని పరిస్థితి అని నాభావన. న్యాయతా అయితే జీఎంసీ బాలయోగి గారి పేరు పెట్టాలి. లోక్ సభ స్పీకర్ అయిన తరువాతనే మీ ప్రాంతం అభివృద్ధి చెందింది.ఏదో ఒక కారణంతో బాలయోగి గారిపేరును పరిగణనలోనికి తీసుకోలేదు. దయచేసి గౌరవ పెద్దలకు చేతులెత్తి నమస్కరిస్తూ మరొక సారి కోరతా వున్నాను. గౌరవమంత్రి పినిపె విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్, కుడుపూడి సూర్యనారాయణరావు, కల్వకొలను తాతాజీ ఈ సమస్యకు ముగింపు పలకడానికి ఆలోచన చేయమని కోరుతున్నానండి. నేను ఏ స్వార్థంతోను ఈ లేఖ మీకు రాయలేదండి. మీరందరూ సంతోషంగా వుండాలని నా కోరికండి.. అంటూ లేఖ రాశారు ముద్రగడ.
Stampede at Khatu Shyam Temple: గుడిలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి
తాజావార్తలు
-
Vivo Y60 5G: 6500mAh బ్యాటరీతో వివో Y60 5G విడుదల.. ధర, ఫీచర్స్ తెలుసుకోండి
-
Delhi Gang R*ape: కదులుతున్న బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. కండక్టర్, డ్రైవర్ అరెస్ట్.!
-
Hombale Films : ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి హోంబలే ఫిల్మ్స్
-
Mamata Banerjee: కోర్టుకు న్యాయవాది దుస్తులలో హాజరైన బెంగాల్ మాజీ సీఎం.!
-
Virat Kohli Record: రోహిత్ శర్మ రికార్డు సమం చేసిన ‘కింగ్’ కోహ్లీ.. ఐపీఎల్ చరిత్రలో టాప్లో ఇద్దరు దిగ్గజాలు!
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!