Mudragada Padmanabham:కోనసీమ పెద్దలకు ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోనసీమ పెద్దలకు మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. గత కొంతకాలంగా ఆయన మౌనంగా వున్నారు. తాజాగా ఆయన నోరువిప్పడం, బహిరంగ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. మీ ప్రాంతంలో జరుగుతున్న సంఘటనలు చూసి బాధపడుతున్నాను. భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ ను యావత్తు ప్రపంచమే కొనియాడుతుంది.
అటువంటి మహా వ్యక్తి పేరు కోనసీమకు పెట్టినందుకు అలజడులు సృష్టించడంలో న్యాయం లేదు. అంబేద్కర్ పేరు మన ప్రాంతానికి పెట్టినందుకు గర్వంగా ఫీల్ అవ్వాలి. అంబేద్కర్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంబేద్కర్ పేరు పెట్టిన దానికి అభ్యంతరం పెట్టడం న్యాయమా? అని ముద్రగడ తన లేఖలో పేర్కొన్నారు.
Also Read
- OTR: టీడీపీ - జనసేన ఇంచార్జ్ల మధ్య పెరుగుతున్న గ్యాప్..?
- Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
- Minister BC Janardhan Reddy: రూ.8,530 కోట్లతో రహదారుల అభివృద్ధి.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు

నేనేమీ పెద్ద మేధావిని కాను, పెద్దగా చదువుకోలేదండి. కానీ ఈ మధ్య మీ ప్రాంతంలో జరుగుతున్న సంఘటనలు స్నేహితులు, మీడియా ద్వారా తెలుసుకుని చాలా బాధపడుతున్నాను. మనమందరం సోదరభావంతో మెలగవలసిన సమయంలో కులాలు,మతాలు కుంపట్లలో మగ్గిపోతున్నామని ఈ లేఖ రాయాలనిపించి రాశాను.. మీ మనోభావాలకు ఇబ్బందిగా వుంటే పెద్ద మనసు పెట్టి క్షమించండి. గతంలో అయితే చాలా విషయాలలో పట్టింపులు, మూఢనమ్మకాలతో తగాదాలు పడేవారు. సమాజంలో అప్పటికీ ఇప్పటికే చాలా మార్పులు వచ్చాయి.
మరలా వెనుకటి రోజులకు వెళుతున్నామో అన్నది ఆలోచించండి. మహావ్యక్తి పేరును కోనసీమకు పెడితే అలజడులు తేవడం న్యాయంగా లేదండి, వీరు పేరు రాష్ట్రంలో ఎక్కడ పెట్టినా ఎవరూ కాదనలేని పరిస్థితి అని నాభావన. న్యాయతా అయితే జీఎంసీ బాలయోగి గారి పేరు పెట్టాలి. లోక్ సభ స్పీకర్ అయిన తరువాతనే మీ ప్రాంతం అభివృద్ధి చెందింది.ఏదో ఒక కారణంతో బాలయోగి గారిపేరును పరిగణనలోనికి తీసుకోలేదు. దయచేసి గౌరవ పెద్దలకు చేతులెత్తి నమస్కరిస్తూ మరొక సారి కోరతా వున్నాను. గౌరవమంత్రి పినిపె విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్, కుడుపూడి సూర్యనారాయణరావు, కల్వకొలను తాతాజీ ఈ సమస్యకు ముగింపు పలకడానికి ఆలోచన చేయమని కోరుతున్నానండి. నేను ఏ స్వార్థంతోను ఈ లేఖ మీకు రాయలేదండి. మీరందరూ సంతోషంగా వుండాలని నా కోరికండి.. అంటూ లేఖ రాశారు ముద్రగడ.
Stampede at Khatu Shyam Temple: గుడిలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!