Mudragada Padmanabham:కోనసీమ పెద్దలకు ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోనసీమ పెద్దలకు మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. గత కొంతకాలంగా ఆయన మౌనంగా వున్నారు. తాజాగా ఆయన నోరువిప్పడం, బహిరంగ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. మీ ప్రాంతంలో జరుగుతున్న సంఘటనలు చూసి బాధపడుతున్నాను. భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ ను యావత్తు ప్రపంచమే కొనియాడుతుంది.
అటువంటి మహా వ్యక్తి పేరు కోనసీమకు పెట్టినందుకు అలజడులు సృష్టించడంలో న్యాయం లేదు. అంబేద్కర్ పేరు మన ప్రాంతానికి పెట్టినందుకు గర్వంగా ఫీల్ అవ్వాలి. అంబేద్కర్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంబేద్కర్ పేరు పెట్టిన దానికి అభ్యంతరం పెట్టడం న్యాయమా? అని ముద్రగడ తన లేఖలో పేర్కొన్నారు.
Also Read
- Monsoon Update: నైరుతి రుతుపవనాల తిరోగమనం.. ఏపీలో వర్షాలపై ఐఎండీ కీలక ప్రకటన..
- Ganesh Chaturthi: మనవడితో కలిసి ప్రత్యేక పూజలు.. వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు..
- Sangameswara Temple: 5 వారాల్లోనే మారిన సీన్.. శ్రీశైలం డ్యామ్లో తగ్గుతున్న నీరు.. దర్శనమిస్తున్న సంగమేశ్వర ఆలయ శిఖరం..
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి

నేనేమీ పెద్ద మేధావిని కాను, పెద్దగా చదువుకోలేదండి. కానీ ఈ మధ్య మీ ప్రాంతంలో జరుగుతున్న సంఘటనలు స్నేహితులు, మీడియా ద్వారా తెలుసుకుని చాలా బాధపడుతున్నాను. మనమందరం సోదరభావంతో మెలగవలసిన సమయంలో కులాలు,మతాలు కుంపట్లలో మగ్గిపోతున్నామని ఈ లేఖ రాయాలనిపించి రాశాను.. మీ మనోభావాలకు ఇబ్బందిగా వుంటే పెద్ద మనసు పెట్టి క్షమించండి. గతంలో అయితే చాలా విషయాలలో పట్టింపులు, మూఢనమ్మకాలతో తగాదాలు పడేవారు. సమాజంలో అప్పటికీ ఇప్పటికే చాలా మార్పులు వచ్చాయి.
మరలా వెనుకటి రోజులకు వెళుతున్నామో అన్నది ఆలోచించండి. మహావ్యక్తి పేరును కోనసీమకు పెడితే అలజడులు తేవడం న్యాయంగా లేదండి, వీరు పేరు రాష్ట్రంలో ఎక్కడ పెట్టినా ఎవరూ కాదనలేని పరిస్థితి అని నాభావన. న్యాయతా అయితే జీఎంసీ బాలయోగి గారి పేరు పెట్టాలి. లోక్ సభ స్పీకర్ అయిన తరువాతనే మీ ప్రాంతం అభివృద్ధి చెందింది.ఏదో ఒక కారణంతో బాలయోగి గారిపేరును పరిగణనలోనికి తీసుకోలేదు. దయచేసి గౌరవ పెద్దలకు చేతులెత్తి నమస్కరిస్తూ మరొక సారి కోరతా వున్నాను. గౌరవమంత్రి పినిపె విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్, కుడుపూడి సూర్యనారాయణరావు, కల్వకొలను తాతాజీ ఈ సమస్యకు ముగింపు పలకడానికి ఆలోచన చేయమని కోరుతున్నానండి. నేను ఏ స్వార్థంతోను ఈ లేఖ మీకు రాయలేదండి. మీరందరూ సంతోషంగా వుండాలని నా కోరికండి.. అంటూ లేఖ రాశారు ముద్రగడ.
Stampede at Khatu Shyam Temple: గుడిలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి
తాజావార్తలు
-
Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
-
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
-
South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
-
Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
-
Rajasthan: రాజస్థాన్ ఎన్నికల్లో విచిత్రం.. బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు, తన ఓటు కూడా పడలేదు!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!