Mudragada Padmanabham:కోనసీమ పెద్దలకు ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోనసీమ పెద్దలకు మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. గత కొంతకాలంగా ఆయన మౌనంగా వున్నారు. తాజాగా ఆయన నోరువిప్పడం, బహిరంగ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. మీ ప్రాంతంలో జరుగుతున్న సంఘటనలు చూసి బాధపడుతున్నాను. భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ ను యావత్తు ప్రపంచమే కొనియాడుతుంది.
అటువంటి మహా వ్యక్తి పేరు కోనసీమకు పెట్టినందుకు అలజడులు సృష్టించడంలో న్యాయం లేదు. అంబేద్కర్ పేరు మన ప్రాంతానికి పెట్టినందుకు గర్వంగా ఫీల్ అవ్వాలి. అంబేద్కర్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంబేద్కర్ పేరు పెట్టిన దానికి అభ్యంతరం పెట్టడం న్యాయమా? అని ముద్రగడ తన లేఖలో పేర్కొన్నారు.
Also Read
- CM Chandrababu : అమరావతి దేవతల రాజధాని.. నవ్యాంధ్రను నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
- RAW NTR: 'ఊరు–వాడ' కార్యక్రమంపై 'రా ఎన్టీఆర్' కీలక ప్రకటన.. ఆరోపణలకు కౌంటర్..

నేనేమీ పెద్ద మేధావిని కాను, పెద్దగా చదువుకోలేదండి. కానీ ఈ మధ్య మీ ప్రాంతంలో జరుగుతున్న సంఘటనలు స్నేహితులు, మీడియా ద్వారా తెలుసుకుని చాలా బాధపడుతున్నాను. మనమందరం సోదరభావంతో మెలగవలసిన సమయంలో కులాలు,మతాలు కుంపట్లలో మగ్గిపోతున్నామని ఈ లేఖ రాయాలనిపించి రాశాను.. మీ మనోభావాలకు ఇబ్బందిగా వుంటే పెద్ద మనసు పెట్టి క్షమించండి. గతంలో అయితే చాలా విషయాలలో పట్టింపులు, మూఢనమ్మకాలతో తగాదాలు పడేవారు. సమాజంలో అప్పటికీ ఇప్పటికే చాలా మార్పులు వచ్చాయి.
మరలా వెనుకటి రోజులకు వెళుతున్నామో అన్నది ఆలోచించండి. మహావ్యక్తి పేరును కోనసీమకు పెడితే అలజడులు తేవడం న్యాయంగా లేదండి, వీరు పేరు రాష్ట్రంలో ఎక్కడ పెట్టినా ఎవరూ కాదనలేని పరిస్థితి అని నాభావన. న్యాయతా అయితే జీఎంసీ బాలయోగి గారి పేరు పెట్టాలి. లోక్ సభ స్పీకర్ అయిన తరువాతనే మీ ప్రాంతం అభివృద్ధి చెందింది.ఏదో ఒక కారణంతో బాలయోగి గారిపేరును పరిగణనలోనికి తీసుకోలేదు. దయచేసి గౌరవ పెద్దలకు చేతులెత్తి నమస్కరిస్తూ మరొక సారి కోరతా వున్నాను. గౌరవమంత్రి పినిపె విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్, కుడుపూడి సూర్యనారాయణరావు, కల్వకొలను తాతాజీ ఈ సమస్యకు ముగింపు పలకడానికి ఆలోచన చేయమని కోరుతున్నానండి. నేను ఏ స్వార్థంతోను ఈ లేఖ మీకు రాయలేదండి. మీరందరూ సంతోషంగా వుండాలని నా కోరికండి.. అంటూ లేఖ రాశారు ముద్రగడ.
Stampede at Khatu Shyam Temple: గుడిలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి
తాజావార్తలు
-
Anna Hazare: ‘‘సహనాన్ని పరీక్షించొద్దు’’.. సోనమ్ వాంగ్చుక్కు అన్నాహజారే మద్దతు..
-
72nd National Film Awards: ఉత్తమ నటుడు కిరీటం వీళ్లిద్దరికీ.. జాతీయ ఉత్తమ నటిగా!
-
Abhishek Banerjee: “తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా”.. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
-
Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
-
ENG Vs IND 3rd ODI: మెన్ ఇన్ బ్లూ టార్గెట్ లార్డ్స్.. 22 ఏళ్ల నిరీక్షణకు తెరదించే సమయం వచ్చేసింది..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!