కేంద్ర ప్రభుత్వం వ్యవసాయరంగంలో పరిశోధనకు బడ్జెట్లో కేటాయింపులను ఎందుకు పెంచడం లేదని వైసీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజ్యసభలో శుక్రవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా వ్యవసాయ మంత్రిని అనుబంధ ప్రశ్న వేస్తూ 2021-22లో సవరించిన బడ్జెట్ అంచనాల ప్రకారం వ్యవసాయ పరిశోధనకు 8,514 కోట్ల కేటాయింపులు జరిగాయి. 2022-23 బడ్జెట్లో సైతం అంతే మొత్తం కేటాయించారు.
వ్యవసాయ పరిశోధనకు ఒక్క రూపాయి కూడా అదనంగా కేటాయించలేదు. ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ మార్పుల వలన సంభవిస్తున్న అకాల వర్షాల వంటి సమస్యలతో ఏటా పంటలు నష్టపోతూ రైతాంగం కష్టాలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని నిలబడే వంగడాలను అభివృద్ధి చేసేందుకు వ్యవసాయ పరిశోధనపై భారీగా ఖర్చు చేయవలసిన అవసరం ఉంది. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతోందో వివరించాలని ఆయన ప్రశ్నించారు.
Ayodhya Ram Temple: అయోధ్య రామ మందిర ప్రారంభం అప్పుడే.. 40 శాతం పూర్తయిన పనులు
దీనికి వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరి జవాబిస్తూ వ్యవసాయ పరిశోధనను ప్రభుత్వం ఎట్టి పరిస్థితులలోను విస్మరించబోదని చెప్పారు. పరిశోధనకు మరిన్ని నిధులు కావాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చి (ఐసీఏఆర్) కోరితే ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. దేశంలో వ్యవసాయోత్పత్తుల పెరుగుదలతోపాటు వ్యవసాయ రంగానికి విద్యుత్ అవసరాలు కూడా పెరుగుతున్నాయి.
ఉత్పాదక పెంచడానికి వ్యవసాయ పరిశోధన కేంద్రాలు ఆవిష్కరిస్తున్న నవీన సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు ఆచరణలోకి తీసుకువస్తున్నారు. గత కొన్నేళ్ళలో వ్యవసాయ పరిశోధన ద్వారా 1957 కొత్త వంగడాలు, వాతావరణ మార్పులను తట్టుకోగల 286 కొత్త వంగడాలను వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారని మంత్రి వెల్లడించారు.
Freight Corridor: డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్పై సర్వే