Milk Adulteration: విజయవాడలోని పాల బూత్ ల్లో ఫుడ్ సేఫ్టీ, పశు సంవర్ధక అధికారుల తనిఖీలు చేపట్టారు. శాంపిల్స్ సేకరించారు. ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ, పశుసంవర్ధక శాఖ అధికారులు మాట్లాడుతూ.. విజయవాడలోని ఆరు పాల బూత్ లపై తనిఖీలు చేశాం.. ఆరు పాల బూత్ ల నుండి పాల శాంపిల్స్ సేకరించాము.. లేబొరేటరీ నుంచి మూడు రోజుల్లో రిజల్ట్స్ వస్తాయి.. పాలు కల్తీ చేసినట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్లాస్టిక్ కానీ, అల్యూమినియం డబ్బాలలో కానీ పాలను నిల్వ చేయవద్దు.. కేవలం స్టెయిన్లెస్ స్టీల్ క్యాన్లలో మాత్రమే పాలను నిల్వ చేయాలని సూచించారు.
Read Also: IND vs ZIM Super 8: సమయం ఆసన్నమైంది సంజూ.. ఇక టీమిండియాకు నువ్వే దిక్కు!
అయితే, ఫుడ్ సేఫ్టీ కమిషనర్, కలెక్టర్ ఆదేశాలతో దాడులు నిర్వహిస్తున్నామని అధికారులు వెల్లడించారు. నిరంతరం దాడులు చేస్తాం.. సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం పాలలో కల్తీ చేస్తే మరణశిక్ష కూడా విధించే అవకాశం ఉందని హెచ్చరించారు. పాల కల్తీ మామూలు నేరం కాదు, మర్డర్ చేసిన నిరం కంటే పెద్ద నేరంగా పరిగణించబడుతుంది అన్నారు. కృష్ణలంక సెంటర్, వన్ టైమ్స్, పంట కాలవ రోడ్డు, కరెన్సీ నగర్, ప్రసాదం పాడు ప్రాంతాలలో లూజ్ మిల్క్ అమ్మే వారిపై దాడులు నిర్వహించామన్నారు.
Read Also: Gold and Silver Prices: ఒకే రోజు రూ. 15 వేలు తగ్గిన ధర.. బంగారం, వెండి ధరలు ఇవే!
ఇక, పాలు చాలా చిక్కగా ఉండటానికి పిండి పదార్థాలు కలుపుతున్నారని ఫుడ్ సేఫ్టీ అధికారులుతెలిపారు. పిండి పదార్థాలు కలిపారని అనుమానం వస్తే పాలలో అయోడిన్ వేస్తే పాలు మొత్తం కూడా నీలి రంగులోకి మారుతాయని పేర్కొన్నారు. పాలు చేతుల మధ్య నలిపితే ఉంటే పిండి బయటపడే అవకాశం ఉంటుంది.. పాలు చిక్కదనం, వెన్నేశాతం అధికంగా చూపించడం కోసం వెజిటేబుల్ ఆయిల్స్ కూడా కలుపుతారు.. వెజిటేబుల్స్ ఆయిల్ కలిపితే పాలు చాలా జిడ్డుగా ఉండే అవకాశం ఉంది.. పాలు టెస్ట్ చేసినప్పుడు ఏదైనా చేదుగా అనిపిస్తే ఖచ్చితంగా దాంట్లో పిండి పదార్థులు కలిసి ఉన్నట్లుగా భావించాలని వెల్లడించారు.