MP Mithun Reddy: మిథున్ రెడ్డి అరెస్ట్పై సిట్ గ్రౌండ్ ఆఫ్ అరెస్ట్లో షాకింగ్ అంశాలు
- లిక్కర్ కుంభకోణంలో మిథున్ రెడ్డి పాత్రపై సిట్ వద్ద కీలక ఆధారాలు..
- మిథున్ రెడ్డి అరెస్ట్పై సిట్ గ్రౌండ్ ఆఫ్ అరెస్ట్లో షాకింగ్ అంశాలు వెల్లడి..
- స్కాంలో వచ్చిన డబ్బును ఎక్కడకు మళ్లించారనేది మిథున్ రెడ్డికి తెలుసు: సిట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ పై సిట్ గ్రౌండ్ ఆఫ్ అరెస్ట్ కీలక అంశాలు పేర్కొంది. స్కాంలో మిథున్ రెడ్డి నేరం చేసినట్టు ప్రాథమికంగా గుర్తించాం.. కుంభకోణం మొదలు నుంచి అమలు వరకు మిథున్ రెడ్డి ప్రధాన కుట్రదారుగా ఉన్నారు.. కేసులో ఏ3గా ఉన్న ప్రభుత్వ ఉద్యోగి సత్య ప్రసాద్ కు నాన్ కేడర్ ఐఏఎస్ పదోన్నతి కల్పిస్తానని హామీ ఇచ్చి కుట్ర అమలు చేయించారు అని సిట్ తెలిపింది. స్కాం అమలు కోసమే సత్య ప్రసాద్ ను ప్రత్యేక అధికారిగా నియమించారు.. కేసులో ఏ2 వాసుదేవ రెడ్డి, ఏ3 సత్య ప్రసాద్ లను నేరుగా మిథున్ రెడ్డి ప్రభావితం చేశారు.. ఈ ఇద్దరు గత ప్రభుత్వ హయంలో ఎక్సైజ్ శాఖలో కీలక పొజిషన్ లో ఉన్నారు.. రాష్ట్ర ఆదాయానికి భారీ నష్టం చేకూరే విధంగా వారికి మిథున్ రెడ్డి సూచనలు చేశారు అని సిట్ పేర్కొంది.
Read Also: Gandra Venkata Ramana Reddy: సీఎం రేవంత్ రెడ్డి పగటికలలు కనడం మానుకోవాలి!
Also Read
- Uday Krishna Reddy: నేను ఎక్కడికీ పారిపోలేదు.. ఆరోపణలు అన్నీ అవాస్తవం.. నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటా!
- DSC irregularities: దమ్ముంటే చర్చకు రా.. మంత్రి లోకేష్కు మాజీ మంత్రి పేర్ని నాని సవాల్!
- Mega DSC: 'మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ'.. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఆందోళనలు, లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్!
- AP Weather Update: తీరం దాటిన తీవ్ర వాయుగుండం.. ఉత్తరాంధ్రలో మోస్తరు వర్షాలు!
అయితే, స్పై ఆగ్రో, శాన్ హాక్ లాబ్స్, డికార్డ్ లాజిస్టిక్ సంస్థలకు లిక్కర్ స్కాం ముడుపులు మళ్ళించారు అని సిట్ తెలిపింది. మిథున్ రెడ్డి సొంత సంస్థ PLR ప్రాజెక్ట్ కి రూ. 15 కోట్లు జమ అయ్యాయి.. డియర్ లాజిస్టిక్ నుంచి PLR ప్రాజెక్ట్ కి రూ. 25 కోట్లు వెళ్ళాయి.. మనీ ల్యాండరింగ్ జరిగిన అంశంపై మరింత విచారణ చేపట్టాల్సి ఉంది.. ఈ డబ్బు మళ్లింపులో కేసులో ఏ1గా ఉన్న రాజ్ కేసీ రెడ్డి ఆయన పీఏ ఏ9గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి పర్యవేక్షించారు.. 2024 ఎన్నికల్లో అనేక నియోజకవర్గాల్లో రాజకీయ ప్రయోజనం కోసం డబ్బు ఖర్చు చేశారని చెప్పుకొచ్చింది. లిక్కర్ స్కాంలో వసూలు చేసిన డబ్బును ఎక్కడకు మళ్లించారనేది మిథున్ రెడ్డికి తెలుసు.. మద్యం సిండికేట్ సభ్యులతో కలిసి వసూల్ చేసిన కమిషన్లు, ముడుపుల డబ్బును రాజకీయ నాయకులకు, ప్రభుత్వ అధికారులకు ఆర్ధిక లాభం చేకూర్చారని సిట్ వెల్లడించింది.
తాజావార్తలు
-
Kitchen Hacks : పిండి కలిపేటప్పుడు.. ఇవి కలిపితే.. చపాతీ పొంగి దూదిలా పొంగుతుంది..
-
Pakistan: భారత్లా పాకిస్తాన్లో విద్యార్థి ఉద్యమాలు సాధ్యం కావు.. ఎందుకంటే.?
-
Modi-IAS: తన రాజీనామా ఆమోదించండి.. ప్రధాని మోడీకి మాజీ ఐఏఎస్ వినతి
-
Mediterranean Diet vs Indian Diet: భారతీయ ఆహారాన్ని మార్చాల్సిన అవసరముందా..? డైట్పై వైద్యుల కీలక సూచనలు
-
Pakistan: మరో గల్ఫ్ దేశంతో పాక్ రక్షణ ఒప్పందం.. కన్నేసుంచిన భారత్
ట్రెండింగ్
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!
-
3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, 165Hz రిఫ్రెష్ రేట్ తో రాబోతున్న iQOO Z11 5G..!
-
Saransh Jain: భారత జట్టులోకి దేశవాళీ మాన్స్టర్.. ఎవరీ సరాంశ్ జైన్?.. అంత తోపు ప్లేయరా?
-
Sanju Samson: ఎలుకల పందెంలో పరుగెత్తలేను.. ఎలా ఆడాలో ఎవరూ చెప్పక్కర్లేదు.. సంజు సంచలన వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన POCO M8 Power 5G.!