GVL Narasimha Rao: విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వహణకు జాతీయ ప్రాధాన్యత ఇవ్వాలి.. కేంద్ర మంత్రికి జీవీఎల్ విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GVL Narasimha Rao: వైజాగ్ స్టీల్ ప్లాంట్ పూర్తిస్థాయి పనితీరు కోసం వర్కింగ్ క్యాపిటల్ సమస్యను తీర్చాలని కోరుతూ కేంద్ర ఉక్కు శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు భేటీ అయ్యారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ (ఆర్ఐఎన్ఎల్) ఎదుర్కొంటున్న తీవ్రమైన వర్కింగ్ క్యాపిటల్ సమస్యను అంతం చేయడానికి మంత్రిత్వ శాఖ జోక్యాన్ని కోరారు.
గత ఏడాది రూ.913 కోట్ల నికర లాభాన్ని ఆర్జించిన ఆర్ఐఎన్ఎల్.. ప్రస్తుత సంవత్సరంలో వర్కింగ్ మెటీరియల్ అందుబాటులో లేకపోవడం, అధిక ముడిసరుకు ధర, ప్రతికూల మార్కెట్ పరిస్థితుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఎంపీ జీవీఎల్, మంత్రికి సమర్పించిన లేఖలో పేర్కొన్నారు. ఆర్ఐఎన్ఎల్లో ఖాళీగా ఉన్న డైరెక్టర్ ఫైనాన్స్ వంటి నిర్వహణ స్థాయి స్థానాలను భర్తీ చేయాలని ఎంపీ జీవీఎల్ నరసింహారావు తన లేఖలో హైలైట్ చేశారు.
Also Read
- Chandrababu: 'అప్పుడు మూడు రాజధానులు.. ఇప్పుడు మావిగన్'.. జగన్పై చంద్రబాబు సెటైర్లు
- CM Chandrababu: వీబీజీ రామ్జీ పథకానికి శ్రీకారం.. గ్రామాల అభివృద్ధిపై చంద్రబాబు భారీ ప్రకటనలు
- Topudurthi Prakash Reddy: టిప్పర్తో ఢీకొట్టి నన్ను హత్య చేయాలని కుట్ర.. తోపుదుర్తి సంచలన ఆరోపణలు
- Somu Veerraju: జగన్కు దమ్ముంటే చర్చకు రావాలి.. సోము వీర్రాజు సవాల్
Venkaiah Naidu: అప్పుడు చాలా బాధపడ్డా.. వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు..
బలమైన, శక్తివంతమైన, లాభదాయకమైన ఆర్ఐఎన్ఎల్ విశాఖపట్నం ప్రాంతం, మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మూల స్థంభం వంటిదని పేర్కొన్న జీవీఎల్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్వహణకు జాతీయ ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. కేంద్ర ఉక్కుశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో తాను భేటీ కావడం పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ఎంపీ జీవీఎల్ నరసింహారావు.. వర్కింగ్ క్యాపిటల్ సమస్యను త్వరలో పరిష్కరిస్తామని, విశాఖ స్టీల్ ప్లాంట్కు ముడిసరుకును మంత్రిత్వ శాఖ ముందస్తుగా సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తుందని తెలియచేశారని చెప్పారు. ఆర్ఐఎన్ఎల్ తన సామర్థ్య వినియోగాన్ని పెంచుకునేందుకు ఈ వెసులు బాటు సహాయ పడుతుందని మంత్రి అభిప్రాయ పడ్డారు
తాజావార్తలు
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్న్యూస్.. 74 ఏళ్లుగా ఉన్న కీలక సమస్యకు పరిష్కారం
-
Dhruv Vikram: మైత్రీ మూవీ మేకర్స్ 4వ తమిళ సినిమాలో హీరోగా ధృవ్ విక్రమ్
-
Supreme Court: సుప్రీం కోర్టుకు హనీమూన్ మర్డర్ కేసు.. ఏం జరిగిందంటే..!
-
Anirudh: బక్కోడు మాములోడు కాదుగా!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?