వరద బాధితుల్ని తక్షణం ఆదుకోవాలి -సీఎం రమేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో భారీ వర్షాల వల్ల నష్టపోయినవారిని ఆదుకోవాలన్నారు సీఎం రమేష్. ఆంధ్రప్రదేశ్ లో గత రెండురోజులుగా కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలో వరదలు సంభవిస్తే ప్రభుత్వ చర్యలు శూన్యం. ఆస్తి, ప్రాణ నష్టం తీవ్రంగా జరిగింది. చిన్న చిన్న పనులు, పింఛా, చెయ్యేరు ప్రాజెక్ట్ ల గేటు మరమ్మత్తు పనులు చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యం కాదా ? అని ఆయన ప్రశ్నించారు.
ప్రభుత్వ యంత్రాంగం ఉందా లేదా? అసలు ప్రభుత్వం ఉందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కడప జిల్లాలో పలు మండలాలు వరద ముప్పు ఎదుర్కొనే పరిస్థితి ఉంటే కనీసం ప్రభుత్వంలో చలనం లేదు. రాయలసీమ లో ఎందుకు అధికారులను అప్రమత్తం చేయడం లేదు? అక్రమాలు, రాజకీయాల కోసం రాయలసీమను ప్రభుత్వం బలిపెడుతుంది. ప్రజలు కష్టాల్లో ఉంటే అసెంబ్లీ సమావేశాలు ఎందుకు వాయిదా వేయలేదన్నారు రమేష్. వరద, భారీ వర్షాల సమాచారం ప్రభుత్వానికి లేదంటే సిగ్గుచేటు. కనీస జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదు. పెన్నానది, చిత్రానదీ పరీవాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కడప, రాజంపేట, కోడూరు ప్రాంతాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయన్నాన్నారు ఎంపీ సీఎం రమేష్.
Also Read
- OTR: మాజీ ఎమ్మెల్యే, మంత్రి మధ్య సమాధి రాజకీయం
- CM Chandrababu: అమరావతి 2.0 ఇంటిగ్రేటేడ్ మాస్టర్ ప్లాన్ పై సీఎం సమీక్ష.. ప్రపంచస్థాయి నగరంగా..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
ఏపీ అసెంబ్లీలో పరిణామాలు సిగ్గుచేటు
ఏపీ శాసనసభలో శుక్రవారం జరిగిన పరిణామాలపై అంతా స్పందిస్తున్నారు. నిన్న అసెంబ్లీ లో జరిగిన పరిణామాలు సిగ్గుచేటు అన్నారు బీజేపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్. ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజ్యసభ సభ్యుడిగా సిగ్గుపడుతున్నా అన్నారు. దేశంలో రాష్ట్రం పరువుపోతుంది. రాష్ట్రం గురించి, అసెంబ్లీ లో జరిగిన పరిణామాల గురించి దేశ వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. సభ్యసమాజం సిగ్గు పడే విధంగా నిన్నటి పరిణామాలు జరిగాయి. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. రాష్ట్ర అసెంబ్లీ లో ఒకప్పటి మర్యాదలు, గౌరవాలు, హందాతనం ప్రస్తుతం లేవన్నారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!