Rapaka Varaprasad: ఆ వ్యాఖ్యలపై స్పందించిన రాపాక.. ఆసక్తికర కామెంట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rapaka Varaprasad: రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నన్ను ప్రలోభ పెట్టిందని.. రూ.10 కోట్ల ఆఫర్ ఇచ్చిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఓవైపు.. గతంలో తాను సర్పంచ్గా దొంగ ఓట్లుతో గెలిచానని.. చింతలమోరి గ్రామంలో నా ఇంటి వద్ద పోలింగ్ బూత్లో దొంగ ఓట్లు పడేవని.. నా అనుచరులు ఒక్కొక్కరు పదేసి ఓట్లు వేసేసేవారు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఇది తీవ్ర వివాదంగా మారింది.. అయితే, ఆ వీడియోపై మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చారు ఎమ్మెల్యే రాపాక.. ఎప్పుడో 32 ఏళ్ల క్రితం జరిగిన సందర్భాన్ని ఆత్మీయ సమ్మేళనంలో ప్రస్తావిస్తే, దానిని ఇప్పుడు జరిగి నట్లు ప్రచారం చేయడం తగదని హితవుపలికారు.
Also Read
- Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
- Off The Record : చీమకుర్తి గ్రానైట్ క్వారీల్లో అదృశ్య శక్తులు..? వైసీపీ ఎమ్మెల్యే క్వారీని టార్గెట్ చేశారా?
- YS Jagan : వైసీపీలోకి మోపిదేవి శ్రీనివాసరావు.. రేపల్లె బాధ్యత మనదే.. కార్యకర్తలే నా బలం
- Vizag: విశాఖలో ఘోర విషాదం.. పెళ్లి దండలతోనే నవ వధువు మృతి
అయితే, సదరు వ్యాఖ్యలు అందరూ నవ్వుకునేందుకు చెప్పిన మాటలేనని, సీరియస్ గా చెప్పినవి కావు అంటున్నారు ఎమ్మేల్యే రాపాక.. రాజోలులో మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలుగుదేశం పార్టీని విమర్శిస్తే జనసైనికులు ఆందోళన చేయడం ఎందుకని ప్రశ్నించారు. జనసేన నన్ను ఏమైనా ఓటు వేయమని అడిగారా ? అని నిలదీశారు. 2019లో 810 ఓట్ల స్వల్ప మెజారిటీతో వైసీపీ అభ్యర్థిపై విజయం సాధించా, అంతకుముందు తొలిసారి 2009లో కాంగ్రెస్ తరఫున 4,600 ఓట్ల ఆధిక్యంతో గెలిచిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇక, బొంగు రాజేశ్వరరావు చేతకాని దద్దమ్మ అంటూ ఫైర్ అయ్యారు.. రాష్ట్రం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలి వీచి.. 151 సీట్లు గెలిస్తే.. సత్తా లేక బొంతు.. రాజోలులో ఓడిపోయాడని మండిపడ్డారు.. మరోవైపు.. ఇప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ నన్ను ప్రలోభ పెట్టినట్లు చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని అన్నారు. గత ఎన్నికల్లో నాకు ఓటు వేసింది జనసైనికులే, ఎస్సీలు వైసీపీకి వేశారని స్పష్టం చేశారు. అయితే, నేను వైసీపీలోకి వచ్చానని బొంతు వర్గం ఆత్మీయ సమావేశం పెట్టి ఆహ్వానించారని వివరణ ఇచ్చారు రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్.
తాజావార్తలు
-
Peddi: ‘పెద్ది’ రిలీజ్కు భారీ షాక్..
-
Delhi Work From Home: ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. పొదుపు చర్యల జాబితా విడుదల
-
Jasprit Bumrah: “ఇక మిగిలింది వన్డే కెప్టెన్సీనే.. కానీ!”.. కెప్టెన్గా తొలి విజయంపై జస్ప్రీత్ బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Dragon: నేషనల్ మీడియా సమక్షంలో ‘డ్రాగన్’ ఫస్ట్ గ్లింప్స్ లాంచ్!
-
Tilak Varma: “నమ్మకమే నా బలం..” అలా ఆడడం అంటే ఎంతో ఇష్టం..!
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!