MLA Prasanna Kumar: చంద్రబాబు లాంటి మోసగాడు.. దేశ చరిత్రలోనే ఉండరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Prasanna Kumar Shocking Comments On Chandrababu Naidu: వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు. నెల్లూరు జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు అంత అబద్దాలకోరు, పచ్చి మోసగాడు, నరరూప రాక్షసుడు ఈ దేశ చరిత్రలో ఉండదరని ఆరోపించారు. 2014లో 600కు వాగ్ధానాలు చేసి, ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాడని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసగించారని దుయ్యబట్టారు. మూడు రోజుల పాటు రాజమహేంద్రవరం (రాజమండ్రి)లో అబద్ధపు వరాలు కురిపించాడని విమర్శించారు. మహానాడు వేదిక మీద పెద్ద నాటకాల రాయుడుగా డ్రామాలాడాడని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాను సీఎం జగన్ తాకట్టు పెట్టారని విమర్శించే చంద్రబాబు.. కేంద్రంతో అధికారం పంచుకున్నపుడు ఆ హోదాను ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు.
Odisha train tragedy: గూడ్స్ రైలులో ఇనుప ఖనిజం.. అందుకే ప్రమాద తీవ్రత పెరిగింది..
Also Read
- AP Weather Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. పల్నాడు సహా 7 జిల్లాలకు అలర్ట్
- Vizag Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్..
- Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
- CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
రెండు ఎకరాల ఆస్తి ఉన్న చంద్రబాబుకు.. ఈరోజు నాలుగు లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ నిలదీశారు. చంద్రబాబు ఎన్ని వేషాలు వేసినా, ప్రజలు ఆయన్ను నమ్మరని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి అవుతానని చంద్రబాబు పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. దత్తపుత్రుడు వస్తున్నాడు, వారాహి తీసుకొస్తున్నాడు, అందరం కలుస్తున్నామమని చంద్రబాబు చెప్తున్నాడని పేర్కొన్నారు. ఎంతమంది కలిసొచ్చినా.. ఆంధ్ర రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి 25 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. ఇది ప్రజల ఆశీర్వాదమని, దీన్ని ఎవరూ ఆపలేరని ఉద్ఘాటించారు. బాబు చుట్టూ ఉండే కమ్మ సామ్రాజ్యం తప్ప.. తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తల్ని బాగుపరిచారా? అని అడిగారు. నీ దత్తపుత్రుడుతో కలిసి వారాహి ఎక్కినా.. సీఎం జగన్ వెంట్రుక కూడా పీకలేరని ఛాలెంజ్ చేశారు.
Kurnool Pregnancy Case: యువతి గర్భవతి.. డీఎన్ఏ టెస్ట్ కోరిన యువకుడు.. చివరికి షాక్
అంతకుముందు ప్రసన్నకుమార్ వైసీపీ పార్టీని వీడుతున్నారని ప్రచారాలు వచ్చినప్పుడు.. దీని వెనుక చంద్రబాబు కుట్ర ఉందని ఆయన ధ్వజమెత్తారు. తాను వైసీపీని వదిలే ప్రసక్తే లేదని, చనిపోయే వరకు వైఎస్ జగన్తోనే ఉంటానని స్పష్టం చేశారు. కావాలనే ఏదో విధంగా గందరగోళం సృష్టించి.. ఎమ్మెల్యేలు టీడీపీలోకి వస్తున్నారని ప్రచారం చేస్తున్నారని, అదంతా అవాస్తవమని అన్నారు. ఒకవేళ తాను చనిపోయినా.. తన కుమారుడు రజత్ కుమార్ రెడ్డి కూడా జగన్తోనే ఉంటారన్నారు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!