టీడీపీ సవాళ్ళను స్వీకరించిన అధికార పార్టీ…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరాంధ్ర అభివృద్ధిపై టీడీపీ సవాళ్ళను స్వీకరించింది అధికార పార్టీ. అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్ మాట్లాడుతూ… ఉత్తరాంధ్ర ప్రజల ఓట్లతో గెలిసిన టీడీపీ నేతలు చంద్రబాబు బంట్రోతుగా పని చేస్తున్నారు. టీడీపీ నేతల ఉత్తరాంధ్ర రక్షణ సమావేశం చూసి ప్రజలు సిగ్గు పడుతున్నారు. ఉత్తరాంధ్రను భక్షించిన వాళ్లే రక్షణ అంటూ మాట్లాడుతున్నారు. టీడీపీ నేతలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పిన సిగ్గు రాలేదు అన్నారు. విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తే చంద్రబాబు అడ్డుకుంటున్నారు..అమరావతి కోసం విశాఖకు అన్యాయం చేస్తున్నారు. అమరావతిపై చంద్రబాబుకు ఉన్నది కమర్షియల్ ఎటాచ్ మెంట్ మాత్రమే. విశాఖకు చంద్రబాబు అన్యాయం చేస్తుంటే ఎందుకు ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు నోరు మెదపలేదు అని తెలిపారు.
అయితే చంద్రబాబు భజన చేసేందుకే టీడీపీ నేతలు సమావేశం పెట్టినట్లు ఉంది. టీడీపీ ఉద్దండులు దద్దమ్మలా సమావేశంలో మాట్లాడారు. ఉత్తరాంధ్ర ప్రజలను మోసం చేశామని టీడీపీ నేతలు బస్సు యాత్ర చేయాలి. అభివృద్ధి చేస్తే ప్రజలు ఓడించారని అచ్చెన్నాయుడు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. జిల్లాలు వారిగా చంద్రబాబు ప్రకటించిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదు. విశాఖలో లక్ష ఎకరాల భూములను టీడీపీ నేతలు కాజేశారు. చంద్రబాబు హుద్ హుద్ సమయంలో వారం రోజులు పాటు వైజాగ్ లో ఉన్నపుడు రికార్డులు మాయమయ్యాయి. నేపాల్ గూర్ఖాలకు సూటు బూటు వేసి వారితో చంద్రబాబు ఎంవోయూలపై సంతకాలు చేయించుకున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చర్చకు టీడీపీ నేతలతో మేము సిద్ధము. మాతో చర్చకు టీడీపీ నేతలు సిద్ధమా అని సవాల్ విసిరారు. చంద్రబాబుతో కుమ్మకై కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేయడం వలన కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది అని పేర్కొన్నారు.
Also Read
- YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన!
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
- CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
తాజావార్తలు
-
Thummidihatti Barrage: తెలంగాణ, మహారాష్ట్ర మధ్య తుమ్మిడిహట్టి పంచాయితీ.. నేడు కేంద్రం సమక్షంలో చర్చలు..!
-
NTV Exclusive: ‘మండాడి’ కోసం 45 రోజులు సముద్రంలోనే.. నాలుగైదుసార్లు చావు అంచుల వరకు వెళ్లాం: సుహాస్
-
Bethlehem Family Unit: రూ. 250 కోట్ల దిశగా మలయాళ మూవీ.. తెలుగులోనూ రిలీజ్కు రెడీ!
-
YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన!
-
Toxic : వంద కోట్ల గ్రాస్ కూడా రాబట్టలేక షాకిచ్చిన ‘యశ్ టాక్సిక్’
ట్రెండింగ్
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!