Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Mla And Mlc Rivalry In Proddutur

ప్రొద్దుటూరు వైసీపీలో రచ్చకెక్కిన విభేదాలు

Published Date :January 25, 2022 , 4:17 pm
By NTV WebDesk
ప్రొద్దుటూరు వైసీపీలో రచ్చకెక్కిన విభేదాలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు రాజుకుంటూనే వున్నాయి. అనుచరుడిగా ఉంటారని ఆ ఎమ్మెల్యే కోరి తెచ్చుకున్న వ్యక్తి ఆయనకే కొరగాని కొయ్యగా మారిపోయాడు. మారిన పరిణామాలతో ఆ అనుచరుడికి ఊహించని పదవి వచ్చింది. దీంతో అధికారపార్టీలో వర్గవిభేదాలు పతాక స్థాయికి చేరుకుంటున్నాయి. అధిష్ఠానానికి తలనొప్పులు వచ్చిపడుతున్నాయి.

రాచమల్లు, రమేష్‌ మధ్య మలుపులు తిరుగుతున్నాయి. కడప జిల్లా ప్రొద్దుటూరులో వైసీపీ ఆవిర్భావంతో లోకల్‌ పాలిటిక్స్‌ మారిపోయాయి. అప్పటిదాకా పోటీ టీడీపీ, కాంగ్రెస్ మధ్య ఉండేది. ఆ తర్వాత పోరు వైసీపీ, టీడీపీగా మారిపోయింది. ప్రస్తుతం వైసీపీదే హవా. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. ఒకసారి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా, ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి. అలాంటి ప్రొద్దుటూర్‌లో మున్సిపల్‌ ఎన్నికలు ఎమ్మెల్యేకు ఇబ్బందిని తెచ్చిపెట్టాయి. ఆ ఎన్నికల్లో యాదవ సామాజికవర్గానికి చెందిన మాజీ మున్సిపల్‌ ఛైర్మన్ వెంకట సుబ్బయ్య కుమారుడు రమేష్ యాదవ్‌ను చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించారు. ఆయన కౌన్సిలర్‌గా గెలిచారు. కానీ.. ఛైర్మన్‌గా రమేష్‌ యాదవ్‌ పేరును ప్రకటించలేదు.

అయితే అక్కడే ట్విస్ట్. బీసీ సామాజికవర్గంలో చేనేత వర్గానికి చెందిన లక్ష్మీదేవిని ఛైర్‌పర్సన్‌ను చేశారు. ఆ సమయంలో ఎమ్మెల్యే రాచమల్లు, రమేష్‌ యాదవ్‌ మధ్య మొదలైన రగడ అనేక మలుపులు తిరుగుతోంది. మున్సిపల్‌ ఎన్నికల్లో తాను ఖర్చు పెట్టిన 5 కోట్లు తిరిగి ఇవ్వాలని రమేష్‌ గొడవ చేశారు. దాంతో రమేష్‌కు రాష్ట్రస్థాయి పదవి ఇప్పిస్తానని ఎమ్మెల్యే రాచమల్లు బహిరంగంగా ప్రకటించారు. యాదవ సామాజికవర్గంపై తనకు ఎనలేని ప్రేమ ఉందని చెప్పారు. ఎవరూ ఊహించని రీతిలో రమేష్‌ యాదవ్‌ను గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీని చేశారు సీఎం జగన్‌. వైసీపీలో ఇదో సంచలనం. ఎమ్మెల్సీ పదవి తన పలుకుబడితోనే వచ్చిందని ఎమ్మెల్యే రాచమల్లు చెప్పుకున్నా దానిని ఎవరూ పట్టించుకోలేదు.

ఈ అంశంపై చర్చ జరుగుతున్న సమయంలోనే ఎమ్మెల్సీ రమేష్‌ను చంపుతామని.. టీడీపీ నేత నందం సుబ్బయ్యకు పట్టిన గతే పడుతుందని ఫోన్‌లో బెదిరించారు. ఈ బెదిరింపుల వెనక ఎమ్మెల్యే రాచమల్లు హస్తం ఉందని ప్రచారం జరిగింది. అయితే వాటిని ఎమ్మెల్యే ఖండించారు. ఫోన్‌లో బెదిరించిన వాళ్లను పట్టుకుని నడిరోడ్డులో ఊరేగించాలని ఎస్పీకి ఫోన్‌ చేసి చెప్పారు రాచమల్లు. ఫోన్‌ బెదిరింపులపై కేసు నమోదైనా.. ఏమైందో ఎవరికీ తెలియదు.

అధిష్టానం సూచనలతో ప్రొద్దుటూరు రాజకీయాలను రాచమల్లుకే వదిలి జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల్లో తిరుగుతూ వస్తున్నారు ఎమ్మెల్సీ రమేష్‌. పార్టీ అధిష్ఠానం కూడా ఎమ్మెల్సీకి అండగా ఉందని టాక్‌ నడిచింది. బద్వేల్‌ ఉపఎన్నిక, కమలాపురం మున్సిపల్ ఎన్నికలు ఎమ్మెల్సీని పార్టీకి మరింత దగ్గర చేసినట్టు ప్రచారం జరిగింది. ఈ పరిణామాలు.. ప్రచారం ఎమ్మెల్యే రాచమల్లు, ఎమ్మెల్సీ రమేష్ మధ్య ఇంకా గ్యాప్‌ తీసుకొచ్చాయి. ప్రొద్దుటూరులో ఎమ్మెల్సీకి ప్రొటోకాల్‌ దక్కకుండా అడ్డుకోవడంపై వివాదం రాజుకుంది. అధికారిక కార్యక్రమాల్లో ఎమ్మెల్యే రాచమల్లు ఫొటోలతో సమానంగా ఎమ్మెల్సీ రమేష్‌ ఫొటో, పేర్లు కనిపించడంలేదు.

ఎమ్మెల్సీ బర్త్‌డే వేడుకల సందర్భంగా వేసిన ఫ్లెక్సీల్లో సీఎం, ఎంపీ ఫొటోలు తప్ప ఎమ్మెల్యే ఫొటోలు లేవు. దీంతో ఎమ్మెల్యే వర్గానికి చెందిన కసిరెడ్డి మహేష్‌రెడ్డి ఎమ్మెల్సీ వర్గీయులతో గొడవ పడ్డారు. భౌతికదాడులకు దిగారు. తనను చంపుతానని ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌ గన్‌ గురిపెట్టారని వైసీపీ కౌన్సిలర్‌ లక్ష్మీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల మధ్య గొడవలు తారస్థాయికి చేరాయి. ఈ వివాదాన్ని ఎలా తేల్చాలో తెలియక పార్టీ పెద్దలు ఇబ్బంది పడుతున్నారు. ఇది చాలదన్నట్టుగా 2024లో వైసీపీ టికెట్‌ బీసీలకు ఇస్తారన్న ప్రచారం ఎమ్మెల్యే వర్గానికి మింగుడుపడడం లేదు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • kadapa politics
  • mla vs mlc
  • mlc ticket
  • municipla chariman
  • rachamallu

తాజావార్తలు

  • Rain Alert: ఈ మూడు రోజులు అలర్ట్.. ఆంధ్ర, తెలంగాణలో భారీ వర్ష సూచనలు..

  • Srisailam: నేడు శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికా దేవి కుంభోత్సవం

  • AA 22 : అల్లు అర్జున్ టైటిల్ అనౌన్స్మెంట్ కు టైమ్ ఫిక్స్

  • IPL Effect : సినిమా కలెక్షన్స్‌కు గండికొడుతున్న ఐపీఎల్

  • MLA Arava Sridhar: తన ప్రైవేట్‌ వీడియోలు వైరల్.. హైకోర్టును ఆశ్రయించిన జనసేన ఎమ్మెల్యే..

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions