Minister Taneti Vanita: రేప్ కేసుల్లో ఎక్కువ మంది నిందితులు టీడీపీ వాళ్లే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాపట్ల జిల్లా రేపల్లె రైల్వేస్టేషన్లో అత్యాచారానికి గురైన బాధితురాలిని ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో మంత్రులు తానేటి వనిత, ఆదిమూలపు సురేష్, మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ సోమవారం ఉదయం పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ టీడీపీ నేతలపై ఆరోపణలు చేశారు. ఏపీలో జరుగుతున్న హత్యలు, అత్యాచార ఘటనల్లో ఎక్కువశాతం నిందితులు టీడీపీ వాళ్లే ఉన్నారని ఆమె వ్యాఖ్యానించారు. టీడీపీ నేతల ప్రమేయంతోనే ఏపీలో ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయని మంత్రి తానేటి వనిత విమర్శించారు. ఈ ఘటన సమయంలో భర్తపై దాడి చేస్తున్న బాధ్యులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన భార్యపై ఘాతుకానికి పాల్పడ్డారని ఆమె వివరించారు.
మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ ముగ్గురు నిందితులను తక్షణమే అరెస్ట్ చేశామని మంత్రి తానేటి వనిత తెలిపారు. బాధ్యులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. అయితే ఊహించని ఘటన కారణంగా ప్రస్తుతం మహిళ షాక్లో ఉందని పేర్కొన్నారు. బాధితురాలికి ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సిన అన్నిరకాల పరిహారాలు అందిస్తామన్నారు. అత్యాచార ఘటనలకు గురైన బాధితుల వివరాలు తెలిపే విషయంలో గోప్యత పాటించాలని మీడియాకు హితవు పలికారు. ఈ ఘటనపై ప్రతిపక్షాలు కావాలనే రాద్దాంతం చేస్తున్నాయని మండిపడ్డారు.
Also Read
- Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
- Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
- Nara Lokesh: అక్షర ఆంధ్రకు నారా లోకేష్ కొత్త టార్గెట్.. వచ్చే ఏడాదికి సంపూర్ణ అక్షరాస్యత
- AP SIR Voter List Revision: ఎస్ఐఆర్ షెడ్యూల్లో మార్పులు.. కీలక తేదీలు ఇవే..
అటు ఏపీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. ఈ ఘటన రైల్వేస్టేషన్లో జరిగింది కాబట్టి రైల్వేస్టేషన్లలో భద్రత గురించి తాము కేంద్రానికి లేఖ రాశామని తెలిపారు. రాత్రిపూట రైల్వేస్టేషన్లలో నిద్రించే మహిళలకు భద్రత అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఘటనకు సంబంధించి అరెస్ట్ అయిన నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసును మూవ్ చేయడం జరిగిందని.. తద్వారా విచారణ మరింత వేగవంతం అవుతుందని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా వ్యవహరిస్తామని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు.
Chandra Babu: డీజీపీకి లేఖ.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్పై దృష్టి పెట్టాలి
తాజావార్తలు
-
US Iran Conflict: మిడిల్ ఈస్ట్లో మిసైల్ వార్.. అమెరికాపై ఇరాన్ ఎదురుదాడితో హైటెన్షన్!
-
Pawan Kalyan: పవర్ స్టార్ నుంచి డిప్యూటీ సీఎం వరకు.. పవన్ కల్యాణ్ 55 ఏళ్ల ప్రయాణం వెనుక అసలు సీక్రెట్ ఇదే!
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!