Minister Taneti Vanita: రేప్ కేసుల్లో ఎక్కువ మంది నిందితులు టీడీపీ వాళ్లే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాపట్ల జిల్లా రేపల్లె రైల్వేస్టేషన్లో అత్యాచారానికి గురైన బాధితురాలిని ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో మంత్రులు తానేటి వనిత, ఆదిమూలపు సురేష్, మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ సోమవారం ఉదయం పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ టీడీపీ నేతలపై ఆరోపణలు చేశారు. ఏపీలో జరుగుతున్న హత్యలు, అత్యాచార ఘటనల్లో ఎక్కువశాతం నిందితులు టీడీపీ వాళ్లే ఉన్నారని ఆమె వ్యాఖ్యానించారు. టీడీపీ నేతల ప్రమేయంతోనే ఏపీలో ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయని మంత్రి తానేటి వనిత విమర్శించారు. ఈ ఘటన సమయంలో భర్తపై దాడి చేస్తున్న బాధ్యులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన భార్యపై ఘాతుకానికి పాల్పడ్డారని ఆమె వివరించారు.
మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ ముగ్గురు నిందితులను తక్షణమే అరెస్ట్ చేశామని మంత్రి తానేటి వనిత తెలిపారు. బాధ్యులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. అయితే ఊహించని ఘటన కారణంగా ప్రస్తుతం మహిళ షాక్లో ఉందని పేర్కొన్నారు. బాధితురాలికి ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సిన అన్నిరకాల పరిహారాలు అందిస్తామన్నారు. అత్యాచార ఘటనలకు గురైన బాధితుల వివరాలు తెలిపే విషయంలో గోప్యత పాటించాలని మీడియాకు హితవు పలికారు. ఈ ఘటనపై ప్రతిపక్షాలు కావాలనే రాద్దాంతం చేస్తున్నాయని మండిపడ్డారు.
Also Read
- AP Horror: మాఫియాలో చేరాలని ప్లాన్.. స్నేహితుడితో కలిసి తల్లిని హత్య చేసిన కొడుకు.. బంగారంతో పరారీ
- Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
- Crime: కాపాడాల్సిన బాబాయే కీచకుడయ్యాడు.. ప్రైవేట్ ఫోటోలతో బెదిరించి బాలికపై దారుణం..
- Pawan Kalyan : రాష్ట్రం కోసమే రాజీ పడ్డాను.. పొత్తులో మీ ఆత్మగౌరవం దెబ్బతింటే ఊరుకోను
అటు ఏపీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. ఈ ఘటన రైల్వేస్టేషన్లో జరిగింది కాబట్టి రైల్వేస్టేషన్లలో భద్రత గురించి తాము కేంద్రానికి లేఖ రాశామని తెలిపారు. రాత్రిపూట రైల్వేస్టేషన్లలో నిద్రించే మహిళలకు భద్రత అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఘటనకు సంబంధించి అరెస్ట్ అయిన నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసును మూవ్ చేయడం జరిగిందని.. తద్వారా విచారణ మరింత వేగవంతం అవుతుందని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా వ్యవహరిస్తామని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు.
Chandra Babu: డీజీపీకి లేఖ.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్పై దృష్టి పెట్టాలి
తాజావార్తలు
-
Best Flour for Roti: ఏ పిండి రొట్టె ఆరోగ్యానికి మంచిది..? గోధుమ, రాగి, జొన్నల్లో సరైన ఎంపిక ఏది..?
-
Ramcharan : రామ్ చరణ్ చేతికి గాయం?..అసలు ఏమైంది?
-
Akki On Fire: రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ ల వికెట్ల తీసిన ఆనందం.. నోట్ సెలబ్రేషన్ వైరల్.!
-
PM Kisan 23th Installment Update: పీఎం కిసాన్ 23వ విడత.. రైతుల ఖాతాల్లో రూ. 2,000 ఎప్పుడు జమ అవుతాయంటే?
-
Sonakshi Sinha: సోషల్ మీడియా వల్ల ఇండస్ట్రీ పూర్తిగా మారిపోయింది..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..