Minister Taneti Vanita: రేప్ కేసుల్లో ఎక్కువ మంది నిందితులు టీడీపీ వాళ్లే
బాపట్ల జిల్లా రేపల్లె రైల్వేస్టేషన్లో అత్యాచారానికి గురైన బాధితురాలిని ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో మంత్రులు తానేటి వనిత, ఆదిమూలపు సురేష్, మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ సోమవారం ఉదయం పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ టీడీపీ నేతలపై ఆరోపణలు చేశారు. ఏపీలో జరుగుతున్న హత్యలు, అత్యాచార ఘటనల్లో ఎక్కువశాతం నిందితులు టీడీపీ వాళ్లే ఉన్నారని ఆమె వ్యాఖ్యానించారు. టీడీపీ నేతల ప్రమేయంతోనే ఏపీలో ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయని మంత్రి తానేటి వనిత విమర్శించారు. ఈ ఘటన సమయంలో భర్తపై దాడి చేస్తున్న బాధ్యులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన భార్యపై ఘాతుకానికి పాల్పడ్డారని ఆమె వివరించారు.
మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ ముగ్గురు నిందితులను తక్షణమే అరెస్ట్ చేశామని మంత్రి తానేటి వనిత తెలిపారు. బాధ్యులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. అయితే ఊహించని ఘటన కారణంగా ప్రస్తుతం మహిళ షాక్లో ఉందని పేర్కొన్నారు. బాధితురాలికి ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సిన అన్నిరకాల పరిహారాలు అందిస్తామన్నారు. అత్యాచార ఘటనలకు గురైన బాధితుల వివరాలు తెలిపే విషయంలో గోప్యత పాటించాలని మీడియాకు హితవు పలికారు. ఈ ఘటనపై ప్రతిపక్షాలు కావాలనే రాద్దాంతం చేస్తున్నాయని మండిపడ్డారు.
Also Read
- AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
- CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
- వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
- Petrol, Diesel Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు
అటు ఏపీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. ఈ ఘటన రైల్వేస్టేషన్లో జరిగింది కాబట్టి రైల్వేస్టేషన్లలో భద్రత గురించి తాము కేంద్రానికి లేఖ రాశామని తెలిపారు. రాత్రిపూట రైల్వేస్టేషన్లలో నిద్రించే మహిళలకు భద్రత అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఘటనకు సంబంధించి అరెస్ట్ అయిన నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసును మూవ్ చేయడం జరిగిందని.. తద్వారా విచారణ మరింత వేగవంతం అవుతుందని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా వ్యవహరిస్తామని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు.
Chandra Babu: డీజీపీకి లేఖ.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్పై దృష్టి పెట్టాలి
తాజావార్తలు
-
Good News : పోలీసులకు గుడ్ న్యూస్.. స్పెషల్ లీవ్ ప్రకటించిన డీజీపీ
-
Crane Accident : శంకర్పల్లిలో విషాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి
-
DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..
-
Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
-
Yatra: హీరోగా రజనీకాంత్ మనవడు.. కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై ధనుష్ క్లారిటీ ఇదే!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!