Seediri Appalaraju: సీఎం జగన్ను దూషిస్తున్నారు.. ఒక్కొక్కడికి తాటతీసే రోజు దగ్గరలోనే ఉంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Seediri Appalaraju: సీఎం వైఎస్ జగన్పై ఎవరైనా ఎక్కువగా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు.. ఒక్కొక్కడికి తాట తీసే రోజు దగ్గరలోనే ఉంది అని హెచ్చరించారు మంత్రి సీదిరి అప్పలరాజు.. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పాదయాత్రల పేరిట రకరకలా విన్యాసాలు చెస్తున్నారు అంటూ లోకేష్పై సెటైర్లు వేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎదగకూడదన్నది చంద్రబాబు బలమైన అకాంక్షగా పేర్కొన్న ఆయన.. టీడీపీకి ఎమ్మెల్సీ , రాజ్యసభ అవకాశం వస్తే సూటికేస్ ఇచ్చేవారికి కేటాయించారు… బీసీలకు ఆదరణ తీసుకువచ్చామంటారు.. మీరు ఇచ్చిన ఆదరణ పథకంతో బాగుపడ్డ ఒక్క కుటుంబాన్ని చూపించండి అంటూ సవాల్ విసిరారు.. పదవులు అమ్ముకోవడం చంద్రబాబు నైజం అంటూ సంచలన ఆరోపణలు చేశారు. లోకేష్ స్థాయి ఏంటి? జగన్ స్థాయి ఏంటి? పిల్లబచ్చా లోకేష్ ది.. సీఎం జగన్ ను విమర్శించే స్థాయి కాదని వార్నింగ్ ఇచ్చారు.
Read Also: Volodymyr Zelenskyy: చైనా ఆ పని చేస్తే ‘వరల్డ్ వార్’ తప్పదు.. జెలెన్స్కీ హెచ్చరిక
Also Read
- Rythu Shankaravam: 'రైతు శంఖారావం'కు అనుమతి నిరాకరణ.. ఎక్కడికక్కడే వైసీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు!
- YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన!
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
సీఎం వైఎస్ జగన్ను వ్యక్తి గతంగా తిడుతూ దూషిస్తున్నారు.. కానీ, ఒక్కొక్కడికి తాటతీసే రోజు దగ్గరలో ఉందంటూ హెచ్చరించారు అప్పలరాజు.. మేం కన్నెర్ర చెస్తే గ్రామాలలో తిరగలేరు అని వార్నింగ్ ఇచ్చారు.. ఇక, గన్నవరంలో ఇష్యూని రాజకీయంగా మైలేజ్ పొందేందుకు ప్రయత్నిస్తారు అని ఆరోపించారు.. టీడీపీ హద్దు మీరే ప్రయత్నం చేస్తుంది.. చంద్రబాబు మీ అల్లరి మూకలను అదుపుచేసుకోవాలని సూచించారు. ఎన్ని జిమ్మిక్కులు, కుట్రలు చేసినా.. గన్నవరం లాంటి ఘటనలు తీసుకొచ్చినా ఏమీ చేయలేరన్నారు.. నీ దరిద్రం ఇక రాష్ర్టానికి చాలు అని చంద్రబాబును ఉద్దేశించి హాట్ కామెంట్లు చేశారు. ఇక, వైసీపీ 151 ఎమ్మెల్యేలు, 44 మంది ఎమ్మెల్సీ లు మంత్రి అర్హత కలిగినవారే.. మంత్రి వర్గకూర్పు అంశం సీఎం విచక్షణ అధికారమని స్పష్టం చేశారు.. కొన్ని వర్గాలకు అవకాశం ఇవ్వాలనుకుంటే.. నేను మొదటిగా రిజైన్చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. మా మత్స్యకారులకు మంచి గౌరవం ఇచ్చారు.. మత్స్యకారులకు జగన్మోహాన్ రెడ్డి ఇచ్చిన గౌరవం ఎవరు ఇవ్వలేదని.. నలుగురు మత్స్యకారులకు ఎమ్మెల్సీ ఇచ్చారు.. వైఎస్సాఆర్ కాంగ్రెస్ అనే కంటే వైఎస్సాఆర్ బహుజన పార్టీ అనాలంటూ అభివర్ణించారు మంత్రి సీదిరి అప్పలరాజు.
తాజావార్తలు
-
Nithya Menen : నిర్మాణ రంగంపై నిత్యామీనన్ ఫోకస్
-
Raaz Actress: అప్పుడు దెయ్యంగా భయపెట్టిన నటి.. ఇప్పుడు ఫామ్స్టే నడుపుతూ ప్రశాంత జీవితం..
-
India Missile Test: సాహో భారత్.. శత్రు దేశాలకు వార్నింగ్ సిగ్నల్! అడ్వాన్స్డ్ అగ్ని సిరీస్లో కీలక టెస్ట్..
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Hardik Pandya Injury: హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. మరోసారి గాయం.. ఈ గాయాల గోలేందిరా బాబూ!
ట్రెండింగ్
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!