Minister Roja: ప్రధాని మోదీతో ప్రత్యేకంగా సెల్ఫీ తీసుకున్న మంత్రి రోజా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భీమవరంలో నిర్వహించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో ఏపీ పర్యాటక, సాంస్కృతిక మంత్రి రోజా స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. సభా వేదికపై అంతా తానే వ్యవహరించారు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి కిషన్రెడ్డి సహా ముఖ్య అతిథులను మంత్రి రోజానే సాదరంగా ఆహ్వానించారు. వేదికపై మెగాస్టార్ చిరంజీవితో సరదాగా మాట్లాడారు. అయితే ప్రధాని మోదీ తన ప్రసంగం ముగించిన తర్వాత మంత్రి రోజా ఆయన దగ్గరకు వెళ్లి ‘మోదీ సార్ ఒక్క సెల్ఫీ ప్లీజ్’ అంటూ అడిగారు. ఆ వెంటనే సీఎం జగన్ కూడా ఆమెతో కలిసి సెల్ఫీకి పోజులివ్వడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ మేరకు దేశ ప్రధాని మోదీ, రాష్ట్ర సీఎం జగన్లతో మంత్రి రోజా తీసుకున్న సెల్ఫీ ఎంతో ప్రత్యేకమైనదిగా భావించొచ్చు. మంత్రి రోజా తీసుకున్న సెల్ఫీలో మెగాస్టార్ చిరంజీవి కూడా కవర్ అయ్యారు.
Read Also: Miyazaki Mangoes: బాబోయ్.. రెండు మామిడి చెట్లకు అంత సెక్యురిటీనా.?
Also Read
- Rajya Sabha 2026: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు స్థానాలు
- Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
- Andhra Pradesh : ఏపీకి కేంద్రం భారీ నజరానా.. రూ.1,990 కోట్ల అర్బన్ చాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్.!
- OTR : ఉమ్మడి విశాఖ కూటమి పార్టీల్లో విచిత్ర ధోరణి
కాగా భీమవరం పెదఅమిరంలో ప్రధాని మోదీ పాల్గొన్న సభా వేదికపై మొత్తం 11 మందికి అవకాశం దక్కింది. అందులో గవర్నర్ హరిచందన్, సీఎం జగన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి రోజా, మెగాస్టార్ చిరంజీవి, ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర పర్యాటక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాలను నిర్వహించారు. అటు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ కార్యక్రమం గురించి పత్రికల్లో భారీ స్థాయిలో మంత్రి హోదాలో రోజా ప్రకటనలు ఇవ్వడం విశేషం.


తాజావార్తలు
-
Prakash Raj: కాక్రోచ్ జనతా పార్టీలో ప్రకాష్ రాజ్ ఎంట్రీ.. వైరల్ అవుతున్న వీడియో!
-
West Bengal: ప్రధాని మోడీకి ఝల్మురి వడ్డించిన షాప్ ఓనర్కి ప్రాణ భయం..! పాక్ నుంచి బెదిరింపులు..
-
Tiger Attack: ఘోరం.. తునికాకు కోసం అడవికి వెళ్లిన మహిళలపై పెద్దపులి దాడి.. నలుగురు మృతి
-
Aadarsha Kutumbam AK47:వెంకీ – త్రివిక్రమ్ క్రేజీ ప్రాజెక్ట్లో..మరో బ్యూటీ ఎంట్రీ..!
-
Cockroach Trend Goes Global: పాకిస్థాన్కు చేరిన బొద్దింకల ట్రెండ్.. పాక్లో “కాక్రోచ్” పేరుతో కొత్త పార్టీలు..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!