Minister Roja: ప్రతి పేద విద్యార్థికి కార్పొరేట్ స్థాయి విద్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే నెల్సన్ మండేలా చెప్పినట్లు ప్రతి ఒక్కరు విద్యను అభ్యసిస్తే రాష్ట్ర ప్రగతికి మూల స్తంభాలు అవుతారని, ఆయన మాటను ఆదర్శంగా తీసుకొని సీఎం జగన్ పనిచేస్తున్నారన్నారు మంత్రి ఆర్ కె.రోజా. ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసించాలని రాష్ట్రంలోనే ప్రతి స్కూళ్లను నాడు నేడు కార్యక్రమం ద్వారా అభివృద్ధి చేయడం జరుగుతోందన్నారు. ప్రతి పేద విద్యార్థి కార్పొరేట్ స్థాయిలో చదవడానికి, ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేయడం ద్వారా సంతోషంగా చదువుకోవడానికి వస్తున్నారన్నారు. నగిరి నియోజకవర్గం అమ్మ ఒడి చెక్కును తల్లిదండ్రులకు అందజేస్తున్న సందర్భంగా రాష్ట్ర క్రీడల టూరిజం శాఖ మంత్రి శ్రీమతి ఆర్కే రాజా మాట్లాడారు.
నగరి నియోజకవర్గ స్థాయిలో పుత్తూరు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో జగనన్న 3వ విడత అమ్మ ఒడి పథకం ద్వారా 27 కోట్లు 91 లక్షల చెక్కు ను మంత్రి రోజా తల్లి దండ్రులకు అందచేసారు. దీని ద్వారా 19వేల 958 మంది లబ్దిదారుల తల్లులకు ఈ అమ్మ బడి పధకం ద్వారా రూ 13 వేలు వారి ఖాతాల్లోకి చేరాయన్నారు. గతంలో ఆడపిల్లలు స్కూళ్లలో చదువుకుంటూ బాత్రూంకి వెళ్లాలంటే ఇంటికి వెళ్లేంతవరకు నరకయాతన పడే వారిని కానీ ఇప్పుడు మన ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ స్థాయి హంగులతో పాఠశాలలు ఉన్నాయని ఆమె అన్నారు. మన ముఖ్యమంత్రి జగన్ పెద్ద మనసుతో ఆలోచించి మన పాఠశాలలో చక్కటి బాత్రూమ్స్ అలాగే మినరల్ ఆరో వాటర్ ప్లాంట్ మంచి డెస్కులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
Also Read
- Sai Krishna Death Case: సాయికృష్ణ డెత్ కేసులో కీలక మలుపు.. లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని.!
- CM Chandrababu: పెట్టుబడుల కంటే ఆలోచనలే ముఖ్యం.. సీఐఐ సమ్మిట్పై సీఎం కీలక వ్యాఖ్యలు.!
- CM Chandrababu: రాజధాని నిర్మాణాల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తం.!
- Nagababu: జనసేన పార్టీ ఆ పార్లమెంట్ పరిధిలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది.. ఎమ్మెల్సీ నాగబాబు కీలక వ్యాఖ్యలు.!
ప్రతి విద్యార్థులకు రంగురంగుల యూనిఫామ్స్, షూస్ పాఠ్యపుస్తకాలు నోట్ బుక్స్ ఉచితంగా ఇస్తున్నారని, మధ్యాహ్నం పూట నాణ్యమైన ఆహారం పిల్లలకి పెడతారని చెప్పుకొచ్చారు. ఎంతోమంది ముఖ్యమంత్రుల్ని చూశారు కానీ ఈ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి ఎంతో ఆలోచనతో నాడు నేడు ప్రోగ్రాం ద్వారా ప్రతి ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతున్నారన్నారు. ఎవరికీ రాని ఆలోచనతో మన ముఖ్యమంత్రి ముందుకెళ్తున్నారు అని ఆమె తెలిపారు. ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి స్కూల్ కి ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టడం జరిగిందన్నారు. మన రాష్ట్రంలో ప్రతి మహిళ గుండె మీద చేయి పెట్టుకుని తనకు అండగా జగన్ ఉన్నాడని ధైర్యంగా బ్రతుకుతున్నారన్నారు. ఎందుకంటే వీరికి కావాల్సిన సౌకర్యాలను పెద్ద మనసుతో జగనన్న చేస్తున్నాడు కనుక వారు ఆనందంగా ఉన్నారని మంత్రి రోజా అన్నారు.
తాజావార్తలు
-
EV Push: ఢిల్లీలో సర్కార్ సంచలనం.. 2028 నుంచి పెట్రోల్ బైక్లపై కంప్లీట్ బ్యాన్!
-
శాకాహారులుగా మారిపోయాం!.. నభా నటేష్ సెన్సేషనల్ కామెంట్స్!
-
Arrears Release: బకాయిల క్లియరెన్స్.. తెలంగాణ ఉద్యోగులకు ఊరట!
-
Ketan Agarwal Case: చదువులో జీరో.. ఇంటర్ ఫెయిల్ తర్వాత సియా ఏం చేసిందంటే..!
-
Ponguleti Srinivas Reddy : హరీష్రావుకు మెంటల్ బ్యాలెన్స్ తప్పింది.. అసెంబ్లీ రద్దు ఎందుకు.?
ట్రెండింగ్
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!