Minister Roja: ప్రతి పేద విద్యార్థికి కార్పొరేట్ స్థాయి విద్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే నెల్సన్ మండేలా చెప్పినట్లు ప్రతి ఒక్కరు విద్యను అభ్యసిస్తే రాష్ట్ర ప్రగతికి మూల స్తంభాలు అవుతారని, ఆయన మాటను ఆదర్శంగా తీసుకొని సీఎం జగన్ పనిచేస్తున్నారన్నారు మంత్రి ఆర్ కె.రోజా. ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసించాలని రాష్ట్రంలోనే ప్రతి స్కూళ్లను నాడు నేడు కార్యక్రమం ద్వారా అభివృద్ధి చేయడం జరుగుతోందన్నారు. ప్రతి పేద విద్యార్థి కార్పొరేట్ స్థాయిలో చదవడానికి, ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేయడం ద్వారా సంతోషంగా చదువుకోవడానికి వస్తున్నారన్నారు. నగిరి నియోజకవర్గం అమ్మ ఒడి చెక్కును తల్లిదండ్రులకు అందజేస్తున్న సందర్భంగా రాష్ట్ర క్రీడల టూరిజం శాఖ మంత్రి శ్రీమతి ఆర్కే రాజా మాట్లాడారు.
నగరి నియోజకవర్గ స్థాయిలో పుత్తూరు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో జగనన్న 3వ విడత అమ్మ ఒడి పథకం ద్వారా 27 కోట్లు 91 లక్షల చెక్కు ను మంత్రి రోజా తల్లి దండ్రులకు అందచేసారు. దీని ద్వారా 19వేల 958 మంది లబ్దిదారుల తల్లులకు ఈ అమ్మ బడి పధకం ద్వారా రూ 13 వేలు వారి ఖాతాల్లోకి చేరాయన్నారు. గతంలో ఆడపిల్లలు స్కూళ్లలో చదువుకుంటూ బాత్రూంకి వెళ్లాలంటే ఇంటికి వెళ్లేంతవరకు నరకయాతన పడే వారిని కానీ ఇప్పుడు మన ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ స్థాయి హంగులతో పాఠశాలలు ఉన్నాయని ఆమె అన్నారు. మన ముఖ్యమంత్రి జగన్ పెద్ద మనసుతో ఆలోచించి మన పాఠశాలలో చక్కటి బాత్రూమ్స్ అలాగే మినరల్ ఆరో వాటర్ ప్లాంట్ మంచి డెస్కులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
Also Read
- Hidden Treasure : అడవిలో అర్థరాత్రి తవ్వకాలు.. గుప్తనిధుల కోసం ఫారెస్ట్ ఆఫీసర్లే వేట.?
- AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
- Atchannaidu: ఎరువుల అక్రమ రవాణాపై మంత్రి సీరియస్.. డీలర్లపై కఠిన చర్యలకు ఆదేశాలు
- Social Boycott: ఏపీలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను వెలివేసిన గ్రామ పెద్దలు.. ధిక్కరిస్తే రూ.2 లక్షల జరిమానా..!?
ప్రతి విద్యార్థులకు రంగురంగుల యూనిఫామ్స్, షూస్ పాఠ్యపుస్తకాలు నోట్ బుక్స్ ఉచితంగా ఇస్తున్నారని, మధ్యాహ్నం పూట నాణ్యమైన ఆహారం పిల్లలకి పెడతారని చెప్పుకొచ్చారు. ఎంతోమంది ముఖ్యమంత్రుల్ని చూశారు కానీ ఈ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి ఎంతో ఆలోచనతో నాడు నేడు ప్రోగ్రాం ద్వారా ప్రతి ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతున్నారన్నారు. ఎవరికీ రాని ఆలోచనతో మన ముఖ్యమంత్రి ముందుకెళ్తున్నారు అని ఆమె తెలిపారు. ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి స్కూల్ కి ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టడం జరిగిందన్నారు. మన రాష్ట్రంలో ప్రతి మహిళ గుండె మీద చేయి పెట్టుకుని తనకు అండగా జగన్ ఉన్నాడని ధైర్యంగా బ్రతుకుతున్నారన్నారు. ఎందుకంటే వీరికి కావాల్సిన సౌకర్యాలను పెద్ద మనసుతో జగనన్న చేస్తున్నాడు కనుక వారు ఆనందంగా ఉన్నారని మంత్రి రోజా అన్నారు.
తాజావార్తలు
-
Modi-Meloni: గంటల్లోనే కోట్లలో వ్యూస్.. ఇంటర్నెట్లో ప్రకంపనలు రేపుతున్న మెలోడీ వీడియో
-
Lenovo Legion Y900: కొత్త టాబ్లెట్ లెనోవో లెజియన్ Y900 విడుదల..144Hz డిస్ప్లే, 12,700mAh బ్యాటరీ
-
US-Iran War: ఇరాన్ యుద్ధంలో అమెరికాకు భారీ దెబ్బ.. 42 విమానాలు ధ్వంసం..
-
Splitsvilla: ‘ప్రేమ కావాలా? పైసా కావాలా?’: జియోహాట్స్టార్ తెలుగులో ‘ఎమ్టీవీ స్ప్లిట్స్విల్లా X6’ స్ట్రీమింగ్!
-
Hidden Treasure : అడవిలో అర్థరాత్రి తవ్వకాలు.. గుప్తనిధుల కోసం ఫారెస్ట్ ఆఫీసర్లే వేట.?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!