Andhra Pradesh: తాడేపల్లికి చేరిన ‘నగరి’ అసమ్మతి వ్యవహారం.. సీఎం జగన్కు మంత్రి రోజా ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో వర్గపోరు రోజురోజుకు పెరిగిపోతోంది. మంత్రి రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజవర్గంలో ఇటీవల వైసీపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. దీంతో నగరి నియోజకవర్గ అసమ్మతి వ్యవహారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి చేరింది. ఈ సందర్భంగా తన నియోజకవర్గంలో ఇటీవల జరిగిన పరిణామాలపై సీఎం జగన్కు మంత్రి రోజా ఫిర్యాదు చేశారు. చక్రపాణిరెడ్డి వర్గం నియోజకవర్గంలో తనను బలహీనపరుస్తోందని ఆమె ఆరోపించారు. ఈ అంశంపై ఇప్పటికే మంత్రి రోజా పలుమార్లు విమర్శలు చేశారు. తన నియోజకవర్గంలో తనను పక్కనపెట్టి అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు చక్రపాణిరెడ్డి వర్గంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Lemon Tea: రోజూ లెమన్ టీ తాగితే.. బోలెడు ప్రయోజనాలు
Also Read
- Ambati Rambabu: 'ఏడు జన్మలెత్తినా ఏం చేయలేవు'.. డిప్యూటీ సీఎం పవన్పై మాజీమంత్రి అంబటి ఫైర్
- Vijayawada: ఇంద్రకీలాద్రిపై ఘోరం.. వారం వ్యవధిలో ఆలయంలో రెండు భారీ స్కామ్లు!
- Family Suicide Case: "నా ఏటీఎం పిన్ ఇదే.. ఆ డబ్బులతోనే అంత్యక్రియలు చేయండి".. ఒకే కుటుంబంలో నలుగురు బలవన్మరణం!
- Road Accident: తిరుపతిలో ఘోరం.. లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొని ఏడాది చిన్నారి మృతి!
ఈనెల16న నగరి నియోజకవర్గంలోని నిండ్ర మండలం కొప్పేడులో ఆర్బీకేలు, వెల్నెస్ కేంద్రాలకు చక్రపాణిరెడ్డి వర్గం ప్రారంభోత్సవాలు చేసింది. ఈ అంశంపై ఆవేదన చెందుతూ మంత్రి రోజా ఓ ఆడియో విడుదల చేశారు. తాజాగా ఈ అంశాన్ని సీఎం జగన్ దృష్టికి మంత్రి రోజా తీసుకువెళ్లడంతో నగరి నియోజకవర్గంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనన్న ఆసక్తి నెలకొంది. 2019 ఎన్నికల తర్వాత తన నియోజకవర్గంలోని శ్రీశైలం దేవస్థానం ఛైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, వడమాలపేట జెడ్పీటీసీ సభ్యుడు మురళీధర్రెడ్డి, రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్ ఛైర్పర్సన్ కేజే శాంతి, నగరి మున్సిపల్ మాజీ ఛైర్మన్ కేజే కుమార్, పుత్తూరుకు చెందిన ఏలుమలై, విజయపురానికి చెందిన లక్ష్మీపతిరాజును మంత్రి రోజా దూరం పెట్టారు. వారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గీయులుగా ముద్రపడ్డారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో వైసీపీ తరఫున కార్యక్రమాలను రెండు వర్గాలు విడిగా చేస్తున్నారు. కొందరు నాయకులు పెద్దిరెడ్డి అండతో పదవులు పొందడం ఈ విభేదాలకు మరింత ఆజ్యం పోసింది. ఒకదశలో మంత్రి పెద్దిరెడ్డి కారణంగా రోజాకు మంత్రి పదవి కూడా రాదని ప్రచారం జరిగింది. కానీ సీఎం జగన్ అనూహ్యంగా రోజాకు కేబినెట్లో బెర్తు ఖరారు చేశారు.
తాజావార్తలు
-
Allu Arjun : సంధ్య థియేటర్ కేసు విచారణలో ట్విస్ట్.. హాజరైన అల్లు అర్జున్
-
UK: తదుపరి బ్రిటన్ ప్రధాని రేసులో బర్న్హామ్! భారత్కు లాభమా? నష్టమా?
-
Anil Ravipudi : అనిల్ రావిపూడి సినిమా పేరుతో భారీ మోసం.. నిర్మాతల సంచలన ప్రకటన!
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Tollywood : నేటివిటీ వదిలేస్తున్న తెలుగు సినిమాలు?
ట్రెండింగ్
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!