Minister PeddiReddy: 33 ఏళ్లలో కుప్పానికి టీడీపీ ఏం చేసింది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister PeddiReddy Ramachandra Reddy: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కుప్పం నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశాడో చెప్పలేని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారని మంత్రి పెద్దిరెడ్డి ఆరోపించారు. అభివృద్ధి చేసుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో ఎందుకు గెలవలేకపోయారని ప్రశ్నించారు. కోల్లుపల్లెలో వైసీపీ నేతలపై దాడి చేసింది టీడీపీ నేతలేనని.. వైసీపీ జెండాలను కట్టెలతో తొలగించింది టీడీపీ వాళ్లేనని మంత్రి పెద్దిరెడ్డి మీడియాకు వీడియోలు చూపించారు. 33 ఏళ్ళలో ఎన్నిసార్లు చంద్రబాబు కుప్పానికి వచ్చారో చెప్పాలన్నారు. పోనీ గత మూడేళ్లలో ఎన్నిసార్లు వచ్చారో చెప్పగలరా అని చంద్రబాబును నిలదీశారు. 15 సార్లు పర్యటించి తమపైన తిట్టేపని తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. కుప్పంలో చంద్రబాబు దౌర్జన్యాలతో గెలవాలని చూస్తున్నాడని.. అది జరగని పని అని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు కుప్పం వచ్చిన ప్రతీసారి అది బ్లాక్ డే అన్నారు. చంద్రబాబు మళ్లీ కుప్పంలో గెలిచేది కేవలం కలలో మాత్రమేనని అన్నారు.
Read Also: Japan : యువతను మందు కొట్టమని ప్రోత్సహిస్తున్న సర్కార్
Also Read
- IndiGo Flight : వాతావరణం దెబ్బకు ఇండిగో విమానం డైవర్ట్.. రాజమండ్రిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.!
- Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
- Chittoor: లిక్కర్ వ్యాన్ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం.!
- Parvathipuram Manyam: పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల బీభత్సం.. భయంతో వణికిపోతున్న రైతులు.!
రాయలసీమకు తీరని అన్యాయం చేసిన ఏకైక వ్యక్తి చంద్రబాబు అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హంద్రీనీవా బ్రాంచ్ కెనాల్ను పూర్తి చేసే తాము ఎన్నికలకు వెళ్తామని తెలిపారు. తనతో పాటు త అధినేతకు రకరకాల పేర్లు పెట్టి చంద్రబాబు శునకానదం పొందుతున్నాడని మండిపడ్డారు. కుప్పంలో టీడీపీ నేతలే దౌర్జన్యం చేస్తే చంద్రబాబు బురద తమపై చల్లుతున్నాడని ఆరోపించారు. రాజకీయాల్లో మామను వెన్నుపోటు పొడిచిన ఒక శుంట చంద్రబాబు అన్నారు. ఆయన ప్రపంచంలోనే పనికిమాలిన నాయకుడు అని విమర్శించారు. సీఎంను, డీజీపీని, తనను రమ్మని సవాల్ విసురుతూ తన స్ధాయికి దిగజారి మాట్లాడుతున్నాడని.. వైసీపీ నేతలకు తమ ఇళ్లపై జెండాలు కూడా ఏర్పాటు చేసుకునే హక్కు లేదా అని ప్రశ్నించారు. సెక్యూరిటీ పెంపు కోసం చంద్రబాబు ఇలాంటి డ్రామాలు ఆడారేమో అనిపిస్తుందన్నారు. కుప్పం ప్రజలపై చంద్రబాబుకు గౌరవం లేదని పెద్దిరెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో అన్ని సీట్లలో గెలిచేది తామేనని జోస్యం చెప్పారు. టీడీపీ నేతలు రెచ్చిపోతుంటే తాము చూస్తూ ఊరుకునేది లేదని.. తమ సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. కుప్పం నియోజకవర్గానికి తమ ప్రభుత్వం 10వేల ఇళ్లు కేటాయించిందని.. పంచాయతీలకు రూ.66 వేల కోట్ల నిధులు ఇచ్చిందని.. గత 33 ఏళ్లలో చంద్రబాబు ఏం చేశాడని పెద్దిరెడ్డి ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Sourav Ganguly: మమతకు మద్దతుగా యూసుఫ్ పఠాన్ను గంగూలీ రాజీనామా చేయమన్నారా..? ఇదిగో క్లారిటీ..
-
IND Vs AFG: అదరగొట్టిన భారత బ్యాటర్లు.. తొలిరోజే రెండు సెంచరీలు..
-
Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
-
Dimple Choudhary: ప్రముఖ డ్యాన్సర్తో అనుచిత ప్రవర్తన.. స్టేజ్పై కీచకుడి చెంపపగలగొట్టిన నర్తకి
-
Hyderabad Rains : హైదరాబాద్లో దంచికొడుతున్న వర్షం.. జలమయమైన రోడ్లు..!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!