PeddiReddy: వచ్చే ఎన్నికల్లో కుప్పంలోనూ చంద్రబాబు జెండా పీకేస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PeddiReddy: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నాడని.. సీఎంగా ఆయన చేసిన అభివృద్ధి కంటే జగన్ సహకారంతో తాను చేసిన అభివృద్ధే ఎక్కువ అని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. పండుగరోజు కూడా తనను గుర్తు పెట్టుకుని నారావారిపల్లిలో మాట్లాడాడు అని మండిపడ్డారు. పండుగరోజు కూడా చంద్రబాబు సంతోషంగా లేని పరిస్థితి కనిపిస్తోందన్నారు. అప్పుడు వైఎస్ఆర్, ఇప్పుడు జగన్పై చంద్రబాబు ఏడుపు కొనసాగుతోందన్నారు. 2019 నుంచే రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని చంద్రబాబు మర్చిపోయాడన్నారు.
Read Also: Anand Mahindra: నాటు నాటు అంత ఎనర్జీలేదు.. ఆనంద్ మహీంద్ర ట్వీట్ వైరల్
Also Read
- Rain Alert: కొనసాగుతోన్న అల్పపీడనం.. రాబోయే 24 గంటల్లో ఆ 13 జిల్లాలో వర్షాలు!
- TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
- YS Jagan: డీఎస్సీ అక్రమాలపై సీఎం చంద్రబాబుకు జగన్ ప్రశ్నలు.. 1-6 ట్విస్ట్లతో ఎక్స్లో పోస్టులు!
- Ganesh Idol Protest: 'వినాయకుడి'తో వినూత్న నిరసన.. దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా..?
చిత్తూరు జిల్లా నుంచి సీఎం అయిన చంద్రబాబు జిల్లాకు ఏం చేశాడో చెప్పాలని మంత్రి పెద్దిరెడ్డి డిమాండ్ చేశారు. పార్టీని అడ్డు పెట్టుకుని చంద్రబాబు కార్యకర్తలు గూండాయిజం చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. చంద్రబాబు తన శక్తి ఏంటో తెలుసుకుని మాట్లాడాలన్నారు. జగన్ సీఎం అయ్యాకా చంద్రబాబు సొంత జిల్లాలో పార్టీని నామరూపాలు లేకుండా చేశామన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీనే గెలుస్తుందన్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి కుప్పంను అభివృద్ధి చేయని వ్యక్తి చంద్రబాబు అని పెద్దిరెడ్డి ఆరోపించారు. చంద్రబాబు చేయలేని కుప్పం అభివృద్ధిని సీఎం జగన్ చేసి చూపుతున్నారన్నారు. కారు కూతలు కూస్తే సహించేందుకు సిద్ధంగా లేమన్నారు. చిత్తూరు జిల్లాకు నువ్వు భారమో, తాను భారమో ప్రజలే నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లాతో చంద్రబాబుకు సంబంధమే లేదన్నారు. కులాన్ని అడ్డుపెట్టుకుని పవన్ కళ్యాణ్ వెళ్తున్నాడని, ఆ కులానికి సంబంధించిన వంగవీటి రంగాను చంపించింది చంద్రబాబు కాదా అని నిలదీశారు. భోగి మంటల్లో కాల్చాల్సింది జీఓ నెం.1ను కాదు, సీఎం కావాలనే తాపత్రయాన్ని కాల్చుకోవాలన్నారు. కేఏ పాల్ తరహాలో చంద్రబాబు కలలు కంటున్నాడని పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో కూడా చంద్రబాబు జెండా పీకేస్తామన్నారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!