Peddi Reddy: చంద్రబాబు హయాంలో వర్షాలు పడలేదు.. రోడ్లు పాడు కాలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిత్తూరు జిల్లా పుంగనూరులో వైసీపీ ప్లీనరీ సమావేశం జరిగింది. ఇంధన, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ జిల్లా అధ్యక్షుడు భరత్, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, వేంకటేష్ గౌడ, జెడ్పీ ఛైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. కరోనా వల్ల గత రెండేళ్లు వైసీపీ ప్లీనరీ జరుపుకోలేకపోయామని..జూలై 8, 9 తేదీల్లో వైసీపీ ప్లీనరీ సమావేశం జరుగుతుందని తెలిపారు. 95 శాతం ఎన్నికల హామీలు పూర్తి చేసిన ఘనత సీఎం జగన్దే అన్నారు. 500 హామీలు ఇచ్చి మేనిఫెస్టో మాయం చేసిన ఘనత చంద్రబాబుదే అని మంత్రి పెద్దిరెడ్డి ఆరోపించారు.
వైసీపీలో ఏ సమస్యలు ఉన్నా నేరుగా తనకు సమాచారం అందిస్తే తక్షణం స్పందిస్తానని సూచించారు. తనపై బాధ్యతలు ఎక్కువగా ఉండటంతో నేరుగా గడప గడపకు వెళ్లలేకపోయానని తెలిపారు. తన తరపున ఇతర నాయకులు గడప గడపకు తిరుగుతున్నారని.. వైసీపీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలలోకి తీసుకెళ్లాలని మంత్రి పెద్దిరెడ్డి సూచించారు. కులం, మతం, పార్టీ చూడకుండా పేదరికం చూసి వైఎస్ జగన్ పథకాలు అందిస్తున్నారని ప్రశంసించారు. ఎన్నికల్లో ఓడిపోయినా వారిని జన్మభూమి కమిటీల్లో వేసిన వ్యక్తి చంద్రబాబు అని.. ఆ కమిటీల్లో వారు వాళ్లకు కావాల్సిన వారికి మాత్రమే పథకాలు ఇచ్చే వారని విమర్శలు చేశారు. ఆసరా కింద రూ.26 వేల కోట్లను నాలుగు విడతల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. గతంలో డ్వాక్రా రుణమాఫీ అని చెప్పి చంద్రబాబు మోసం చేశారన్నారు. తన ఇన్నేళ్ల రాజకీయ ప్రయాణంలో 95 శాతం హామీలు అమలు చేసిన వేరే ముఖ్యమంత్రిని తాను చూడలేదన్నారు. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు ఇచ్చేందుకు ఆరు జిల్లాలకు రూ.8 వేల కోట్లకు పైగా సీఎం జగన్ మంజూరు చేశారన్నారు. గండికోట నుంచి మనకు నీరు ఇచ్చేందుకు రూ. 2,700 కోట్లతో ప్రాజెక్టులు సిద్ధం చేస్తున్నామన్నారు. చంద్రబాబు హయాంలో అసలు వర్షాలు పడేవి కాదని.. అందుకే రోడ్లు పాడు అయ్యేవి కాదని మంత్రి పెద్దిరెడ్డి అభిప్రాయపడ్డారు. కానీ వైఎస్ జగన్ సీఎం అయ్యాక రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. అక్కడక్కడా రోడ్లు పాడైనా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.
Also Read
- 'Thara' Mantra: సైబర్ దొంగల వేటలో ‘టాలీవుడ్ తారలు’.. వైజాగ్ పోలీసుల ‘తార’ మంత్రం మామూలుగా లేదుగా!
- AP Govt: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. జూన్ 1వ తేదీ ఉదయం నుంచే ప్రారంభం..
- CM Chandrababu: చిట్చాట్లో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇది అనివార్యం..!
- Anakapalli Death Mystery: కొడుకు మృతిపై అనుమానం.. కన్నతల్లి కన్నీటి పోరు..
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..