Minister Narayana: అమరావతిపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
- రాజధాని నిర్మాణం కోసం రైతులు భూములిచ్చారు..
- చంద్రబాబు మీదున్న నమ్మకంతో రైతులు భూములిచ్చారు..
- అమరావతి రైతులకు కౌలును మరో ఐదేళ్లు ఇవ్వాలని నిర్ణయించాం: మంత్రి నారాయణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Narayana: రాజధాని నిర్మాణం కోసం రైతులు భూములిచ్చారు అని మంత్రి నారాయణ తెలిపారు. చంద్రబాబు మీదున్న నమ్మకంతో రైతులు భూములిచ్చారు.. గత ఐదేళ్ల కాలంలో రైతులు ఇబ్బంది పడ్డారు.. అమరావతి రైతులకు కౌలును మరో ఐదేళ్లు ఇవ్వాలని నిర్ణయించాం.. రైతు కూలీలకూ పెన్షన్లను మరో ఐదేళ్ల పాటు ఇవ్వాలని నిర్ణయం.. రాజధానిలో భూములు తీసుకున్న సంస్థలతో సంప్రదింపులు జరపనున్నామన్నారు. రాజధానిలో భూములు కేటాయించిన సంస్థలకు తమ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకే మరో రెండేళ్ల పాటు గడువు పొడిగించాం.. సోమ, మంగళవారాల్లో రాజధానిలో జంగిల్ క్లియరెన్స్ ప్రారంభించాం.. హ్యపీ నెస్ట్ ప్రాజెక్టుని తిరిగి ప్రారంభించాలని నిర్ణయించామని మంత్రి నారాయణ వెల్లడించారు.
Read Also: UPI Payment: యూపీఐ వినియోగదారులకు అలర్ట్.. ఆ రోజున చెల్లింపులు జరగవు.. కేవలం వారికే!
Also Read
- CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
- Machilipatnam: కామర్స్ లెక్చరర్ 'కామ లీలలు'.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
- AP Weather Alert : ఏపీలో నిప్పుల కుంపటి.. 8 జిల్లాలకు 'రెడ్ అలర్ట్' జారీ!.
- Rajya Sabha 2026: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు స్థానాలు
ఇక, సీఆర్డీఏలో 778 మంది ఉద్యోగులని నియమించుకుంటామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. సీఆర్డీఏ కోసం 32 మంది కన్సల్టెంట్లను తీసుకోవడానికి అథార్టీ నిర్ణయించింది.. 8,352.69 చదరపు కిలో మీటర్ల పరిధిలో సీఆర్డీఏ ఉండేలా నిర్ణయం తీసుకున్నాం.. గత ప్రభుత్వం 6993.20 చదరపు కిలో మీటర్లకు కుదించింది.. దీన్ని తిరిగి పాత విధానం మేరకు పరిధి ఉండాలని అథార్టీలో నిర్ణయించాం.. కోర్ క్యాపిటల్ ఏరియాను తిరిగి 217 చదరపు కిలోమీటర్ల ఉంచేలా నిర్ణయం తీసుకున్నాం.. సీడ్ క్యాపిటల్ నిర్మాణం విషయంలో సింగపూర్ ప్రభుత్వంతో ఉన్న ఒప్పందాన్ని గత ప్రభుత్వం రద్దు చేసింది అని నారాయణ ఆరోపించారు.
Read Also: Bombay High Court: “పాకిస్తాన్ లేదా గల్ఫ్ కంట్రీకి వెళ్లండి”.. శరణార్థిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం..
అలాగే, సీడ్ క్యాపిటల్ నిర్మాణం విషయంలో తిరిగి సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో సంప్రదింపులు జరపాలని నిర్ణయం తీసుకున్నట్లు నారాయణ చెప్పుకొచ్చారు. కరకట్ట రోడ్ నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టాలని నిర్ణయించాం.. కరకట్ట నాలుగు లేన్ల నిర్మాణం చేపట్టనున్నాం.. క్యాపిటల్ సిటీ ఎంత వరకు ఉంటే.. అంత వరకు కరకట్ట రోడ్ నిర్మాణం ఉంటుంది. అమరావతిలోని ఈ-5,11,13,15 రోడ్లను ఎన్ హెచ్ కు కలిపేలా చర్యలు తీసుకుంటాం.. అమరావతికి ఈఆర్ఆర్, ఓఆర్ఆర్లు ఉంటాయి.. అమరావతిని కనెక్ట్ చేసేలా కృష్ణా నదిపై ఆరు బ్రిడ్జిలు వచ్చేలా చర్యలు.. ఐకానిక్ బ్రిడ్జిల నిర్మాణమే చేపట్టనున్నామని మంత్రి నారాయణ తెలిపారు.
తాజావార్తలు
-
Natural Hair Tonic : పలుచటి జుట్టుకు గుడ్బై.. ఇంట్లోనే తయారయ్యే మ్యాజికల్ హెయిర్ టానిక్.!
-
Cabbage Egg Sandwich : కొరియన్ స్ట్రీట్ స్టైల్ ‘క్యాబేజీ ఎగ్ శాండ్విచ్’.. 5 నిమిషాల్లో పిల్లల లంచ్ బాక్స్ కోసం సూపర్ రెసిపీ.!
-
Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
-
SRH vs RCB: 300+ లోడింగ్.. మొదట బ్యాటింగ్ చేయనున్న కాటేరమ్మ కొడుకులు.!
-
CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!