Minister Narayana: చెత్త పన్ను వేసిన చెత్తను తొలగించని చెత్త ప్రభుత్వం వైసీపీ
- మచిలీపట్నంలో లెగసీ వేస్ట్ డంపింగ్ యార్డును పరిశీలించిన మంత్రి నారాయణ..
- 72 లక్షల టన్నుల చెత్తను తొలగించగా, మరో 13 లక్షల టన్నులు మిగిలింది..
- చెత్త పన్ను వేసిన చెత్తను తొలగించని చెత్త ప్రభుత్వం వైసీపీ: మంత్రి నారాయణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Narayana: మచిలీపట్నంలో లెగసీ వేస్ట్ డంపింగ్ యార్డును మంత్రి నారాయణ పరిశీలించారు. చెత్తను బయో మైనింగ్ చేస్తున్న విధానాన్ని మున్సిపల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు అదేశాలు ప్రకారం అక్టోబర్ 2వ తేదీ నాటికి రాష్ట్రంలో లెగసీ వేస్ట్ ను పూర్తిగా తొలగిస్తాం.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి 85 లక్షల లెగసీ వేస్ట్ ఉంది.. ఇప్పటి వరకూ 72 లక్షల టన్నుల చెత్తను తొలగించగా మరో 13 లక్షల టన్నుల చెత్త మిగిలి ఉంది.. మచిలీపట్నంలో మొత్తం 42 వేల టన్నుల చెత్తకు గాను 19 వేల టన్నులు పూర్తిగా తొలగించాం.. ఇక్కడ అదనంగా మెషీన్లు ఏర్పాటు చేసి త్వరితగతిన చెత్త తొలగించేలా ఏర్పాట్లు చేస్తున్నామని పొంగూరు నారాయణ తెలిపారు.
Read Also: Niharika : చనిపోయే ముందు చివరి క్షణంలా ఉంది.. నిహారిక కొణిదెల పోస్ట్ వైరల్
Also Read
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
- Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
- AP Govt: రైతులకు, భూ యజమానులకు బిగ్ రిలీఫ్.. మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం..
- Pawan Kalyan: ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు లక్ష్యం.. జల్ జీవన్ మిషన్పై పవన్ కీలక ఆదేశాలు
ఇక, గత ప్రభుత్వం అప్పులతో పాటు 85 లక్షల టన్నుల చెత్త కూడా వదిలి వెళ్ళిపోయిందని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. చెత్త పన్ను వేసినా చెత్తను తొలగించని చెత్త ప్రభుత్వం వైసీపీది అని మండిపడ్డారు. ప్రజలకు రోగాలకు కారణమయ్యే ఘన,ద్రవ వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేలా ప్లాంట్ లు ఏర్పాటు చేస్తున్నాం.. స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ద్వారా సీఎం చంద్రబాబు చెత్త నిర్వహణపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.. రాష్ట్రంలో ప్రతి రోజూ వచ్చే 7500 టన్నుల సాలిడ్ వేస్ట్ కోసం వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల్ ఏర్పాటు చేస్తున్నాం.. ద్రవ వ్యర్థాల నిర్వహణ కోసం రాబోయే రెండేళ్లలో వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ లు ఏర్పాటు చేస్తున్నామని నారాయణ వెల్లడించారు.
తాజావార్తలు
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
-
Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్కు గుడ్బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!