Kodali Nani: చంద్రబాబును సీఎం చేయడం పచ్చ మీడియా వల్ల కాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. విదేశాలకు ఏపీ దాన్యం ఎగుమతి అవుతోందని.. కిలో రూ.25కే ప్రభుత్వం ఎగుమతి చేస్తోందని చంద్రబాబు తోక పత్రికలో రాశారని… రైతుల శ్రమను దోచుకుంటున్నారని ఆరోపణలు చేశారని మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. చంద్రబాబును సీఎం చేయాలనే ఇలాంటి తప్పుడు రాతలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును సీఎం చేసేవరకు ఆయనకు తోకలుగా ఉన్న పార్టీలు, తపించే పత్రికలకు నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు.
సీఎం జగన్ గారిని భ్రష్టు పట్టించాలని కంకణం కట్టుకున్నారని.. కాకినాడ నుంచి ఎగుమతి అయ్యే బియ్యం ఒక్క ఏపీ నుంచే కాదు బీహార్, ఒడిశా, తమిళనాడు, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల నుంచి కూడా ఎగుమతి అవుతున్నట్లు మంత్రి కొడాలి నాని గుర్తుచేశారు. తమ ప్రభుత్వం వచ్చాక అనేక మార్పులు చేశామని.. రైతులు ఏ పంట వేశారో ఈ క్రాప్ బుకింగ్ చేస్తున్నామని తెలిపారు. అన్ని రికార్డులు ఆన్లైన్లోనే ఉంటాయన్నారు. గతంలో ధాన్యాన్ని మిల్లులో కొనుగోలు చేస్తే తాము రైతు భరోసా కేంద్రాల్లో కొనుగోలు చేస్తున్నామని పేర్కొన్నారు. పేదల కోసం పనిచేసే సీఎంపై ఇన్ని అబద్ధాలు ప్రచారం చేయడం దారుణమన్నారు. విజయవాడలో బెంజ్ సర్కిల్ వద్ద ఫ్లైఓవర్ను తమ ప్రభుత్వం వచ్చాక మంజూరు చేయించి పూర్తి చేశామన్నారు. మొత్తం 51 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసింది చంద్రబాబుకి కనపడటం లేదా అని ప్రశ్నించారు. సీఎం జగన్ బలపడతారని చంద్రబాబు దొంగ ఏడుపులు ఏడుస్తున్నాడని ఆరోపించారు. చంద్రబాబు ఎంతమంది డీజీపీలను, ఎంతమంది చీఫ్ సెక్రటరీలు మార్చాడో చెప్పాలన్నారు.
Also Read
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
సవాంగ్ గారు వచ్చి చాలా కాలమైందని.. వేరే వారికి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం డీజీపీని మార్చిందని కొడాలి నాని వివరణ ఇచ్చారు. ప్రజలు అమాయకులు కాదని.. జగన్ గారిని భ్రష్టు పట్టించడం చంద్రబాబు వల్ల కాదని కొడాలి నాని అన్నారు. ఎన్టీఆర్ చావుకు కారణమై సీఎం పదవి తెచ్చుకుని.. దానిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు కుబేరుడు అయ్యాడని కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. వివేకా హత్య కేసులో ఛార్జిషీట్ విషయంలో ఎవరికి నచ్చిన అంశం వాళ్లు బయటకు తెస్తున్నారని.. ఆరోజు జగన్ కేసులో అప్పుడున్న జేడీ కూడా తమకు కావాల్సిన పత్రికలకు లీకులు ఇచ్చేవాడని ఆరోపించారు. వివేకాను హత్య చేయిస్తే జగన్కు ఏం వస్తుందని కొడాలి నాని ప్రశ్నించారు. వాళ్లు దేవుడిని నమ్ముకున్న కుటుంబం అని.. అలాంటి కుటుంబాన్ని రోడ్డుమీదకు లాక్కొచ్చిన వాళ్లు టీడీపీ వాళ్లు అని మండిపడ్డారు. పదవులు శాశ్వతం కాదు అని.. చరిత్ర శాశ్వతం అని చంద్రబాబు గుర్తించాలన్నారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్ తరహాలో జగన్ కూడా చరిత్రలో నిలిచే పనులు చేస్తున్నారని కొనియాడారు. కొడుకును ఎమ్మెల్యేగా, కుప్పంలో సర్పంచ్ను గెలిపించుకోలేని వ్యక్తి సొల్లు పురాణం చెప్తున్నాడని చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
8849 Tank 5: ప్రొజెక్టర్తో 8849 ట్యాంక్ 5 స్మార్ట్ఫోన్ విడుదల.. 17,600mAh భారీ బ్యాటరీ, 3K డిస్ప్లే
-
Billa Ranga Baasha : 2209 ప్రపంచంలో కిచ్చా సుదీప్ యాక్షన్.. ‘బిల్లా రంగ బాషా’ నుంచి బిగ్ అప్డేట్!
-
Rajasthan ATS: జైష్ స్లీపర్ సెల్ అనుమానిత మహిళ అరెస్టు.. ఆన్లైన్లో పాకిస్తానీ ఉగ్రవాదిని వివాహం చేసుకున్నట్లు వెల్లడి
-
Astrology: స్నేహానికి ఎక్కువ విలువ ఇచ్చే 4 రాశులు వీరేనా? ఫ్రెండ్ కోసం ఎంత దూరమైనా వెళ్తారట!
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!