Minister Karumuri Nageswara Rao: వినియోగదారులను మోసం చేస్తే అంతే..! తొలిసారి రూ.10 లక్షలు, రెండోసారి రూ.50 లక్షల ఫైన్, ఐదేళ్ల జైలు శిక్ష
ఎక్కడైనా వినియోగదారులను మోసం చేస్తే కఠిన శిక్షలు, భారీ జరిమానాలు తప్పవని హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి కార్మూరి నాగేశ్వరరావు.. జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో వినియోగదారుడు మోసపోయిన ప్రాంతానికే వెళ్లి ఫిర్యాదు చేయాల్సి వచ్చేది.. కానీ, ఇప్పుడు ఎక్కడి నుంచి అయినా ఫిర్యాదు చేయవచ్చు అన్నారు.. ఆన్లైన్ ద్వారా కూడా వినియోగదారులు ఫిర్యాదు చేయవచ్చని వెల్లడించిన ఆయన.. టీ పొడిలో కల్తీ, కందిపప్పుకు రంగు వేయడం, పెట్రోల్ కల్తీ చేయడం వంటివి జరిగితే లీగల్ మెట్రాలజీ అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.. ఇక, ఇటీవల మాల్స్ పై దాడులు జరిపి 194, బంగారం షాపులపై తనిఖీలు చేసి 94, పెట్రోల్ బంకులపై 90, ఎరువుల షాపులపై తనిఖీలు జరిపి 360కేసులు నమోదు చేశామని వెల్లడించారు.
Read Also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
Also Read
- Gudivada Amarnath: డేటా సెంటర్పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
- Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
- Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
ఇక, వినియోగదారులను మోసం చేస్తే జైలు శిక్షతో పాటు.. భారీ జరిమానా తప్పదని హెచ్చరించారు మంత్రి నాగేశ్వరరావు.. మొదటిసారి తనిఖీల్లో పట్టుబడితే సంవత్సరం జైలు శిక్ష, పది లక్షల రూపాయల జరిమానా విధిస్తున్నామని తెలిపారు. రెండు సార్లు పట్టుబడితే 50 లక్షల రూపాయల జరిమానాతో పాటు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తున్నామని గుర్తుచేశారు.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వినియోగదారుల సంక్షేమ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు.. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నామని.. వినియోగదారులకు ఏ రకంగా నష్టం కలిగించినా చర్యలు తప్పవని హెచ్చరించారు పౌర సరఫరాల శాఖ మంత్రి కార్మూరి నాగేశ్వరరావు.
తాజావార్తలు
-
West Bengal Assembly Election 2026: చివరి దశ ఓటింగ్కు సిద్ధమైన బెంగాల్.. భవానీపుర్లో మమతా-సువేందు ఫేస్ ఆఫ్
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో