Jogi Ramesh: ఒక పక్క రెక్కీ.. మరో పక్క రాయి.. ఇద్దరివీ నాటకాలే..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jogi Ramesh: టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్పై రాళ్ల దాడి జరిగిన అంశంపై మంత్రి జోగి రమేష్ స్పందించారు. చంద్రబాబు సరికొత్త నాటకానికి తెరతీశాడని ఆరోపించారు. ఆయన విషపు రాజకీయ కుట్రలో ఇది ఒక కోణమని.. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు తనపై తానే రాయి విసిరించుకున్నాడని మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. జగన్ దమ్మున్న నాయకుడు అని.. తనను అరెస్ట్ చేసి జైలుకు పంపినా సంయమనంతో వ్యవహరించి ప్రజల మనసులను గెలుచుకున్నారని ప్రశంసించారు. వచ్చే ఎన్నికల్లో తమ నాయకుడి లక్ష్యం 175కి 175 సీట్లు అని.. ఈ లక్ష్యం దిశగా తాము పనిచేస్తున్నామని.. అంతేకానీ దిక్కుమాలిన రాజకీయాలు చేసి చంద్రబాబుపై రాళ్లు వేయించాల్సిన పని లేదని మంత్రి జోగి రమేష్ అన్నారు.
Read Also: దేశంలోని ఈ ఉన్నత పదవులు పొందాంటే ఎంత వయసు ఉండాలి?
Also Read
- IndiGo Flight : వాతావరణం దెబ్బకు ఇండిగో విమానం డైవర్ట్.. రాజమండ్రిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.!
- Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
- Chittoor: లిక్కర్ వ్యాన్ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం.!
- Parvathipuram Manyam: పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల బీభత్సం.. భయంతో వణికిపోతున్న రైతులు.!
ఒక పక్క రెక్కీ, రెండో పక్కేమో రాయి అంటూ టీడీపీ, జనసేన నేతలు కుట్ర అంటూ గోల చేస్తున్నారని.. కానీ తెలంగాణ పోలీసులు కొంతమంది తప్పతాగి చేసిన గలాటాగా తేల్చారని మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు చంద్రబాబు రాయి అంటూ కొత్త రాగం అందుకున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు రాయి ఎవరితో వేయించుకున్నాడో తాము తేలుస్తామన్నారు. ఆయన బండారం బయటపెడతామని.. ఎన్టీఆర్ హయాంలో మల్లెల బాబ్జీ ఎపిసోడ్లో ఏం చేశారో ప్రజలకు తెలియదా అని ప్రశ్నించారు.
పార్ట్-1 పవన్ డ్రామా ఎపిసోడ్.. పార్ట్-2 చంద్రబాబు డ్రామా ఎపిసోడ్ జరిగాయని.. రేపు పార్ట్-3గా ఇప్పడటం ఎపిసోడ్ ఉంటుందని మంత్రి జోగి రమేష్ చురకలు అంటించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడబలుక్కుని చేస్తున్నా డ్రామాలు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు దుమ్ముంటే 175 స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుందని ప్రకటించాలని సవాల్ విసిరారు. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ చెప్పగలడా అని.. ముఖ్యమంత్రి అభ్యర్థిని తానే అని చెప్పగల ధైర్యం ఉందా అని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. చంద్రబాబు ఎపిసోడ్లో కథా, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఎవరిదో తేలుస్తామన్నారు. బీజేపీ నాలుగు రాష్ట్రాలను కూల్చే ప్రయత్నం చేస్తుందని కేసీఆర్కు ఏమైనా సమాచారం ఉందేమో కానీ మాకైతే ఎటువంటి సమాచారం లేదని మంత్రి జోగి రమేష్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
The Earth: భూగర్భ జలాల దోపిడి.. 31.5 అంగుళాలు వంగిన భూమి!
-
CJI Surya Kant: లండన్లో సీజేఐ సూర్యకాంత్కు అవమానం.. ‘కాక్రోచ్’ వ్యాఖ్యలపై నిరసనలు
-
IndiGo Flight : వాతావరణం దెబ్బకు ఇండిగో విమానం డైవర్ట్.. రాజమండ్రిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.!
-
SKY: కెప్టెన్సీ తప్పించడంపై సూర్యకుమార్ యాదవ్ ఎమోషనల్.. ఫస్ట్ రియాక్షన్ ఇదే..
-
Stree Ride : మహిళల కోసం ‘స్త్రీ రైడ్’.. ఇక డ్రైవర్ కూడా మహిళే..!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!