AP Capitals: విశాఖతో పాటు అమరావతి కూడా బాగుండాలి.. అదే మా కోరిక
విశాఖపట్నంతో పాటు అమరావతి కూడా బాగుండాలి అనేది తమ కోరిక అన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్.. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రైతుల రిట్ పిటిషన్ పై న్యాయస్ధానం ఇచ్చిన అర్డర్ అనుసరించాల్సి ఉందన్నారు.. 17 మంది ప్రజా ప్రతినిధులు, అధికారులను పిటిషన్ లో పొందుపరిచారు.. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను తెలపడానికి సీనియర్ కౌన్సిల్ తో వచ్చామని.. రేపు మధ్యాహ్నం న్యాయస్ధానం వాదనలు వింటామన్నదని తెలిపారు.. ప్రజల ఆకాంక్షలను, ప్రజా ప్రతినిధులుగా మేం చెప్పకుండా ఎలా ఉంటాం? అని ప్రశ్నించిన ఆయన.. ప్రజల ఆలోచనా విధానం మేం చెప్పడానికి వచ్చాం.. మేం కూడా అవసరం అయితే ఇంప్లీడ్ అవుతామని మా ప్రాంత నాయకులు వచ్చారని తెలిపారు..
Read Also: Fake Currency Notes From ATM: ఏటీఎం నుంచి చిల్డ్రన్ బ్యాంక్ నోట్లు.. కంగుతిన్న కస్టమర్..
Also Read
- CM Chandrababu : గ్లోబల్ బ్రాండ్లుగా స్థానిక ఉత్పత్తులు.. ఏపీలో ప్రొడక్ట్ పర్ఫెక్షన్ క్లస్టర్లపై చంద్రబాబు సమీక్ష
- YS Jagan : విజయ్కు జగన్ అభినందనలు.. 'తొలి అడుగులోనే అద్భుతం' అంటూ ట్వీట్.!
- Pawan Kalyan : విజయ్'ని మనసారా అభినందిస్తున్నా
- Andhra Pradesh: ఉద్యోగులకు సర్కార్ గుడ్న్యూస్.. అర్హులందరికీ పూర్తి స్థాయి పదోన్నతులు..
ఇక, పాదయాత్ర విరామ సమయంలో 25 మంది దగ్గర కూడా ఐడీ కార్డులు లేవని ఆరోపించారు మంత్రి గుడివాడ అమర్నాథ్.. కోర్టు ఇచ్చిన ఆదేశాలను బైపాస్ చేస్తూ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని విమర్శించిన ఆయన.. ప్రజలకు మేం సమాధానం చెప్పాలి.. ప్రజా ప్రతినిధులుగా మా చేతనైన కంట్రోల్ మేం చేస్తున్నాం.. విశాఖతో పాటు అమరావతి కూడా బాగుండాలని మేం కోరుకుంటున్నాం అని స్పష్టం చేశారు.. రెచ్చగొట్టేలా ఏ పని చేయద్దని మేం అంటున్నాం.. కానీ, ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.. ఇదే సమయంలో.. వికేంద్రీకరణకు మద్దతు తెలిపి.. అమరావతి బాగుండాలి అంటే కాలు కింద పెట్టనీయకుండా పాదయాత్ర చేస్తున్నవారిని అరసవిల్లి వరకు తీసుకెళ్తామని ప్రకటించారు మంత్రి గుడివాడ అమర్నాథ్.. కాగా, అమరావతి మహా పాదయాత్ర రద్దు చేయాలంటూ దాఖలైన అనుబంధ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది.. పాదయాత్ర రద్దు పిటిషన్ తో పాటు దాఖలైన అన్ని పిటిషన్లపై రేపు మధ్యాహ్నం వాదనలు వింటామని తెలిపింది హైకోర్టు.. సంఘీభావం తెలపడానికి వచ్చే వారికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ను సవరించాలంటూ కోర్టును కోరారు పిటిషనర్ తరపు న్యాయవాదులు.. అయితే, హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని మరోసారి ధర్మాసనం స్పష్టం చేసింది.. పాదయాత్రలో అనుమతించిన 600 మాత్రమే పాల్గొనాలని తేల్చిచెప్పింది హైకోర్టు.
తాజావార్తలు
-
Election Results 2026: తమిళనాడులో హంగ్కే అవకాశం..! 4 రాష్ట్రాలు+UT ఎన్నికల ఫలితాలు.. మినిట్స్ టు మినిట్స్ అప్డేట్స్..
-
Bengal Election Results Live Updates: బెంగాల్ బాద్షా బీజేపీ..! టీఎంసీకి మరో షాక్..! అప్డేట్స్ మీకోసం..
-
Ranabaali : లక్షకు పైగా రీల్స్ తో ట్రెండ్ అవుతున్న “రణబాలి” ‘ఏందయ్య సామీ..’ సాంగ్/
-
Vijay – Trisha: అసలు విజయ్ – త్రిషల మధ్య ఏముంది?
-
Duvvada Madhuri : త్రిష కోరికతో పాటు నా కోరిక కూడా నెరవేరింది
-
Jofra Archer: అద్భుతం.. విజయ్ గెలుపును ముందే ఊహించి ట్వీట్ చేసిన క్రికెటర్ జోఫ్రా ఆర్చర్..
-
Mumbai Indians: ఐపీఎల్లో వరుస ఓటములు.. అయినా ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్…
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!