Botsa Satyanarayana: అమాయక ప్రజలను చంపేస్తే చూస్తూ ఊరుకోవాలా..? జీవో ఒక్కసారి చదువుకోండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Botsa Satyanarayana: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్న సభల్లో కందుకూరులో 8 మంది మృతిచెందిన ఘటన మరువక ముందే, గుంటూరులో ముగ్గురు మృతిచెందారు.. ఇక, ఆ తర్వాత రోడ్లపై బహిరంగసభలు, ర్యాలీలను నిషేధిస్తూ వైఎస్ జగన్ సర్కార్ జీవో నంబర్ 1ని విడుదల చేసింది.. అయితే, దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.. అయితే, ఈ వ్యవహారంపై విపక్షాలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ.. చంద్రబాబు పర్యటనలకు లక్షలాది మంది ప్రజలు వస్తుంటే ప్రభుత్వం అడ్డుకుంటున్నట్లు ప్రచారం చేస్తున్నారు.. జీవో నంబర్ 1 ద్వారా ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారని అంటున్నారు.. ఈ జీవోను ఒకసారి ప్రతిపక్షాలు చదువుకోవాలని హితవుపలికారు. జీవోలో ఎక్కడైనా సమావేశాలు, ర్యాలీలను నిషేధించినట్లు ఉందా? అని ప్రశ్నించారు.. రోడ్ల మీద బహిరంగ సభలు పెట్టవద్దు అని మాత్రమే ఉంది.. మరీ అవసరమైతే అనుమతి తీసుకుని పెట్టండి అని ఉందని చెప్పుకొచ్చారు.
Read Also: Kamareddy Collector: అపోహలొద్దు.. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై కలెక్టర్ క్లారిటీ..
Also Read
- Sai Krishna Custodial Death: సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.. సిట్ దర్యాప్తు ముమ్మరం!
- YCP Protest: ఉరవకొండలో ఉద్రిక్తత.. పోలీసుల అదుపులో మాజీ ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీ!
- YS Jagan: ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే అరెస్టులు: వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
- AP Govt: ఆంధ్రప్రదేశ్ రైతులకు భారీ శుభవార్త.. రూ. 50 వేల వరకు వడ్డీ లేని రుణం..
చంద్రబాబు అబద్దాల కోరు అని ప్రజలకు తెలుసు అంటూ మండిపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ.. కందుకూరు సభలో 8 మంది చనిపోతే చంద్రబాబు బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పలేదన్న ఆయన.. అమాయక ప్రజలను చంపేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా..? ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది.. అందుకే జీవో నంబర్ 1ని తీసుకొచ్చాం… అనుమతులు తీసుకొని.. ప్రజలకు ఇబ్బందులు లేని చోట సభలు నిర్వహించుకోవచ్చు అన్నారు.. ఇక, వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలు, సభల సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే వాళ్లం అని వెల్లడించారు. ప్రతిపక్షాలు ఇప్పటికైనా మైండ్ సెట్ మార్చుకోవాలి.. అధికార పక్షం, ప్రతిపక్షాలు ప్రజలకు బాధ్యతగా ఉండాలని సూచించారు మంత్రి బొత్స సత్యనారాయణ.
తాజావార్తలు
-
Bankipur Results: బీజేపీ కంచుకోటలో సంచలనం.. భారీ ఆధిక్యంలో దూసుకెళ్తున్న ప్రశాంత్ కిషోర్
-
7050mAh భారీ బ్యాటరీ, 6.83 అంగుళాల కర్వ్డ్ OLED డిస్ప్లే, 50MP Sony కెమెరాతో రానున్న vivo S2.!
-
Sai Krishna Custodial Death: సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.. సిట్ దర్యాప్తు ముమ్మరం!
-
Rakhi Sawant: నేను ముస్లింనో కాదో నిర్ణయించడానికి మీరెవరు?.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన రాఖీ సావంత్ ..
-
Team India-BCCI: టీమిండియాలో పెరుగుతున్న గాయాల బెడద.. బీసీసీఐ కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
Mushroom Onion Pakoda: ఈజీ స్నాక్ రెసిపీ..10 నిమిషాల్లో కరకరలాడే ‘మష్రూమ్ ఆనియన్ పకోడీ’.! చేసేయండి ఇలా..
-
Mumbai Indians Captain: ముగ్గురు దిగ్గజాల సపోర్ట్.. తెలుగు ఆటగాడికి ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ!
-
ప్రీమియం ఫీచర్లు బడ్జెట్ ధరలో.. 50MP OIS కెమెరా, సూపర్ AMOLED డిస్ప్లేతో Samsung Galaxy F70 Pro 5G లాంచ్..!
-
Best Cricketing Brain: ఎంఎస్ ధోనీ కాదు, అతడే బెస్ట్ క్రికెటింగ్ బ్రెయిన్.. ఆ టీమిండియా మాజీ స్టార్ ఎవరంటే?
-
Tata దూకుడు మాములుగా లేదుగా.. Nexon నుంచి ప్రీమియం Avinya X వరకు భారీ ప్లాన్..!