Botsa Satyanarayana: అమాయక ప్రజలను చంపేస్తే చూస్తూ ఊరుకోవాలా..? జీవో ఒక్కసారి చదువుకోండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Botsa Satyanarayana: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్న సభల్లో కందుకూరులో 8 మంది మృతిచెందిన ఘటన మరువక ముందే, గుంటూరులో ముగ్గురు మృతిచెందారు.. ఇక, ఆ తర్వాత రోడ్లపై బహిరంగసభలు, ర్యాలీలను నిషేధిస్తూ వైఎస్ జగన్ సర్కార్ జీవో నంబర్ 1ని విడుదల చేసింది.. అయితే, దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.. అయితే, ఈ వ్యవహారంపై విపక్షాలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ.. చంద్రబాబు పర్యటనలకు లక్షలాది మంది ప్రజలు వస్తుంటే ప్రభుత్వం అడ్డుకుంటున్నట్లు ప్రచారం చేస్తున్నారు.. జీవో నంబర్ 1 ద్వారా ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారని అంటున్నారు.. ఈ జీవోను ఒకసారి ప్రతిపక్షాలు చదువుకోవాలని హితవుపలికారు. జీవోలో ఎక్కడైనా సమావేశాలు, ర్యాలీలను నిషేధించినట్లు ఉందా? అని ప్రశ్నించారు.. రోడ్ల మీద బహిరంగ సభలు పెట్టవద్దు అని మాత్రమే ఉంది.. మరీ అవసరమైతే అనుమతి తీసుకుని పెట్టండి అని ఉందని చెప్పుకొచ్చారు.
Read Also: Kamareddy Collector: అపోహలొద్దు.. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై కలెక్టర్ క్లారిటీ..
Also Read
- CM Chandrababu : విజయాలకు కారణమైన కార్యకర్తలకు శాశ్వతంగా రుణపడి ఉంటా
- CM Chandrababu : ఎన్టీఆర్కు ‘భారతరత్న’ డిమాండ్.. మహానాడులో చారిత్రాత్మక తీర్మానం!
- Nara Lokesh : మహిళలకు రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు..
- Motkupalli Narasimhulu: ఎన్టీఆర్ను గుర్తుచేసుకుంటూ మోత్కుపల్లి భావోద్వేగం.. “మనసున్న నాయకుడిని మళ్లీ చూడలేం”
చంద్రబాబు అబద్దాల కోరు అని ప్రజలకు తెలుసు అంటూ మండిపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ.. కందుకూరు సభలో 8 మంది చనిపోతే చంద్రబాబు బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పలేదన్న ఆయన.. అమాయక ప్రజలను చంపేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా..? ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది.. అందుకే జీవో నంబర్ 1ని తీసుకొచ్చాం… అనుమతులు తీసుకొని.. ప్రజలకు ఇబ్బందులు లేని చోట సభలు నిర్వహించుకోవచ్చు అన్నారు.. ఇక, వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలు, సభల సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే వాళ్లం అని వెల్లడించారు. ప్రతిపక్షాలు ఇప్పటికైనా మైండ్ సెట్ మార్చుకోవాలి.. అధికార పక్షం, ప్రతిపక్షాలు ప్రజలకు బాధ్యతగా ఉండాలని సూచించారు మంత్రి బొత్స సత్యనారాయణ.
తాజావార్తలు
-
CM Chandrababu : విజయాలకు కారణమైన కార్యకర్తలకు శాశ్వతంగా రుణపడి ఉంటా
-
Heatwave : అలసట, చిరాకు, నిద్రలేమి, ఒత్తిడి, చర్మ సమస్యలు.. ఇది ఎండాకాలం కాదు బాబోయ్.. రోగాల కాలం!
-
CM Chandrababu : ఎన్టీఆర్కు ‘భారతరత్న’ డిమాండ్.. మహానాడులో చారిత్రాత్మక తీర్మానం!
-
CM Revanth Reddy : తెలంగాణ ప్రజలకు గుడ్న్యూస్.. ప్రతి పౌరుడికి సమగ్ర సంక్షేమ కార్డ్
-
Terror Plot: ఢిల్లీ, పంజాబ్లో భారీ దాడులకు కుట్ర.. పాక్ పన్నాగం విఫలం..
ట్రెండింగ్
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!