Botsa Satyanarayana: అమాయక ప్రజలను చంపేస్తే చూస్తూ ఊరుకోవాలా..? జీవో ఒక్కసారి చదువుకోండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Botsa Satyanarayana: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్న సభల్లో కందుకూరులో 8 మంది మృతిచెందిన ఘటన మరువక ముందే, గుంటూరులో ముగ్గురు మృతిచెందారు.. ఇక, ఆ తర్వాత రోడ్లపై బహిరంగసభలు, ర్యాలీలను నిషేధిస్తూ వైఎస్ జగన్ సర్కార్ జీవో నంబర్ 1ని విడుదల చేసింది.. అయితే, దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.. అయితే, ఈ వ్యవహారంపై విపక్షాలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ.. చంద్రబాబు పర్యటనలకు లక్షలాది మంది ప్రజలు వస్తుంటే ప్రభుత్వం అడ్డుకుంటున్నట్లు ప్రచారం చేస్తున్నారు.. జీవో నంబర్ 1 ద్వారా ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారని అంటున్నారు.. ఈ జీవోను ఒకసారి ప్రతిపక్షాలు చదువుకోవాలని హితవుపలికారు. జీవోలో ఎక్కడైనా సమావేశాలు, ర్యాలీలను నిషేధించినట్లు ఉందా? అని ప్రశ్నించారు.. రోడ్ల మీద బహిరంగ సభలు పెట్టవద్దు అని మాత్రమే ఉంది.. మరీ అవసరమైతే అనుమతి తీసుకుని పెట్టండి అని ఉందని చెప్పుకొచ్చారు.
Read Also: Kamareddy Collector: అపోహలొద్దు.. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై కలెక్టర్ క్లారిటీ..
Also Read
చంద్రబాబు అబద్దాల కోరు అని ప్రజలకు తెలుసు అంటూ మండిపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ.. కందుకూరు సభలో 8 మంది చనిపోతే చంద్రబాబు బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పలేదన్న ఆయన.. అమాయక ప్రజలను చంపేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా..? ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది.. అందుకే జీవో నంబర్ 1ని తీసుకొచ్చాం… అనుమతులు తీసుకొని.. ప్రజలకు ఇబ్బందులు లేని చోట సభలు నిర్వహించుకోవచ్చు అన్నారు.. ఇక, వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలు, సభల సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే వాళ్లం అని వెల్లడించారు. ప్రతిపక్షాలు ఇప్పటికైనా మైండ్ సెట్ మార్చుకోవాలి.. అధికార పక్షం, ప్రతిపక్షాలు ప్రజలకు బాధ్యతగా ఉండాలని సూచించారు మంత్రి బొత్స సత్యనారాయణ.
తాజావార్తలు
-
Shabad: 48 గంటలు దాటినా దొరకని నిందితుడు.. రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు.!
-
Vaibhav-BCCI: వైభవ్కు అవకాశం ఇవ్వాల్సింది కాదు.. బీసీసీఐ తప్పు చేసింది.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Tollywood Sentiments : టాలీవుడ్లో కొత్త సెంటిమెంట్.. పెళ్ళి తర్వాత బ్లాక్బస్టర్ గ్యారెంటీ
-
Nag Ashwin: నేను ఏమి చేస్తున్నానో నాకు తెలుసు… ‘కల్కి’పై విమర్శలకు నాగ్ అశ్విన్ స్ట్రాంగ్ కౌంటర్
-
Bihar Bank Account Glitch: పింఛను తీసుకునే తండ్రీకొడుకుల ఖాతాలో.. ఏకంగా రూ. 1500 కోట్ల బ్యాలెన్స్..!
ట్రెండింగ్
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్!
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?