Botsa Satyanarayana:విపక్షాల్ని పట్టించుకోవద్దు… అభివృద్ధి చేసుకుపోదాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో అభివృద్ధి పథకాలు గతంలోకంటే బాగా అమలు అవుతున్నాయని, విపక్షాల విమర్శల్ని అసలు పట్టించుకోవద్దన్నారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. టీడీపీ నాయకులు ఎన్నైనా మాట్లాడుతారు. సమాధానం మనం చేసే పని కార్యక్రమాలు ఉండాలి. మూడు సంవత్సరాలు అయ్యింది అధికారంలోకి వచ్చి… తండ్రి తనయులు జిల్లాకి చేసిన అభివృద్ధి పనులు టీడీపీ ప్రభుత్వం కంటే ఎక్కువే అని చెప్పగలం. ప్రతిపక్షాలు ఏదేదో మాట్లాడుతారు… పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు మంత్రి బొత్స.
ప్లీనరీ అయిన తరువాత నియోజకవర్గం స్థాయిలో శ్వేత పత్రం విడుదల చేస్తాం. సంక్షేమ కోసం అయిదు వేల కోట్ల రూపాయలు లబ్ధిదారులకు ఇచ్చాం. రాబోయే రెండేళ్లలో మరో రెండు వేల కోట్ల రూపాయలు ఇవ్వనున్నాం. ఈ డబ్బు ఇస్తోంది పేదవాడి స్థితి గతులు మారాలని. అవి ఊరకనే ఇవ్వడం లేదు. బాబొస్తే జాబొస్తాదని చెప్పారు మరి ఎందుకు ఇవ్వలేకపోయారు. జగన్ మోహన్ రెడ్డి వచ్చిన తురువాత వ్యవస్థలను స్థాపించారు…. చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చారు. సంక్షేమ పథకాలు అప్పడు పచ్చ చొక్కాలు వేసుకునే వారికే వచ్చేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు… అర్హత ఉంటే చాలు వారికి లబ్ధి చేకూరుతుంది.ఎక్కడా దళారులు లేకుండా పథకాల అమలు విజయవంతంగా సాగుతోందన్నారు.
Also Read
BJP: ఏపీ సీఎం జగన్కు జీవీఎల్ సవాల్.. అంత ధైర్యముంటే అసెంబ్లీని రద్దు చేయండి
హుద్ హుద్ తుఫాన్ వచ్చిన రెండు రోజుల వరకూ విశాఖలో నీళ్లు రాలేదు. బస్సులో పడుకుంటే ఏంటీ ఇంట్లో పడుకుంటే ఏంటి? ప్రజలకు నీళ్లు ఇవ్వాలి, కరెంటు అందాలి… ఇది చేయలేకపోయారు. మైండ్ డైవర్సన్స్ వస్తున్నాయి.. జాగ్రత్త పడండి.. మారండి. జిల్లాకు రాజకీయంగా మంచి పేరుంది… ఇక్కడ నిర్ణయాలు రాష్ట్ర పార్టీలో మార్పులు చేసే వారు. మూడు నెలలకు జిల్లా పార్టీ సమావేశాలు నిర్వహించాలి. తప్పు జరిగితే సమర్ధించ కూడదు… సమస్య వినాలి సరిదిద్దే ప్రయత్నం చేయాలన్నారు మంత్రి బొత్స.
చంద్రబాబు మెడికల్ కాలేజీ ఇచ్చామన్నారు. నేడు మెడికల్ కాలేజీ నిర్మాణం జరుగుతుంది… నిధులు కేటాయించారు… వచ్చే ఏడాదికి మెడికల్ స్టూడెంట్స్ వస్తారు… ఇది వాస్తవం. తారకరామ తీర్ధ సాగర్ ప్రాజెక్టు అశోక్ వద్దంటారు. ఏంటో మరి? 16 వేల కోట్ల రూపాయలు స్కూల్ లో మౌలిక వసతుల కోసం ఖర్చుపెట్టాం. 35 లక్షల మందికి బైజూస్ ద్వారా ఫ్రీగా క్లాసులు చెప్పబోతున్నారు. జిల్లా మీదుగా వెయ్యి కోట్లతో జాతీయ రహదారులు నిర్మాణం సాగుతున్నాయి. భూసేకరణకు చాలా ఇబ్బంది అవుతున్నా… మా ప్రతినిధులతో రైతుకు చెప్పగలుగుతున్నాం. ప్రజాస్వామ్యంలో ఎవరు బాగా చేస్తారో వాళ్లనే ఎన్నుకుంటారు.. గౌరవం అందిస్తారు అన్నారు మంత్రి బొత్స.
BJP National Executive Meeting: ప్రధాని మోడీ రాక.. సిటీలో హోర్డింగుల కాక..
తాజావార్తలు
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
APEAPCET: ఏపీఈఏపీసెట్ ఫలితాలు విడుదల
-
RC18: గురువు తర్వాత శిష్యుడే.. రామ్ చరణ్ మాటతో భారీ అడ్వాన్స్ ఇచ్చిన టాప్ ప్రొడ్యూసర్!
-
Kejriwal: సనాతనం అంటే అధికారం.. డబ్బేనా? అయోధ్య స్కామ్లో బీజేపీపై కేజ్రీవాల్ విమర్శలు
-
Nagabandham : ‘నాగబంధం’ ధైర్యం వెనుక అసలు నిజమిదే!
ట్రెండింగ్
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..