BC Janardhan Reddy: రేపటి నుంచి అస్సాంలో మంత్రి జనార్ధన్ రెడ్డి పర్యటన.. రహదారుల ఆస్తుల నిర్వహణపై సమీక్ష
- మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో అస్సాంలో ఉన్నతస్థాయి ప్రతినిధుల బృందం పర్యటన అస్సాంలో రెండు రోజుల పాటు పర్యటించనున్న మంత్రి ఆధ్వర్యంలోని బృందం అస్సాం రాష్ట్రంలో రహదారుల ఆస్తుల నిర్వహణ విధానం అమలు తీరును పరిశీలించనున్న బృందం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BC Janardhan Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రహదారుల ఆస్తుల నిర్వహణ విధానం అమలులో సంస్థాపరంగా వచ్చే సమస్యలు ఎదుర్కొనే తీరుని పరిశీలించేందుకు రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం అస్సాంలో పర్యటించనుంది. గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో గతుకుల, గుంతల రోడ్లతో ప్రజలు పడిన అవస్థలను దృష్టిలో ఉంచుకుని మెరుగైన రోడ్ల ఏర్పాటే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందుకనుగుణంగా రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి & నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పనలో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని దేశ వ్యాప్తంగా అమలవుతున్న నూతన విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది.
Also Read
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Pawan Kalyan: జనసేనలో సంస్థాగత పునర్వ్యవస్థీకరణ.. పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ ఇదే..
- ALP: ఒంగోలులో లోకో పైలట్పై దాడి.. రైల్వే అధికారుల దర్యాప్తు..
- AP Weather: ఏపీలో విచిత్ర వాతావరణం.. ఓ వైపు పిడుగులు.. మరోవైపు భానుడి భగభగలు..
ఇక, రేపటి నుంచి రెండు రోజుల పాటు అస్సాంలో వివిధ ప్రాంతాలను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం సందర్శించనుంది. ముఖ్యంగా తొలి రోజు పర్యటనలో భాగంగా అస్సాం రాష్ట్ర పబ్లిక్ వర్క్స్ డిపార్టెమెంట్ అధికారులతో ఏపీ రాష్ట్ర ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం భేటీ కానుంది. ఈ సమావేశంలో అస్సాంలో రహదారుల ఆస్తుల నిర్వహణ విధానం అమలులో అనుభవాలు, సమస్యలను ఎదుర్కొన్న తీరుపై అధికారులతో చర్చించనుంది. అలాగే, గత రెండు దశాబ్దాలుగా అస్సాం రాష్ట్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ లో వచ్చిన మార్పులపై సైతం రాష్ట్ర ఉన్నతస్థాయి ప్రతినిధుల బృందం చర్చించనుంది.
Read Also: Minister Seethakka: మాజీ మహిళా మంత్రుల చరిత్ర.. ఇప్పటి మహిళా మంత్రుల చరిత్ర ప్రజలకు తెలుసు
అలాగే, తొలి రోజు అస్సాంలో ఆల్ఫ్రోస్కో గ్రాండ్ లో బ్రహ్మపుత్ర క్రూయిజ్, రాజధాని గౌహతి – పంబ బజార్ లో బ్రహ్మపుత్ర రివర్ ఫ్రంట్ లను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలోని టీమ్ పరిశీలించనుంది. ఇక, రెండో రోజు అస్సాం పర్యటనలో భాగంగా తొలుత అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన కామాఖ్య అమ్మవారి దేవాలయాన్ని ఈ ఉన్నతస్థాయి ప్రతినిధుల బృందం సందర్శించనుంది. దీంతో పాటు అస్సోంలో బ్రహ్మపుత్ర నదిపై నిర్మాణంలో ఉన్న గౌహతి – ఉత్తర గౌహతి వంతెనను కూడా ఈ బృందం సందర్శిచే అవకాశం ఉంది. రోడ్డు ఆస్తుల నిర్వహణ విధానంపై ప్రత్యక్ష డేటా సేకరణపై ప్రదర్శన కోసం అస్సాం మాల కారిడార్ లోని “పలాష్బరి మీర్జా చందుబీ రోడ్” కూడా సందర్శించనుంది. ఆ తర్వాత ఉన్నత స్థాయి బృందం తిరిగి రాష్ట్రానికి రానుంది.
తాజావార్తలు
-
E85 Fuel: భారత్ లో E85 ఇంధనం విడుదల.. పెట్రోల్ కంటే రూ.20 చౌక..! ప్రత్యేకతలు ఇవే
-
India Forex Reserves: రూపాయి స్థిరత్వానికి బలం.. పెరిగిన విదేశీ మారక నిల్వలు.. 938 మిలియన్ డాలర్ల వృద్ధి
-
Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
-
Peddi: జాన్వీ కపూర్ పాత్రపై డైరెక్టర్ బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
-
Abhijeet Dipke: అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. నేటి నుంచి నిరసనలు
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!