బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుపై మండిపడ్డారు ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్. పారిశ్రామిక రంగంలో ఏపీ పోటీ పడుతున్న తరుణంలో బీజేపీ వారు సెల్ఫ్ గోల్ ఎందుకో అర్థం కావడం లేదన్నారు. ఏపీ నెంబర్ వన్ అని ఇచ్చింది బీజేపీ ప్రభుత్వమే.ఈజ్ ఆఫ్ డ్యూయింగ్ అనేది ప్రమాణాలతో ఇచ్చే విధానం. ఏపీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ముందుంటే.. బీజేపీ ఈజ్ ఆఫ్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ముందు వరసలో వుంది. దానికి సమాధానం చెప్పండి ముందు అన్నారు అమర్నాథ్.
స్టీల్ ప్లాంట్ అమ్మకంకి పెట్టింది బీజేపీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నిస్తున్నాం. Air force, railway, defence… ఇలా అన్నీ ప్రైవేట్ పరం చేయడం లేదా? సర్వే అంతా క్షేత్ర స్థాయిలో జరిగింది. NDA వారు ఇచ్చినది. చంద్ర బాబు అడుగు జాడల్లో నడుస్తోంది మీరు కాదా? టీడీపీ హయాంలో రాష్ట్రం లో 60పైగా ప్రైవేట్ పరం చేసారు. పెట్టుబడి పెట్టాలి అనుకునే ప్రతీ వ్యక్తికీ పూర్తి సహకారం ఏపీ ప్రభుత్వం అందిస్తోందన్నారు. జరిగిన ప్రతీ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తోంది. మేము ఎందుకు ప్రభుత్వం రద్దుచేయాలో చెప్పాలన్నారు మంత్రి అమర్నాథ్.
ఆత్మకూరు తిరుపతి ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ రాలేదు అయినా ఇంకా బుధ్ధి రాలేదు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పెట్టండి మేము సిగ్గులేకుండా డిపాజిట్లు కోల్పోతాం అనుకుంటే మీ ఇష్టం. కేంద్రంలో అధికారం ఉంది ఏమైనా చేసుకోమనండి. మీరు ఎవ్వర్ని తెచ్చుకున్నా గెలుపుమాదే అన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్.
GVL Narsimha Rao: తెలుగు రాష్ట్రాలపై ఇక ప్రత్యేక దృష్టి